యూరోపియన్ సమాఖ్య ఎంపీల బృందం పర్యటన ద్వారా కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేసే ఉద్దేశం ఎంత మాత్రం లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇలాంటి బృందాలు అధికారిక మార్గాల ద్వారా రావాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈయూ ఎంపీల బృందం కశ్మీర్ సందర్శనపై మొదటిసారి స్పందించిన విదేశాంగశాఖ ఇలాంటి పర్యటనలకు విస్తృత జాతీయ ప్రయోజనాలే ముఖ్యమని తేల్చిచెప్పింది.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈయూ ఎంపీల రెండు రోజుల పర్యటనలో భాగంగా.. కశ్మీర్లో తాజా పరిస్థితిని పరిశీలించిన్నట్లు అధికారులు తెలిపారు.
యూరోపియన్ ఎంపీల పర్యటనను ప్రజల మధ్య సంబంధాలు ఏర్పరిచే ప్రక్రియగా భావిస్తున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. పరిశీలన తర్వాత ఎంపీల అభిప్రాయాలు కశ్మీర్లోని వాస్తవ పరిస్థితులు ప్రపంచానికి బహిర్గతమవుతాయని రవీష్ అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి:కశ్మీర్: విభజన రోజూ అదే పరిస్థితి