ETV Bharat / bharat

కొవిడ్‌ శాంపిళ్లు ఎత్తుకెళ్లిన కోతులు

author img

By

Published : May 29, 2020, 7:23 PM IST

ఓ కోతుల గుంపు ల్యాబ్​ టెక్నీషియన్​పై దాడి చేసి, కొవిడ్​-19 శాంపిళ్లు తీసుకుపోయిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​ మేరఠ్​లో జరిగింది. కోతులు కనుక ఆ శాంపిళ్లను పీల్చితే... వాటికి కూడా వైరస్​ సోకే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు. దీనితో కరోనా వైరస్ తమ ప్రాంతంలో ఎక్కడ వ్యాపిస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

UP meerut monkeys run away with covid-19 samples
కొవిడ్‌ శాంపిళ్లు ఎత్తుకెళ్లిన కోతులు

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ ఉత్తర్‌ప్రదేశ్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కరోనా అనుమానితుల నుంచి సేకరించిన శాంపిళ్లను ఓ కోతుల గుంపు ఎత్తుకెళ్లింది. మేరఠ్‌లోని మెడికల్‌ కళాశాల ఆవరణలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

కొవిడ్‌ శాంపిళ్లు ఎత్తుకెళ్లిన కోతులు

ముగ్గురు కొవిడ్‌-19 అనుమానితుల నుంచి శాంపిళ్లు తీసుకుని వెళుతుండగా ల్యాబ్‌ టెక్నీషియన్‌పై కోతుల గుంపు దాడి చేసింది. అతడి చేతిలో ఉన్న శాంపిళ్లను ఎత్తుకెళ్లాయి. వాటిని కోతులు తమ వెంటే పట్టుకెళ్లడంతో వైద్యులు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ గుంపులోని ఓ కోతి శాంపిళ్లను నోటితో పీల్చడం కనిపించింది. దీంతో కోతులకు కూడా కరోనా సోకే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. దీనికి తోడు ఆ శాంపిళ్లను కోతులు పట్టుకెళ్లడంతో స్థానికులు సైతం భయాందోళనకు గురవుతున్నారు. వాటి వల్ల కరోనా వైరస్‌ ఎక్కడ సోకుతోందనని భయపడుతున్నారు.

ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు మెడికల్‌ కళాశాల సూపరింటిండెంట్‌ డాక్టర్‌ ధీరజ్‌ బాల్యన్‌ తెలిపారు. దీనిపై అటవీ అధికారులకు తెలియజేసినా వారు కోతులను పట్టుకోలేదని తెలిపారు. మరోవైపు శాంపిళ్లను ఎత్తుకెళ్లడంతో అనుమానితుల నుంచి మరోసారి శాంపిళ్లను సేకరించారు.

ఇదీ చూడండి: లాక్​డౌన్​ 5.0: రాష్ట్రాలకు అధికారం-కేంద్రం సమన్వయం!

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ ఉత్తర్‌ప్రదేశ్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కరోనా అనుమానితుల నుంచి సేకరించిన శాంపిళ్లను ఓ కోతుల గుంపు ఎత్తుకెళ్లింది. మేరఠ్‌లోని మెడికల్‌ కళాశాల ఆవరణలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

కొవిడ్‌ శాంపిళ్లు ఎత్తుకెళ్లిన కోతులు

ముగ్గురు కొవిడ్‌-19 అనుమానితుల నుంచి శాంపిళ్లు తీసుకుని వెళుతుండగా ల్యాబ్‌ టెక్నీషియన్‌పై కోతుల గుంపు దాడి చేసింది. అతడి చేతిలో ఉన్న శాంపిళ్లను ఎత్తుకెళ్లాయి. వాటిని కోతులు తమ వెంటే పట్టుకెళ్లడంతో వైద్యులు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ గుంపులోని ఓ కోతి శాంపిళ్లను నోటితో పీల్చడం కనిపించింది. దీంతో కోతులకు కూడా కరోనా సోకే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. దీనికి తోడు ఆ శాంపిళ్లను కోతులు పట్టుకెళ్లడంతో స్థానికులు సైతం భయాందోళనకు గురవుతున్నారు. వాటి వల్ల కరోనా వైరస్‌ ఎక్కడ సోకుతోందనని భయపడుతున్నారు.

ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు మెడికల్‌ కళాశాల సూపరింటిండెంట్‌ డాక్టర్‌ ధీరజ్‌ బాల్యన్‌ తెలిపారు. దీనిపై అటవీ అధికారులకు తెలియజేసినా వారు కోతులను పట్టుకోలేదని తెలిపారు. మరోవైపు శాంపిళ్లను ఎత్తుకెళ్లడంతో అనుమానితుల నుంచి మరోసారి శాంపిళ్లను సేకరించారు.

ఇదీ చూడండి: లాక్​డౌన్​ 5.0: రాష్ట్రాలకు అధికారం-కేంద్రం సమన్వయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.