ETV Bharat / bharat

'నిర్బంధ కేంద్రాల్లో కుటుంబ నియంత్రణ పాఠాలు' - నిర్బంధ కేంద్రాల్లోని వారికి కండోమ్​ల పంపిణీ: మోదీ

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన నిర్బంధ కేంద్రాలను జనాభా నియంత్రణ అవగాహన కార్యక్రమాలకు వినియోగిస్తోంది బిహార్ ప్రభుత్వం. దశాబ్దకాలంలో రాష్ట్ర జనాభా పెరుగుదల రేటు 25 శాతానికి చేరిన నేపథ్యంలో ఈ దిశగా చర్యలు చేపట్టింది. నిర్బంధ కేంద్రాలను విడిచి వెళ్లేటప్పుడు కండోమ్​లు, గర్భ నిరోధక మాత్రలను అందిస్తోంది. ఈ మేరకు బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ ప్రకటన విడుదల చేశారు.

bihar
నిర్బంధ కేంద్రాల్లోని వారికి కండోమ్​ల పంపిణీ: మోదీ
author img

By

Published : Jun 9, 2020, 8:15 AM IST

జనాభా పెరుగుదలను అరికట్టే దిశగా చర్యలు చేపట్టింది బిహార్ ప్రభుత్వం. వైద్య పరిశీలన పూర్తి చేసుకున్న నిర్బంధ కేంద్రాల్లోని వారు ఇళ్లకు వెళ్లేటప్పుడు కండోమ్​లు, గర్భనిరోధక మాత్రలు అందిస్తోంది. నిర్బంధ కాలంలో కుటుంబ నియంత్రణ అవగాహన కల్పిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ ప్రకటన విడుదల చేశారు.

రెండులక్షలకు పైగా పంపిణీ..

ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 2లక్షల 14వేల కండోమ్​లను పంపిణీ చేసినట్లు చెప్పారు మోదీ. బిహార్​లో దశాబ్దకాలంలో జనాభా పెరుగుదల 25 శాతంగా నమోదయిన నేపథ్యంలో ఈ దిశగా చర్యలకు ఉపక్రమించినట్లు చెప్పారు. బాలికలకు అవగాహన కల్పించడం, బాల్యవివాహాలను అరికట్టడం వంటి చర్యలతో 4.3 శాతంగా ఉన్న గర్భధారణ రేటు 3.2కు దిగివచ్చినట్లు చెప్పారు. ఆశ వర్కర్లు, ఏఎన్​ఎంల ద్వారా కండోమ్​లను ప్రజల ఇళ్ల వద్దకే తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు. 11 లక్షల గర్భనిరోధక మాత్రలను లాక్​డౌన్ కాలంలో పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు మోదీ.

ఇదీ చూడండి: పానీపూరి కాదు.. మ్యాగీపూరి ఎప్పుడైనా తిన్నారా?

జనాభా పెరుగుదలను అరికట్టే దిశగా చర్యలు చేపట్టింది బిహార్ ప్రభుత్వం. వైద్య పరిశీలన పూర్తి చేసుకున్న నిర్బంధ కేంద్రాల్లోని వారు ఇళ్లకు వెళ్లేటప్పుడు కండోమ్​లు, గర్భనిరోధక మాత్రలు అందిస్తోంది. నిర్బంధ కాలంలో కుటుంబ నియంత్రణ అవగాహన కల్పిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ ప్రకటన విడుదల చేశారు.

రెండులక్షలకు పైగా పంపిణీ..

ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 2లక్షల 14వేల కండోమ్​లను పంపిణీ చేసినట్లు చెప్పారు మోదీ. బిహార్​లో దశాబ్దకాలంలో జనాభా పెరుగుదల 25 శాతంగా నమోదయిన నేపథ్యంలో ఈ దిశగా చర్యలకు ఉపక్రమించినట్లు చెప్పారు. బాలికలకు అవగాహన కల్పించడం, బాల్యవివాహాలను అరికట్టడం వంటి చర్యలతో 4.3 శాతంగా ఉన్న గర్భధారణ రేటు 3.2కు దిగివచ్చినట్లు చెప్పారు. ఆశ వర్కర్లు, ఏఎన్​ఎంల ద్వారా కండోమ్​లను ప్రజల ఇళ్ల వద్దకే తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు. 11 లక్షల గర్భనిరోధక మాత్రలను లాక్​డౌన్ కాలంలో పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు మోదీ.

ఇదీ చూడండి: పానీపూరి కాదు.. మ్యాగీపూరి ఎప్పుడైనా తిన్నారా?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.