ETV Bharat / bharat

కుండపోత వర్షం.. మిగిల్చెను భారీ నష్టం

author img

By

Published : Oct 14, 2020, 6:00 PM IST

వాయుగుండం ప్రభావంతో కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెలంగాణకు సరిహద్దు జిల్లాలు అయిన కల్బురిగి, యాద్గిర్, బీదర్‌ ప్రాంతాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది.

Uttara Kannada districts are facing floods due to heavy rains
ఉత్తర కర్ణాటకలో కుంభవృష్టి-పొంగిపొర్లుతున్న ప్రధాన నదులు

వాయుగుండం ప్రభావంతో ఉత్తర కర్ణాటకలో కుంభవృష్టిగా వానలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలకు భారీగా వరద నీరు చేరుతోంది. అనేక ప్రాంతాల్లో ఇళ్లు నీటిలోనే ఉన్నాయి. పంట నష్టం భారీగా సంభవించింది. కల్బురిగి, యాద్గిర్, బీదర్‌ ప్రాంతాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉందని.. ఆయా గ్రామాల్లో సహాయక చర్యలు చేపడుతున్నామని అధికారులు వెల్లడించారు.

కుండపోత వర్షం... మిగిల్చెను భారీ నష్టం

రక్షణచర్యల్లో అధికారులు...

చించోలి తాలుకాలోని చందాపుర్​లో 22 మందిని అధికారులు రక్షించారు. బీదర్​-చించోలి మధ్య నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద ముగ్గురు బిహార్​ కార్మికులను ఒడ్డుకు చేర్చారు. అన్ని ప్రధాన నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయని అధికారులు తెలిపారు. అనేక గ్రామాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయని.. ఆయా గ్రామాల ప్రజలను సురక్షిత శిబిరాలకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.

Uttara Kannada districts are facing floods due to heavy rains
సహాయక చర్యల్లో అధికారులు

రాకపోకలకు అంతరాయం...

తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలను కలిపే మలఖేడా వంతెన వద్ద వరదనీరు ఎక్కువగా ప్రవహిస్తుండటం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం కారణంగా పలు గ్రామాలు ద్వీపాలను తలపిస్తున్నాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Uttara Kannada districts are facing floods due to heavy rains
ఇళ్ల వద్దకు చేరుకున్న వరదనీరు

ఇదీ చూడండి: విపత్తులను ఎదుర్కోవడంలో నేర్వాల్సిన పాఠాలెన్నో..

వాయుగుండం ప్రభావంతో ఉత్తర కర్ణాటకలో కుంభవృష్టిగా వానలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలకు భారీగా వరద నీరు చేరుతోంది. అనేక ప్రాంతాల్లో ఇళ్లు నీటిలోనే ఉన్నాయి. పంట నష్టం భారీగా సంభవించింది. కల్బురిగి, యాద్గిర్, బీదర్‌ ప్రాంతాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉందని.. ఆయా గ్రామాల్లో సహాయక చర్యలు చేపడుతున్నామని అధికారులు వెల్లడించారు.

కుండపోత వర్షం... మిగిల్చెను భారీ నష్టం

రక్షణచర్యల్లో అధికారులు...

చించోలి తాలుకాలోని చందాపుర్​లో 22 మందిని అధికారులు రక్షించారు. బీదర్​-చించోలి మధ్య నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద ముగ్గురు బిహార్​ కార్మికులను ఒడ్డుకు చేర్చారు. అన్ని ప్రధాన నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయని అధికారులు తెలిపారు. అనేక గ్రామాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయని.. ఆయా గ్రామాల ప్రజలను సురక్షిత శిబిరాలకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.

Uttara Kannada districts are facing floods due to heavy rains
సహాయక చర్యల్లో అధికారులు

రాకపోకలకు అంతరాయం...

తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలను కలిపే మలఖేడా వంతెన వద్ద వరదనీరు ఎక్కువగా ప్రవహిస్తుండటం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం కారణంగా పలు గ్రామాలు ద్వీపాలను తలపిస్తున్నాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Uttara Kannada districts are facing floods due to heavy rains
ఇళ్ల వద్దకు చేరుకున్న వరదనీరు

ఇదీ చూడండి: విపత్తులను ఎదుర్కోవడంలో నేర్వాల్సిన పాఠాలెన్నో..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.