ఆక్సిజన్ కొరతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ప్రాణవాయువును అవసరాల మేరకు మాత్రమే ఉపయోగించుకోవాలని సూచించింది. కరోనా వైరస్ కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని మెడికల్ ఆక్సిజన్ వినియోగంపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.
దేశంలో తగినంత ఆక్సిజన్ నిల్వ ఉన్నందున లభ్యత గురించి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు హోంశాఖ అదనపు కార్యదర్శి పియూష్ గోయల్ ఆయా ప్రభుత్వాధికారులతో సమీక్ష నిర్వహించారు.
జంబో కంటైనర్ల ఏర్పాటు...
పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని ఆక్సిజన్తో కూడిన పడకల సంఖ్యను పెంచే దిశగా కేంద్రం ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకుగాను ప్రాణావాయువు ఉత్పత్తి చేసే పరిశ్రమలకు దగ్గరగా ఉన్న ఆసుపత్రుల్లో జంబో కంటైనర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
ఇప్పటికే ఉక్కు కర్మాగారాలు ద్రవ ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాయని తెలిపింది. దీంతో ప్రజావసరాలకు సరిపడినంత ఆక్సిజన్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి గోయల్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఇవీ చూడండి: