మహారాష్ట్రలో శివసేన శాసనసభాపక్ష నేతగా ఏక్నాథ్ శిందే ఎన్నికయ్యారు. ముంబయిలో పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో జరిగిన శాసన సభ్యుల సమావేశంలో శిందేను ఎన్నుకున్నారు.
శిందే పేరును ఉద్దవ్ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ప్రతిపాదించగా, ఇతర సభ్యులు బలపర్చారు. ముందుగా ఆదిత్యనే పక్షనేతగా ఎన్నుకుంటారని ప్రచారం జరిగినప్పటికీ.. ఉద్ధవ్ ఠాక్రే ఇందుకు నిరాకరించినట్లు సమాచారం.
గవర్నర్తో భేటీ
సమావేశం పూర్తయ్యాక మధ్యాహ్నం 6.15 గంటలకు మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోషియారిని శివసేన నేతలు కలవనున్నారు. వీరిలో ఆదిత్య ఠాక్రే, ఏకనాథ్ శిందే, దివాకర్ రావోటే, సుభాశ్ దేశాయి తదితరులు ఉన్నారు. ఈ భేటీలో ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేయనున్నట్లు సమాచారం.