ETV Bharat / bharat

'కరోనాపై పోరుకు అసాధారణ నిర్ణయాలు అనివార్యం'

author img

By

Published : Mar 31, 2020, 6:35 AM IST

Updated : Mar 31, 2020, 6:42 AM IST

క్లిష్ట సమయాల్లో అసాధారణ పరిష్కారాలు అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విదేశాల్లోని భారత రాయబారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. మహమ్మారిపై పోరాడేందుకు లాక్‌డౌన్‌ అనివార్యమైందని పేర్కొన్నారు.

PM holds video-conference with 130 Indian missions abroad on COVID-19
కరోనాపై పోరుకు అసాధారణ నిర్ణయాలు అనివార్యం: నరేంద్ర మోదీ
'కరోనాపై పోరుకు అసాధారణ నిర్ణయాలు అనివార్యం'

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అసాధారణమైన నిర్ణయాలు తీసుకుందని ప్రధాని మోదీ వెల్లడించారు. సంక్లిష్ట కాలంలో అసాధారణమైన పరిష్కారాలు అవసరమని ఆయన సూచించారు. విదేశాల్లో ఉన్న 130 భారత రాయబార కార్యాలయ అధికారులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

అనివార్యం

కరోనా సంక్షోభ సమయంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు రాయబారులు చేసిన కృషిని మోదీ అభినందించారు. మహమ్మారిపై పోరాడేందుకు లాక్‌డౌన్‌ అనివార్య చర్య అని పేర్కొన్న ఆయన.. అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షల కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకు అండగా నిలవాలని రాయబారులను కోరారు.

పీఎం కేర్స్​కు ప్రచారం

కరోనాను ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని, మహమ్మారికి వ్యతిరేకంగా భారత్‌ చేసే పోరాటానికి సాయపడాలని మోదీ కోరారు. విదేశాల నుంచి వచ్చే విరాళాలను సమీకరించడానికి కొత్తగా ఏర్పాటు చేసిన పీఎమ్-కేర్స్ ఫండ్‌కు ప్రచారం కల్పించాలని కోరారు. వివిధ దేశాల ఆంక్షల ప్రభావం వాణిజ్యంపై పడకుండా చూడాలని సూచించారు.

ఇదీ చూడండి: 'పీఎం కేర్స్'​కు భారీ విరాళాలు- రిలయన్స్ రూ.500 కోట్లు

'కరోనాపై పోరుకు అసాధారణ నిర్ణయాలు అనివార్యం'

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అసాధారణమైన నిర్ణయాలు తీసుకుందని ప్రధాని మోదీ వెల్లడించారు. సంక్లిష్ట కాలంలో అసాధారణమైన పరిష్కారాలు అవసరమని ఆయన సూచించారు. విదేశాల్లో ఉన్న 130 భారత రాయబార కార్యాలయ అధికారులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

అనివార్యం

కరోనా సంక్షోభ సమయంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు రాయబారులు చేసిన కృషిని మోదీ అభినందించారు. మహమ్మారిపై పోరాడేందుకు లాక్‌డౌన్‌ అనివార్య చర్య అని పేర్కొన్న ఆయన.. అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షల కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకు అండగా నిలవాలని రాయబారులను కోరారు.

పీఎం కేర్స్​కు ప్రచారం

కరోనాను ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని, మహమ్మారికి వ్యతిరేకంగా భారత్‌ చేసే పోరాటానికి సాయపడాలని మోదీ కోరారు. విదేశాల నుంచి వచ్చే విరాళాలను సమీకరించడానికి కొత్తగా ఏర్పాటు చేసిన పీఎమ్-కేర్స్ ఫండ్‌కు ప్రచారం కల్పించాలని కోరారు. వివిధ దేశాల ఆంక్షల ప్రభావం వాణిజ్యంపై పడకుండా చూడాలని సూచించారు.

ఇదీ చూడండి: 'పీఎం కేర్స్'​కు భారీ విరాళాలు- రిలయన్స్ రూ.500 కోట్లు

Last Updated : Mar 31, 2020, 6:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.