ETV Bharat / bharat

వాట్సాప్ మెసేజ్​లు ట్రేస్ చేయొచ్చా?.. కేంద్రానికి హైకోర్టు నోటీసులు

author img

By

Published : Aug 27, 2021, 3:01 PM IST

Updated : Aug 27, 2021, 4:26 PM IST

కొత్త ఐటీ నిబంధనలు-2021లోని 4(2) సెక్షన్​ను సవాలు చేస్తూ వాట్సాప్​, ఫేస్​బుక్ పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై స్పందించాల్సిందిగా దిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

Delhi High Court
దిల్లీ హైకోర్టు

కొత్త ఐటీ నిబంధనలపై కేంద్రానికి దిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వాట్సాప్, ఫేస్‌బుక్​ దాఖలు చేసిన పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

ఐటీ నిబంధనలు-2021లోని 4(2)ను వాట్సాప్​, ఫేస్​బుక్​ సవాల్ చేస్తూ.. పిటిషన్ దాఖలు చేశాయి. ఐటీ నిబంధనల్లో 4(2) నియమం భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధమని అందు​లో పేర్కొన్నాయి. దీని ద్వారా వినియోగదారుల గోప్యతకు భంగం కలుగుతుందని వివరించాయి. ముఖ్యంగా 'ట్రేసబిలిటీ' విధానానికి సంబంధించిన నిబంధనను సవరించాలని వాట్సాప్​ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ తన వాదనను వినిపించారు.

అయితే కేంద్రం తరఫు ప్రధాన న్యాయవాది అందుబాటులో లేని కారణంగా కేసును వాయిదా వేయాలని సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు కోర్టు సానుకూలంగా స్పందించింది. తదుపరి విచారణను అక్టోబర్​ 22కు వాయిదా వేసింది. 4(2) నియమంపై ఫేస్​బుక్​, వాట్సాప్​ అభ్యంతరాలతోపాటు ఐటీ నిబంధనల అమలుపై స్టే విధించాలన్న పిటిషన్​పై ఈలోగా తమ వాదనలు సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

ఇదీ చూడండి: 'దేశ్​ కా మెంటర్స్'​​ బ్రాండ్​ అంబాసిడర్​గా సోనూసూద్​

కొత్త ఐటీ నిబంధనలపై కేంద్రానికి దిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వాట్సాప్, ఫేస్‌బుక్​ దాఖలు చేసిన పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

ఐటీ నిబంధనలు-2021లోని 4(2)ను వాట్సాప్​, ఫేస్​బుక్​ సవాల్ చేస్తూ.. పిటిషన్ దాఖలు చేశాయి. ఐటీ నిబంధనల్లో 4(2) నియమం భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధమని అందు​లో పేర్కొన్నాయి. దీని ద్వారా వినియోగదారుల గోప్యతకు భంగం కలుగుతుందని వివరించాయి. ముఖ్యంగా 'ట్రేసబిలిటీ' విధానానికి సంబంధించిన నిబంధనను సవరించాలని వాట్సాప్​ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ తన వాదనను వినిపించారు.

అయితే కేంద్రం తరఫు ప్రధాన న్యాయవాది అందుబాటులో లేని కారణంగా కేసును వాయిదా వేయాలని సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు కోర్టు సానుకూలంగా స్పందించింది. తదుపరి విచారణను అక్టోబర్​ 22కు వాయిదా వేసింది. 4(2) నియమంపై ఫేస్​బుక్​, వాట్సాప్​ అభ్యంతరాలతోపాటు ఐటీ నిబంధనల అమలుపై స్టే విధించాలన్న పిటిషన్​పై ఈలోగా తమ వాదనలు సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

ఇదీ చూడండి: 'దేశ్​ కా మెంటర్స్'​​ బ్రాండ్​ అంబాసిడర్​గా సోనూసూద్​

Last Updated : Aug 27, 2021, 4:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.