ETV Bharat / bharat

శివసేన, కాంగ్రెస్​, ఎన్​సీపీలపై సుప్రీంలో పిటిషన్​

మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటు కోసం శివసేన, ఎన్​సీపీ, కాంగ్రెస్​ పార్టీలు సంకీర్ణంగా ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో.. దీనిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలైంది. ఎన్నికల ముందు భాజపాతో కలిసి పోటీ చేసిన శివసేన అనంతరం ఎన్​సీపీతో కలవటం ప్రజలను మోసం చేయటమేనని.. నూతన సంకీర్ణం నుంచి ముఖ్యమంత్రి పదవి చేపట్టకుండా కేంద్ర, రాష్ట్రాలకు ఆదేశాలను జారీ చేయాలని తన వ్యాజ్యంలో అభ్యర్థించారు పిటిషనర్.

author img

By

Published : Nov 15, 2019, 6:16 AM IST

శివసేన, కాంగ్రెస్​, ఎన్​సీపీలపై సుప్రీంలో పిటిషన్​

మహారాష్ట్రలో శివసేన, ఎన్​సీపీ, కాంగ్రెస్ పార్టీలు సంకీర్ణ కూటమిగా ఏర్పడే అవకాశమున్న నేపథ్యంలో.. దీనిని సవాల్​ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఎన్నికల సమయంలో భాజపాతో పొత్తు పెట్టుకొని ఫలితాల అనంతరం.. అధికారమే లక్ష్యంగా ఎన్​సీపీతో కలవటం ప్రజలను మోసం చేయడమేనని ప్రమోద్ పండిట్ జోషి అనే వ్యక్తి సుప్రీంలో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. శివసేన, ఎన్​సీపీ, కాంగ్రెస్​ పార్టీలకు చెందిన నేతలు ముఖ్యమంత్రి పదవి చేపట్టకుండా కేంద్ర, రాష్ట్రాలను ఆదేశించాలని సుప్రీంకు విజ్ఞప్తి చేశారు పిటిషనర్.

'శివసేన, ఎన్​సీపీ, కాంగ్రెస్​ పార్టీల కలయిక అనైతికమైనది. రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఈ పార్టీలు యోచిస్తున్నాయి. ఈ పార్టీల సంకీర్ణంతో ఏర్పాటయ్యే ప్రభుత్వం ప్రజామోదం పొందినది కాబోదని' వ్యాజ్యం విచారణ సందర్భంగా పిటిషనర్​ తరఫు న్యాయవాది బారున్ కుమార్ సిన్హా వాదనలు వినిపించారు.

ఎన్నికల ఫలితాల తర్వాత రెండు లేదా అంతకన్నా ఎక్కువ పార్టీలు కలిసి ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం రాజ్యాంగ విరుద్దమని పిటిషన్​లో పేర్కొన్నారు జోషి. ఈ పార్టీలు ప్రజామోదం పొందలేదని పిటిషన్​లో వివరించారు. ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్న పార్టీలకు మాత్రమే అధికారాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని వ్యాజ్యంలో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: అసోంలో ఘనంగా బ్రహ్మపుత్ర పుష్కర మేళా

మహారాష్ట్రలో శివసేన, ఎన్​సీపీ, కాంగ్రెస్ పార్టీలు సంకీర్ణ కూటమిగా ఏర్పడే అవకాశమున్న నేపథ్యంలో.. దీనిని సవాల్​ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఎన్నికల సమయంలో భాజపాతో పొత్తు పెట్టుకొని ఫలితాల అనంతరం.. అధికారమే లక్ష్యంగా ఎన్​సీపీతో కలవటం ప్రజలను మోసం చేయడమేనని ప్రమోద్ పండిట్ జోషి అనే వ్యక్తి సుప్రీంలో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. శివసేన, ఎన్​సీపీ, కాంగ్రెస్​ పార్టీలకు చెందిన నేతలు ముఖ్యమంత్రి పదవి చేపట్టకుండా కేంద్ర, రాష్ట్రాలను ఆదేశించాలని సుప్రీంకు విజ్ఞప్తి చేశారు పిటిషనర్.

'శివసేన, ఎన్​సీపీ, కాంగ్రెస్​ పార్టీల కలయిక అనైతికమైనది. రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఈ పార్టీలు యోచిస్తున్నాయి. ఈ పార్టీల సంకీర్ణంతో ఏర్పాటయ్యే ప్రభుత్వం ప్రజామోదం పొందినది కాబోదని' వ్యాజ్యం విచారణ సందర్భంగా పిటిషనర్​ తరఫు న్యాయవాది బారున్ కుమార్ సిన్హా వాదనలు వినిపించారు.

ఎన్నికల ఫలితాల తర్వాత రెండు లేదా అంతకన్నా ఎక్కువ పార్టీలు కలిసి ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం రాజ్యాంగ విరుద్దమని పిటిషన్​లో పేర్కొన్నారు జోషి. ఈ పార్టీలు ప్రజామోదం పొందలేదని పిటిషన్​లో వివరించారు. ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్న పార్టీలకు మాత్రమే అధికారాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని వ్యాజ్యంలో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: అసోంలో ఘనంగా బ్రహ్మపుత్ర పుష్కర మేళా

New Delhi, Nov 14 (ANI: BJP National Spokesperson Meenakashi Lekhi on November 14 reacted on Rahul Gandhi contempt case. She said that better methodology of doing politics should prevail. Lekhi also lambasted at Congress by saying that the main opposition party should know how not to be intolerant of others who are doing better than them. SC today closed the contempt proceedings against Rahul Gandhi over his 'chowkidar chor hai' remark. He faced contempt charges for wrongly attributing the 'chowkidar chow hai' remark to the Supreme Court. Rahul Gandhi had later apologised to the court. The Supreme Court accepted Rahul's 'unconditional apology' and closed the contempt proceedings against him.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.