ETV Bharat / bharat

'తేజస్వి యాదవ్​కు​ కేబినెట్ స్పెల్లింగే రాదు'

author img

By

Published : Oct 31, 2020, 6:36 PM IST

ఆర్​జేడీ నేత తేజస్వి యాదవ్​పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి అశ్వినీ చౌబే. కేబినెట్ పదానికి స్పెల్లింగ్​ తెలియని వ్యక్తి ఇంజినీరింగ్ చదివిన సీఎం నితీశ్ కుమార్​ను విమర్శిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్-ఆర్​జేడీ కూటమి తప్పుడు హామీలు ఇస్తోందని ఆరోపించారు.

TEJASWI-ASHWINI
అశ్వినీ- తేజస్వీ

ఆర్​జేడీ నేత తేజస్వీ యాదవ్​పై కేంద్రమంత్రి అశ్వినీ చౌబే తీవ్ర విమర్శలు చేశారు. కేబినెట్ పదానికి స్పెల్లింగ్ కూడా చెప్పలేని తేజస్వీ.. ఇంజనీరింగ్ పట్టభద్రుడైన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను విమర్శిస్తున్నారా? అంటూ ఎద్దేవా చేశారు.

"పదో తరగతి కూడా పాస్‌ కాని ఒక వ్యక్తి.. ఇంజనీరింగ్ పట్టభద్రుడైన నితీశ్‌ కుమార్‌ను విమర్శిస్తున్నారు. ఆయనకు కనీసం కేబినెట్ స్పెల్లింగ్ కూడా రాయడం రాదు. ఆయన తండ్రి లక్ష ఉద్యోగాలు కల్పిస్తానని మొదటి కేబినెట్‌ సమావేశంలో హామీ ఇచ్చారు. ఇప్పటికీ ఆ ఉద్యోగ దరఖాస్తులు అక్కడ చెత్త బుట్టలోనే ఉన్నాయి. ఉద్యోగాల పేరు చెప్పి డబ్బులు మాత్రం వసూలు చేశారు. కాంగ్రెస్‌, ఆర్జేడీ కూటమి తప్పుడు హామీలు మాత్రమే ఇస్తుంది. వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి."

- అశ్వినీ చౌబే, కేంద్రమంత్రి

నితీశ్ నాయకత్వంలో అభివృద్ధి జరగలేదని, నిరుద్యోగం తాండవిస్తోందని అంతకుముందు వ్యాఖ్యలు చేశారు తేజస్వి. తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొడుతున్నారు. అయితే ఆ హామీని అధికార కూటమి మొదటి నుంచీ విమర్శిస్తోంది.

తేజస్వి యాదవ్‌ను 'ఆటవిక రాజ్యానికి రాకుమారుడి'తో పోలుస్తూ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు చేశారు. కిడ్నాపులపై వారికి కాపీరైట్ ఉందని ఆరోపిస్తూ, జాగ్రత్తగా ఉండమని ప్రజలకు సూచించారు. చీకటి నుంచి బిహార్‌ను బయటపడేసిన ప్రభుత్వాన్ని తిరిగి ఎన్నుకోవడానికి మరోసారి అవకాశం వచ్చిందన్నారు మోదీ.

ఇదీ చూడండి: ఎన్నికల ప్రచార సభలో ప్రతిపక్ష నేతపైకి చెప్పులు

ఆర్​జేడీ నేత తేజస్వీ యాదవ్​పై కేంద్రమంత్రి అశ్వినీ చౌబే తీవ్ర విమర్శలు చేశారు. కేబినెట్ పదానికి స్పెల్లింగ్ కూడా చెప్పలేని తేజస్వీ.. ఇంజనీరింగ్ పట్టభద్రుడైన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను విమర్శిస్తున్నారా? అంటూ ఎద్దేవా చేశారు.

"పదో తరగతి కూడా పాస్‌ కాని ఒక వ్యక్తి.. ఇంజనీరింగ్ పట్టభద్రుడైన నితీశ్‌ కుమార్‌ను విమర్శిస్తున్నారు. ఆయనకు కనీసం కేబినెట్ స్పెల్లింగ్ కూడా రాయడం రాదు. ఆయన తండ్రి లక్ష ఉద్యోగాలు కల్పిస్తానని మొదటి కేబినెట్‌ సమావేశంలో హామీ ఇచ్చారు. ఇప్పటికీ ఆ ఉద్యోగ దరఖాస్తులు అక్కడ చెత్త బుట్టలోనే ఉన్నాయి. ఉద్యోగాల పేరు చెప్పి డబ్బులు మాత్రం వసూలు చేశారు. కాంగ్రెస్‌, ఆర్జేడీ కూటమి తప్పుడు హామీలు మాత్రమే ఇస్తుంది. వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి."

- అశ్వినీ చౌబే, కేంద్రమంత్రి

నితీశ్ నాయకత్వంలో అభివృద్ధి జరగలేదని, నిరుద్యోగం తాండవిస్తోందని అంతకుముందు వ్యాఖ్యలు చేశారు తేజస్వి. తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొడుతున్నారు. అయితే ఆ హామీని అధికార కూటమి మొదటి నుంచీ విమర్శిస్తోంది.

తేజస్వి యాదవ్‌ను 'ఆటవిక రాజ్యానికి రాకుమారుడి'తో పోలుస్తూ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు చేశారు. కిడ్నాపులపై వారికి కాపీరైట్ ఉందని ఆరోపిస్తూ, జాగ్రత్తగా ఉండమని ప్రజలకు సూచించారు. చీకటి నుంచి బిహార్‌ను బయటపడేసిన ప్రభుత్వాన్ని తిరిగి ఎన్నుకోవడానికి మరోసారి అవకాశం వచ్చిందన్నారు మోదీ.

ఇదీ చూడండి: ఎన్నికల ప్రచార సభలో ప్రతిపక్ష నేతపైకి చెప్పులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.