ETV Bharat / bharat

వినాలంటే కొండెక్కాల్సిందే.. టెంట్​ వేయాల్సిందే!

author img

By

Published : Jul 25, 2020, 11:23 AM IST

Updated : Jul 25, 2020, 11:53 AM IST

కర్ణాటకలో ఆన్​లైన్ క్లాసులకు హాజరయ్యేందుకు విద్యార్థులు కొండెక్కి టెంట్లు వేశారు. గ్రామాల్లో సెల్ టవర్ లేక, సిగ్నల్ ఉన్న అడవుల్లోనే తరగతులకు హాజరవుతున్నారు. వర్షాకాలం కావడం వల్ల కొండపైన కూర్చోలేక టవర్ పెట్టించాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

Students put a tent on the hill to get network for online classes
సిగ్నల్ కోసం కొండెక్కి టెంట్ వేశారు!

కరోనా మహమ్మారి విద్యార్థులకు తీరని తిప్పలు తెచ్చిపెట్టింది. ఆన్​లైన్ క్లాసులు పెట్టి టీచర్లు సిలబస్ అయితే పూర్తి చేస్తున్నారు కానీ, ఆ తరగతులు వినడానికి విద్యార్ధులు నానా తంటాలు పడుతున్నారు. నగరాల్లో ఉంటున్న విద్యార్థుల పరిస్థితి కాస్తో కూస్తో మేలు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ ఇక్కట్లతో ఆన్​లైన్ తరగతులకు హాజరు కాలేకపోతున్నారు విద్యార్థులు. దక్షిణ కర్ణాటకలో విద్యార్థులు సిగ్నల్స్ కోసం కొండలు, గుట్టల మధ్య టెంట్లు వేసుకుని కూర్చుంటున్నారు.

'ఆన్​లైన్'​ కష్టాలు

దక్షిణ కర్ణాకలోని శిబజే గ్రామ పంచాయతీ సహా, పెర్లా, పసోడి, మయార్ది, పట్టిమారు, నిరానా, భండిహోళె, బూడడమక్కి గ్రామాల్లో ఇప్పటికీ సెల్ టవర్ లేదు. ఇంటర్నెట్ సౌకర్యం అసలే లేదు. దీంతో దాదాపు 400 మంది విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులు హాజరయ్యేందుకు కష్టాలు పడుతున్నారు.

Students put a tent on the hill to get network for online classes
సిగ్నల్ కోసం కొండెక్కి టెంట్ వేశారు!

ఇప్పటివరకు ఓ కొండపై కాసింత సిగ్నల్ వచ్చే చోట గుడారులు వేసుకుని తరగతులకు హాజరయ్యారు. అడవి దోమల బెడదకు మస్కిటో కాయిల్స్ పెట్టుకుని సర్ధుకున్నారు. కొంత మంది గుళ్లు, బస్ స్టాండ్లలో సిగ్నల్స్ కోసం ప్రయత్నించి క్లాసులు విన్నారు. కానీ, ఇప్పుడు వానాకాలం మొదలయ్యింది. దీంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

Students put a tent on the hill to get network for online classes
సిగ్నల్ కోసం విద్యార్థుల తంటాలు!

12 ఏళ్లుగా ఓ సెల్ టవర్ పెట్టించమని అధికారులు, ప్రజా ప్రతినిధులను వేడుకున్నారు గ్రామస్థులు. కానీ, లాభం లేకపోయింది. వారి నిర్లక్ష్యం ఇప్పుడు వందలాది మంది విద్యార్థులను ఇబ్బంది పెడుతోంది. ఇకనైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు గ్రామస్థులు.

ఇదీ చదవండి: ఆ మాస్టారు చెప్పే 'లౌడ్​ స్పీకర్​ క్లాసు'లకు పిల్లలు ఫిదా

కరోనా మహమ్మారి విద్యార్థులకు తీరని తిప్పలు తెచ్చిపెట్టింది. ఆన్​లైన్ క్లాసులు పెట్టి టీచర్లు సిలబస్ అయితే పూర్తి చేస్తున్నారు కానీ, ఆ తరగతులు వినడానికి విద్యార్ధులు నానా తంటాలు పడుతున్నారు. నగరాల్లో ఉంటున్న విద్యార్థుల పరిస్థితి కాస్తో కూస్తో మేలు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ ఇక్కట్లతో ఆన్​లైన్ తరగతులకు హాజరు కాలేకపోతున్నారు విద్యార్థులు. దక్షిణ కర్ణాటకలో విద్యార్థులు సిగ్నల్స్ కోసం కొండలు, గుట్టల మధ్య టెంట్లు వేసుకుని కూర్చుంటున్నారు.

'ఆన్​లైన్'​ కష్టాలు

దక్షిణ కర్ణాకలోని శిబజే గ్రామ పంచాయతీ సహా, పెర్లా, పసోడి, మయార్ది, పట్టిమారు, నిరానా, భండిహోళె, బూడడమక్కి గ్రామాల్లో ఇప్పటికీ సెల్ టవర్ లేదు. ఇంటర్నెట్ సౌకర్యం అసలే లేదు. దీంతో దాదాపు 400 మంది విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులు హాజరయ్యేందుకు కష్టాలు పడుతున్నారు.

Students put a tent on the hill to get network for online classes
సిగ్నల్ కోసం కొండెక్కి టెంట్ వేశారు!

ఇప్పటివరకు ఓ కొండపై కాసింత సిగ్నల్ వచ్చే చోట గుడారులు వేసుకుని తరగతులకు హాజరయ్యారు. అడవి దోమల బెడదకు మస్కిటో కాయిల్స్ పెట్టుకుని సర్ధుకున్నారు. కొంత మంది గుళ్లు, బస్ స్టాండ్లలో సిగ్నల్స్ కోసం ప్రయత్నించి క్లాసులు విన్నారు. కానీ, ఇప్పుడు వానాకాలం మొదలయ్యింది. దీంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

Students put a tent on the hill to get network for online classes
సిగ్నల్ కోసం విద్యార్థుల తంటాలు!

12 ఏళ్లుగా ఓ సెల్ టవర్ పెట్టించమని అధికారులు, ప్రజా ప్రతినిధులను వేడుకున్నారు గ్రామస్థులు. కానీ, లాభం లేకపోయింది. వారి నిర్లక్ష్యం ఇప్పుడు వందలాది మంది విద్యార్థులను ఇబ్బంది పెడుతోంది. ఇకనైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు గ్రామస్థులు.

ఇదీ చదవండి: ఆ మాస్టారు చెప్పే 'లౌడ్​ స్పీకర్​ క్లాసు'లకు పిల్లలు ఫిదా

Last Updated : Jul 25, 2020, 11:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.