ETV Bharat / bharat

మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం- ఆరుగురు మృతి - ట్రక్కు-కారు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి

మహారాష్ట్ర చంద్రపుర్​ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వస్తున్న స్పోర్ట్స్​ కారు.. ట్రక్కులోకి దూసుకెళ్లడం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు.

Truck and Car accident in Chandrapur District of Maharashtra
ట్రక్కు-కారు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి
author img

By

Published : Feb 20, 2020, 9:21 AM IST

Updated : Mar 1, 2020, 10:21 PM IST

మహారాష్ట్ర చంద్రపుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు-కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం - ఆరుగురు మృతి

ట్రక్కులోకి దూసుకెళ్లిన కారు...

అర్ధరాత్రి 1:30 గంటల ప్రాంతంలో చంద్రపుర్​-ముల్​ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి సుమారుగా 30కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు నియంత్రణ కోల్పోయి... ట్రక్కులోకి దూసుకెళ్లడం వల్ల ఈ ఘటన జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: 'భారతీయుడు-2' సెట్స్​లో ప్రమాదంపై కమల్ విచారం

మహారాష్ట్ర చంద్రపుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు-కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం - ఆరుగురు మృతి

ట్రక్కులోకి దూసుకెళ్లిన కారు...

అర్ధరాత్రి 1:30 గంటల ప్రాంతంలో చంద్రపుర్​-ముల్​ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి సుమారుగా 30కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు నియంత్రణ కోల్పోయి... ట్రక్కులోకి దూసుకెళ్లడం వల్ల ఈ ఘటన జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: 'భారతీయుడు-2' సెట్స్​లో ప్రమాదంపై కమల్ విచారం

Last Updated : Mar 1, 2020, 10:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.