ETV Bharat / bharat

భారీగా ట్రాఫిక్ జామ్.. తల్లితో కలిసి నీట్ అభ్యర్థి పరుగు.. అయినా ఆలస్యంగానే..

author img

By

Published : May 8, 2023, 10:32 PM IST

ట్రాఫిక్ జామ్​లో ఇరుక్కుని ఓ విద్యార్థిని నీట్ ప్రవేశ పరీక్ష రాయలేకపోయింది. ఈ ఘటన కేరళలో జరిగింది. ఏడాదిపాటు కష్టపడి ప్రిపేర్ అయిన ఎగ్జామ్ రాయలేకపోయానని కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

Car stuck in Traffic
Car stuck in Traffic

పోటీ, ప్రవేశ పరీక్షలు కోసం ఎంతో కష్టపడి చదువుతుంటారు విద్యార్థులు. రేయింబవళ్లు శ్రమిస్తుంటారు. ఎగ్జామ్​ హాల్​కు నిమిషం ఆలస్యం అయినా పరీక్షను అనుమతించరు నిర్వహకులు. ఎగ్జామ్​కు బాగా ప్రిపేర్ అయ్యి ట్రాఫిక్ సమస్య లేదా ఇతరేత్రా కారణాలకు పరీక్ష రాయలేకపోయివారి బాధ వర్ణనాతీతం. అచ్చం అలాంటి ఘటనే కేరళకు చెందిన ఓ విద్యార్థిని ఎదుర్కొంది.

కన్నూర్​లోని కొత్తుపురంబ నిర్మలగిరికి చెందిన నయనా జార్జ్​.. నీట్​ ప్రవేశ పరీక్షకు సన్నద్ధమైంది. నీట్​ పరీక్ష రాసేందుకు సోమవారం పెరుంబ లతీఫియా ఇంగ్లీష్ మీడియం స్కూల్​కు తన తల్లిదండ్రులు జార్జ్​, రోజ్​ మేరీతో కలిసి కారులో బయలుదేరింది. పరీక్షా కేంద్రానికి మధ్యాహ్నం 12 గంటలలోపు చేరుకోవాలి. నయనా జార్జ్​ ఉదయం 9 గంటలకే తన ఇంటి నుంచి బయలుదేరింది. అయితే కన్నూర్ - పయ్యన్నూర్​లో జాతీయ రహదారిపై ఓ కంటైనర్ లారీ బోల్తా పడింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. నయన్​ ఇంటి నుంచి పయ్యన్నూర్​లోని ఎగ్జామ్ సెంటర్​కు దూరం 62 కిలోమీటర్లు. ట్రాఫిక్ లేని సమయంలో 2 గంటల్లో ఎగ్జామ్ సెంటర్​కు చేరుకోవచ్చు. అయితే సోమవారం కన్నూర్​- పయ్యన్నూర్​ హైవేపై ప్రమాదం జరగడం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్​ అయ్యింది.

Car stuck in Traffic
విద్యార్థిని నయనా జార్జ్

నయన్​ తండ్రి జార్జ్ ఎజిలోడ్​ వరకు​ కారును నడిపారు. అక్కడి నుంచి నయన్ ఎగ్జామ్​ సెంటర్​ దాదాపు 5 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఎంత ఎదురుచూసినా.. ట్రాఫిక్ తగ్గేలా కనిపించలేదు. దీంతో పరీక్షను దృష్టిలో పెట్టుకొని నయనా జార్జ్, ఆమె తల్లి రోజ్ మేరీ కారు దిగి పరుగు ప్రారంభించారు. కిలోమీటర్ దూరం అలాగే పరిగెత్తారు. వీరిద్దరూ ఇలా పరిగెత్తడాన్ని చూసిన ఓ బైకర్.. వెంటనే నయనా జార్జ్​కు లిఫ్ట్ ఇచ్చాడు. బైక్​పై వేగంగా ఎగ్జామ్ సెంటర్​కు తీసుకెళ్లాడు. అయినప్పటికీ నాలుగు నిమిషాలు ఆలస్యంగా ఎగ్జామ్ సెంటర్​కు చేరుకున్నారు. దీంతో నయన్​ను ఎగ్జామ్ సెంటర్​లోకి అనుమతించలేదు. దీంతో నయన్​ ఒక్కసారి తీవ్ర భావోద్వేగానికి గురైంది. మరోవైపు.. ఎగ్జామ్ సెంటర్ బయటే నయనా తల్లి మేరీ స్పృహతప్పి పడిపోయింది. వెంటనే ఆమెను నయనా తండ్రి జార్జ్​ వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

'ఏడాదిపాటు నా కుమార్తె నయనా జార్జ్​ నీట్ కోచింగ్ తీసుకుంది. ఆమె చాలా పట్టుదలతో ప్రిపేర్ అయ్యింది. నా కుమార్తెలాగే చాలా మంది విద్యార్థులు ట్రాఫిక్ సమస్యల వల్ల పరీక్షకు సకాలంలో హాజరుకాలేకపోయారు' అని నయన్ తండ్రి జార్జ్​ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే నయనా సైతం కన్నీరుమున్నీరుగా విలపించింది. సంవత్సరం కాలంగా ఎంతో కష్టపడి నీట్ పరీక్ష కోసం సన్నద్ధమయ్యామని కన్నీటి పర్యంతమైంది.

పోటీ, ప్రవేశ పరీక్షలు కోసం ఎంతో కష్టపడి చదువుతుంటారు విద్యార్థులు. రేయింబవళ్లు శ్రమిస్తుంటారు. ఎగ్జామ్​ హాల్​కు నిమిషం ఆలస్యం అయినా పరీక్షను అనుమతించరు నిర్వహకులు. ఎగ్జామ్​కు బాగా ప్రిపేర్ అయ్యి ట్రాఫిక్ సమస్య లేదా ఇతరేత్రా కారణాలకు పరీక్ష రాయలేకపోయివారి బాధ వర్ణనాతీతం. అచ్చం అలాంటి ఘటనే కేరళకు చెందిన ఓ విద్యార్థిని ఎదుర్కొంది.

కన్నూర్​లోని కొత్తుపురంబ నిర్మలగిరికి చెందిన నయనా జార్జ్​.. నీట్​ ప్రవేశ పరీక్షకు సన్నద్ధమైంది. నీట్​ పరీక్ష రాసేందుకు సోమవారం పెరుంబ లతీఫియా ఇంగ్లీష్ మీడియం స్కూల్​కు తన తల్లిదండ్రులు జార్జ్​, రోజ్​ మేరీతో కలిసి కారులో బయలుదేరింది. పరీక్షా కేంద్రానికి మధ్యాహ్నం 12 గంటలలోపు చేరుకోవాలి. నయనా జార్జ్​ ఉదయం 9 గంటలకే తన ఇంటి నుంచి బయలుదేరింది. అయితే కన్నూర్ - పయ్యన్నూర్​లో జాతీయ రహదారిపై ఓ కంటైనర్ లారీ బోల్తా పడింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. నయన్​ ఇంటి నుంచి పయ్యన్నూర్​లోని ఎగ్జామ్ సెంటర్​కు దూరం 62 కిలోమీటర్లు. ట్రాఫిక్ లేని సమయంలో 2 గంటల్లో ఎగ్జామ్ సెంటర్​కు చేరుకోవచ్చు. అయితే సోమవారం కన్నూర్​- పయ్యన్నూర్​ హైవేపై ప్రమాదం జరగడం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్​ అయ్యింది.

Car stuck in Traffic
విద్యార్థిని నయనా జార్జ్

నయన్​ తండ్రి జార్జ్ ఎజిలోడ్​ వరకు​ కారును నడిపారు. అక్కడి నుంచి నయన్ ఎగ్జామ్​ సెంటర్​ దాదాపు 5 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఎంత ఎదురుచూసినా.. ట్రాఫిక్ తగ్గేలా కనిపించలేదు. దీంతో పరీక్షను దృష్టిలో పెట్టుకొని నయనా జార్జ్, ఆమె తల్లి రోజ్ మేరీ కారు దిగి పరుగు ప్రారంభించారు. కిలోమీటర్ దూరం అలాగే పరిగెత్తారు. వీరిద్దరూ ఇలా పరిగెత్తడాన్ని చూసిన ఓ బైకర్.. వెంటనే నయనా జార్జ్​కు లిఫ్ట్ ఇచ్చాడు. బైక్​పై వేగంగా ఎగ్జామ్ సెంటర్​కు తీసుకెళ్లాడు. అయినప్పటికీ నాలుగు నిమిషాలు ఆలస్యంగా ఎగ్జామ్ సెంటర్​కు చేరుకున్నారు. దీంతో నయన్​ను ఎగ్జామ్ సెంటర్​లోకి అనుమతించలేదు. దీంతో నయన్​ ఒక్కసారి తీవ్ర భావోద్వేగానికి గురైంది. మరోవైపు.. ఎగ్జామ్ సెంటర్ బయటే నయనా తల్లి మేరీ స్పృహతప్పి పడిపోయింది. వెంటనే ఆమెను నయనా తండ్రి జార్జ్​ వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

'ఏడాదిపాటు నా కుమార్తె నయనా జార్జ్​ నీట్ కోచింగ్ తీసుకుంది. ఆమె చాలా పట్టుదలతో ప్రిపేర్ అయ్యింది. నా కుమార్తెలాగే చాలా మంది విద్యార్థులు ట్రాఫిక్ సమస్యల వల్ల పరీక్షకు సకాలంలో హాజరుకాలేకపోయారు' అని నయన్ తండ్రి జార్జ్​ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే నయనా సైతం కన్నీరుమున్నీరుగా విలపించింది. సంవత్సరం కాలంగా ఎంతో కష్టపడి నీట్ పరీక్ష కోసం సన్నద్ధమయ్యామని కన్నీటి పర్యంతమైంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.