కర్ణాటక చిత్రదుర్గలో ఓ ఎలుగుబంటిపై గ్రామస్థులు కర్రలతో దాడి చేసి చంపారు. దళవాయికట్టెలో చొరబడిన ఎలుగు గ్రామస్థులపై దాడి చేసింది. 50 ఏళ్ల రాజన్న మృతిచెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
అటవీ అధికారులకు సమాచారం అందించారు గ్రామస్థులు. ఎలుగును పట్టుకోవటంలో అధికారులు విఫలమైన నేపథ్యంలో అగ్రహించిన గ్రామస్థులు వేటాడారు. ఓ తోటలో వన్యమృగం కనిపించగానే మూకుమ్మడిగా కర్రలతో దాడి చేసి చంపారు.
ఇదీ చూడండి: శునకాల పెళ్లికి ఊళ్లో పెద్దల హడావుడి!