ETV Bharat / bharat

'బీఎస్​ఎఫ్'​ రైసింగ్​ డే- మోదీ శుభాకాంక్షలు

author img

By

Published : Dec 1, 2020, 12:13 PM IST

భారత పారామిలిటరీ దళం బీఎస్​ఎఫ్​ 56వ రైసింగ్​ డే వేడుకలు దిల్లీలోని ఛావ్లా క్యాంప్​లో ఘనంగా జరిగాయి. జవాన్ల కవాతు, విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జవాన్లకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ.

BSF raising day
బీఎస్​ఎఫ్​ 56వ రైసింగ్​ డే

సరిహద్దు భద్రతా దళం-బీఎస్​ఎఫ్ ఆవిర్భావ దినోత్సాన్ని పురస్కరించుకొని దిల్లీలోని ఛావ్లా క్యాంప్​లో ఘనంగా 56వ రైసింగ్​ డే పరేడ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్​ఎఫ్​ జవాన్లు చేసిన కవాతు, విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

BSF raising day
గౌరవ వందనం స్వీకరిస్తున్న ఉన్నతాధికారులు

పాకిస్థాన్​తో అంతర్జాతీయ సరిహద్దులో భద్రత కోసం బీఎస్​ఎఫ్​ను 1965, డిసెంబర్​ 1న ఏర్పాటు చేశారు. అనంతరం దానిని బంగ్లాదేశ్​ సరిహద్దుకు విస్తరించారు. భారత పారామిలిటరీ దళాల్లో ఒకటిగా ప్రధాన పాత్ర పోషిస్తోంది బీఎస్​ఎఫ్​. కొంత కాలంగా కశ్మీర్​లో ఉగ్రవాద కార్యకలాపాల నిర్మూలన సహా.. దేశంలోని అంతర్గత సమస్యల పరిష్కారానికి కూడా ఈ బలగాలను మోహరిస్తున్నారు.

BSF raising day
హాజరైన ఉన్నతాధికారులు, అతిథులు

జవాన్లకు మోదీ శుభాకాంక్షలు..

బీఎస్​ఎఫ్​ రైసింగ్​ డే సందర్భంగా జవాన్లకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బీఎస్​ఎఫ్​ దేశానికే గర్వకారణమని కొనియాడుతూ ట్వీట్​ చేశారు.

  • Best wishes to all @BSF_India personnel and their families on the special occasion of their Raising Day. BSF has distinguished itself as a valorous force, unwavering in their commitment to protect the nation and assist citizens during natural calamities. India is proud of BSF!

    — Narendra Modi (@narendramodi) December 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" రైసింగ్​ డే సందర్భంగా బీఎస్​ఎఫ్​ జవాన్లు, వారి కుటుంబాలకు నా శుభాకాంక్షలు. బీఎస్​ఎఫ్​ ఒక పరాక్రమ శక్తిగా తనను తాను మలుచుకుంది. దేశాన్ని రక్షించటంలో, ప్రకృతి వైపరీత్యాల సమయంలో పౌరులకు సాయం చేయటంలో కీలక భూమిక పోషిస్తోంది. భారత్​కు గర్వకారణం"

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

షా గైర్హాజరు..

బీఎస్​ఎఫ్ 56వ​ రైసింగ్​ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోమంత్రి అమిత్​ షా హాజరుకావాల్సి ఉంది. అయితే.. ముఖ్యమైన అధికారిక పనులు ఉన్నందున రైసింగ్​ డే కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపింది హోంమంత్రి కార్యాలయం. అయితే.. ఈ కార్యక్రమానికి హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్​ రాయ్​ ముఖ్యఅతిథిగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:బీఎస్​ఎఫ్​ జవాన్ల దీపావళి వేడుకలు

సరిహద్దు భద్రతా దళం-బీఎస్​ఎఫ్ ఆవిర్భావ దినోత్సాన్ని పురస్కరించుకొని దిల్లీలోని ఛావ్లా క్యాంప్​లో ఘనంగా 56వ రైసింగ్​ డే పరేడ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్​ఎఫ్​ జవాన్లు చేసిన కవాతు, విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

BSF raising day
గౌరవ వందనం స్వీకరిస్తున్న ఉన్నతాధికారులు

పాకిస్థాన్​తో అంతర్జాతీయ సరిహద్దులో భద్రత కోసం బీఎస్​ఎఫ్​ను 1965, డిసెంబర్​ 1న ఏర్పాటు చేశారు. అనంతరం దానిని బంగ్లాదేశ్​ సరిహద్దుకు విస్తరించారు. భారత పారామిలిటరీ దళాల్లో ఒకటిగా ప్రధాన పాత్ర పోషిస్తోంది బీఎస్​ఎఫ్​. కొంత కాలంగా కశ్మీర్​లో ఉగ్రవాద కార్యకలాపాల నిర్మూలన సహా.. దేశంలోని అంతర్గత సమస్యల పరిష్కారానికి కూడా ఈ బలగాలను మోహరిస్తున్నారు.

BSF raising day
హాజరైన ఉన్నతాధికారులు, అతిథులు

జవాన్లకు మోదీ శుభాకాంక్షలు..

బీఎస్​ఎఫ్​ రైసింగ్​ డే సందర్భంగా జవాన్లకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బీఎస్​ఎఫ్​ దేశానికే గర్వకారణమని కొనియాడుతూ ట్వీట్​ చేశారు.

  • Best wishes to all @BSF_India personnel and their families on the special occasion of their Raising Day. BSF has distinguished itself as a valorous force, unwavering in their commitment to protect the nation and assist citizens during natural calamities. India is proud of BSF!

    — Narendra Modi (@narendramodi) December 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" రైసింగ్​ డే సందర్భంగా బీఎస్​ఎఫ్​ జవాన్లు, వారి కుటుంబాలకు నా శుభాకాంక్షలు. బీఎస్​ఎఫ్​ ఒక పరాక్రమ శక్తిగా తనను తాను మలుచుకుంది. దేశాన్ని రక్షించటంలో, ప్రకృతి వైపరీత్యాల సమయంలో పౌరులకు సాయం చేయటంలో కీలక భూమిక పోషిస్తోంది. భారత్​కు గర్వకారణం"

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

షా గైర్హాజరు..

బీఎస్​ఎఫ్ 56వ​ రైసింగ్​ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోమంత్రి అమిత్​ షా హాజరుకావాల్సి ఉంది. అయితే.. ముఖ్యమైన అధికారిక పనులు ఉన్నందున రైసింగ్​ డే కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపింది హోంమంత్రి కార్యాలయం. అయితే.. ఈ కార్యక్రమానికి హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్​ రాయ్​ ముఖ్యఅతిథిగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:బీఎస్​ఎఫ్​ జవాన్ల దీపావళి వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.