ETV Bharat / bharat

'ప్రజల మంత్రి'కి ప్రముఖుల ఘన నివాళి

author img

By

Published : Aug 7, 2019, 11:12 AM IST

విదేశాంగ శాఖ మాజీ మంత్రి, భాజపా సీనియర్​ నేత సుష్మా స్వరాజ్​ పార్థివదేహానికి రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. దిల్లీలోని ఆమె నివాసానికి చేరుకుని భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. సుష్మ మృతితో కొందరు నేతలు భావోద్వేగానికి లోనయ్యారు.

'ప్రజల మంత్రి'కి ప్రముఖుల ఘన నివాళి
'ప్రజల మంత్రి'కి ప్రముఖుల ఘన నివాళి
భాజపా నేత సుష్మా స్వరాజ్​ మృతిపట్ల రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దిల్లీలోని ఆమె నివాసానికి చేరుకుని పార్థివదేహానికి నివాళులర్పించారు. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​, లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా, భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, ములాయం సింగ్​ యాదవ్​, మాయావతి, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​... సుష్మ భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.

పలువురు నేతలు సుష్మాతో ఉన్న అనుబంధాన్ని తలుచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

మహిళలకు రోల్ మోడల్​: అడ్వాణీ

సుష్మా స్వరాజ్​ మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు భాజపా అగ్రనేత ఎల్​కే అడ్వాణీ. తనకు ఎంతో సన్నిహితురాలని గుర్తుచేసుకున్నారు. మహిళలకు సుష్మ రోల్​ మోడల్​గా నిలిచారని కొనియాడారు. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు అడ్వాణీ. అత్యంత ప్రజాదరణ పొందిన నాయకులలో ఒకరు, అద్భుతమైన వక్త అని పేర్కొన్నారు.

అభిమాన నేతను కడసారి చూసేందుకు దేశ నలుమూలల నుంచి రాజకీయ, వ్యాపార ప్రముఖులు, అభిమానులు తరలివస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.

ఇదీ చూడండి: సుష్మ​ భౌతికకాయం వద్ద మోదీ భావోద్వేగం

'ప్రజల మంత్రి'కి ప్రముఖుల ఘన నివాళి
భాజపా నేత సుష్మా స్వరాజ్​ మృతిపట్ల రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దిల్లీలోని ఆమె నివాసానికి చేరుకుని పార్థివదేహానికి నివాళులర్పించారు. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​, లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా, భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, ములాయం సింగ్​ యాదవ్​, మాయావతి, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​... సుష్మ భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.

పలువురు నేతలు సుష్మాతో ఉన్న అనుబంధాన్ని తలుచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

మహిళలకు రోల్ మోడల్​: అడ్వాణీ

సుష్మా స్వరాజ్​ మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు భాజపా అగ్రనేత ఎల్​కే అడ్వాణీ. తనకు ఎంతో సన్నిహితురాలని గుర్తుచేసుకున్నారు. మహిళలకు సుష్మ రోల్​ మోడల్​గా నిలిచారని కొనియాడారు. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు అడ్వాణీ. అత్యంత ప్రజాదరణ పొందిన నాయకులలో ఒకరు, అద్భుతమైన వక్త అని పేర్కొన్నారు.

అభిమాన నేతను కడసారి చూసేందుకు దేశ నలుమూలల నుంచి రాజకీయ, వ్యాపార ప్రముఖులు, అభిమానులు తరలివస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.

ఇదీ చూడండి: సుష్మ​ భౌతికకాయం వద్ద మోదీ భావోద్వేగం

AP Video Delivery Log - 0200 GMT News
Wednesday, 7 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0047: US OH Family Statement AP Clients Only 4223972
Bellbrook police read Betts family statement
AP-APTN-0023: Peru Venezuela Conclusions AP Clients Only 4223971
Nations conclude meetings on Venezuela crisis
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.