ETV Bharat / bharat

బాలికపై 22 రోజులపాటు సామూహిక అత్యాచారం

author img

By

Published : Oct 15, 2020, 2:03 PM IST

దేశంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో మరో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఒడిశా కటక్​ సమీపంలో ఓ అమ్మాయిపై 22 రోజుల పాటు సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనతో సంబంధం ఉన్న ఒక నిందితుడిని అరెస్టు చేయగా.. మరోకరి కోసం గాలిస్తున్నారు.

Teenage girl gang-raped for 22 days in Odisha
17ఏళ్ల బాలికపై 22 రోజులపాటు సామూహిక అత్యాచారం

ఒడిశా కటక్​లో 17 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం జరిగింది. సుమారు 22 రోజుల పాటు సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. జగత్​ సింగ్​పుర్ జిల్లాలోని తిర్తోల్​కు చెందిన బాలిక నెల రోజుల కిందట ఇంటి నుంచి పారిపోయి కటక్​కు వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్లాలనుకునే క్రమంలో ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు.

బండిపై దింపుతానంటూ...

ఇంటికి వెళ్లాలి అనుకున్న అమ్మాయికి లిఫ్ట్​ ఇస్తానంటూ నిందితుడు మోసగించాడు. సమీపంలోని కోళ్లఫారంకు తీసుకుని వెళ్లి 22 రోజులు పలు దఫాలుగా అత్యాచారం చేసినట్లు అధికారులు తెలిపారు. ఫారం దగ్గర కదలికలపై స్థానికులు సమాచారం ఇవ్వగా.. రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను కాపాడారు. ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరొక వ్యక్తి కోసం వెతుకుతున్నారు. బాలికను స్థానికంగా ఉండే అనాధాశ్రమానికి తరలించారు శిశు సంక్షేమశాఖ అధికారులు.

రాజకీయ రగడ..

వచ్చే నెలలో తిర్తోల్​ నియోజకవర్గానికి ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన చర్చనీయాంశమైంది. నవీన్​ పట్నాయక్​ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయిలు పరిహారం ఇవ్వడమే కాకుండా ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని కోరుతున్నాయి.

ఇదీ చూడండి: కారు ప్రమాదంలో ఎన్సీపీ నేత సజీవదహనం

ఒడిశా కటక్​లో 17 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం జరిగింది. సుమారు 22 రోజుల పాటు సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. జగత్​ సింగ్​పుర్ జిల్లాలోని తిర్తోల్​కు చెందిన బాలిక నెల రోజుల కిందట ఇంటి నుంచి పారిపోయి కటక్​కు వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్లాలనుకునే క్రమంలో ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు.

బండిపై దింపుతానంటూ...

ఇంటికి వెళ్లాలి అనుకున్న అమ్మాయికి లిఫ్ట్​ ఇస్తానంటూ నిందితుడు మోసగించాడు. సమీపంలోని కోళ్లఫారంకు తీసుకుని వెళ్లి 22 రోజులు పలు దఫాలుగా అత్యాచారం చేసినట్లు అధికారులు తెలిపారు. ఫారం దగ్గర కదలికలపై స్థానికులు సమాచారం ఇవ్వగా.. రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను కాపాడారు. ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరొక వ్యక్తి కోసం వెతుకుతున్నారు. బాలికను స్థానికంగా ఉండే అనాధాశ్రమానికి తరలించారు శిశు సంక్షేమశాఖ అధికారులు.

రాజకీయ రగడ..

వచ్చే నెలలో తిర్తోల్​ నియోజకవర్గానికి ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన చర్చనీయాంశమైంది. నవీన్​ పట్నాయక్​ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయిలు పరిహారం ఇవ్వడమే కాకుండా ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని కోరుతున్నాయి.

ఇదీ చూడండి: కారు ప్రమాదంలో ఎన్సీపీ నేత సజీవదహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.