ETV Bharat / bharat

క్లినికల్​ ట్రయల్స్​లో వేగం పెంచిన 'సీరం'

author img

By

Published : Jul 25, 2020, 8:05 PM IST

కొవిడ్ వ్యాక్సిన్​పై ఆశలు రేపుతున్న ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయం అందుకు తగ్గట్టుగానే చర్యలను వేగవంతం చేసింది. ఇప్పటికే తొలి దశ క్లినికల్​ ట్రయల్స్​ను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఆక్స్​ఫర్డ్.. రెండు, మూడో దశ హ్యూమన్​ క్లినికల్​ ట్రయల్స్​కు సిద్ధమైంది.

Serum Institute of India seeks DCGI permission for phase 2/3 clinical trials of Oxford's COVID 'vaccine'
ఆక్స్​ఫర్డ్​ వ్యాక్సిన్

ఆక్స్​ఫర్డ్​ వ్యాక్సిన్ క్యాండిడేట్​ రెండు, మూడు దశల హ్యూమన్​ క్లినకల్​ ట్రయల్స్​ కోసం సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా(ఎస్​ఐఐ).. డ్రగ్​ కంట్రోలర్​ జనరల్​ ఆఫ్​ ఇండియా(డీజీసీఐ) అనుమతి కోరినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు పుణెకు చెందిన ఎస్​ఐఐ.. కొవిడ్​ వ్యాక్సిన్​ ట్రయల్స్ కోసం​ డీసీజీఐ అనుమతి కోరుతూ లేఖ రాసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. క్లినికల్​ ట్రయల్స్​లో భాగంగా భారతీయ వయోజనుల్లో 'కొవిషీల్డ్​(కొవిడ్​-19)' భద్రత, రోగ నిరోధక శక్తిని గుర్తించనున్నట్లు ఎస్​ఐఐ తన దరఖాస్తులో పేర్కొంది. ఈ ట్రయల్స్​లో 18 ఏళ్లు నిండిన వారు సుమారు 1600 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని ఆ సంస్థ స్పష్టం చేసింది.

బ్రిటన్​లో సత్ఫలితాలు..

ఆక్స్​ఫర్డ్​ వ్యాక్సిన్​ తొలి రెండు దశల ట్రయల్స్​ను బ్రిటన్​లోని 5 వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించారు. ఆ పరీక్షల్లో తమకు అనుకూలమైన ఫలితాలు వచ్చాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.

100 కోట్ల డోసుల ఉత్పత్తి..

ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన కొవిడ్​ టీకా.. 100 కోట్లు డోసులు ఉత్పత్తి చేసి విక్రయించేందుకు సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా.. బ్రిటీష్​- స్వీడిష్​ కంపెనీ అస్ట్రాజెనెకాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు భారత్​తో సహా ప్రపంచంలోని మధ్య, తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లో కొవిషీల్డ్​ వ్యాక్సిన్​ను అందుబాటులోకి తేనున్నట్లు ఎస్​ఐఐ సీఈఓ అదర్​ పూనావాలా తెలిపారు. అందులో భాగంగానే వచ్చే నెలలో హ్యూమన్​ ట్రయల్స్​ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన చెప్పారు.

ఇదీ చదవండి: ఆ సంస్థల కొవిడ్​ కిట్ల దిగుమతి లైసెన్సులు రద్దు

ఆక్స్​ఫర్డ్​ వ్యాక్సిన్ క్యాండిడేట్​ రెండు, మూడు దశల హ్యూమన్​ క్లినకల్​ ట్రయల్స్​ కోసం సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా(ఎస్​ఐఐ).. డ్రగ్​ కంట్రోలర్​ జనరల్​ ఆఫ్​ ఇండియా(డీజీసీఐ) అనుమతి కోరినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు పుణెకు చెందిన ఎస్​ఐఐ.. కొవిడ్​ వ్యాక్సిన్​ ట్రయల్స్ కోసం​ డీసీజీఐ అనుమతి కోరుతూ లేఖ రాసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. క్లినికల్​ ట్రయల్స్​లో భాగంగా భారతీయ వయోజనుల్లో 'కొవిషీల్డ్​(కొవిడ్​-19)' భద్రత, రోగ నిరోధక శక్తిని గుర్తించనున్నట్లు ఎస్​ఐఐ తన దరఖాస్తులో పేర్కొంది. ఈ ట్రయల్స్​లో 18 ఏళ్లు నిండిన వారు సుమారు 1600 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని ఆ సంస్థ స్పష్టం చేసింది.

బ్రిటన్​లో సత్ఫలితాలు..

ఆక్స్​ఫర్డ్​ వ్యాక్సిన్​ తొలి రెండు దశల ట్రయల్స్​ను బ్రిటన్​లోని 5 వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించారు. ఆ పరీక్షల్లో తమకు అనుకూలమైన ఫలితాలు వచ్చాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.

100 కోట్ల డోసుల ఉత్పత్తి..

ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన కొవిడ్​ టీకా.. 100 కోట్లు డోసులు ఉత్పత్తి చేసి విక్రయించేందుకు సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా.. బ్రిటీష్​- స్వీడిష్​ కంపెనీ అస్ట్రాజెనెకాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు భారత్​తో సహా ప్రపంచంలోని మధ్య, తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లో కొవిషీల్డ్​ వ్యాక్సిన్​ను అందుబాటులోకి తేనున్నట్లు ఎస్​ఐఐ సీఈఓ అదర్​ పూనావాలా తెలిపారు. అందులో భాగంగానే వచ్చే నెలలో హ్యూమన్​ ట్రయల్స్​ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన చెప్పారు.

ఇదీ చదవండి: ఆ సంస్థల కొవిడ్​ కిట్ల దిగుమతి లైసెన్సులు రద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.