ETV Bharat / bharat

నమస్తే ట్రంప్​: అతిథి కోసం స్పెషల్​ 'స్వచ్ఛ భారత్​ కిళ్లీ'​

అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తొలిసారి భారత్​కు విచ్చేస్తున్నారు. మరి మర్యాదలు అదిరిపోవద్దూ? భారతీయ వంటకాలన్నీ రుచి చూపించేలా.. నోరూరించే మెనూ ఎలాగో సిద్ధం చేశారు అధికారులు. ఆఖరున కిళ్లీ లేకపోతే ఎలా? అందుకే, ఆ బాధ్యత దిల్లీలోని పాండే కిళ్లీ దుకాణదారులు తీసుకున్నారు. ట్రంప్​ను మెప్పించేలా పాన్​లు తయారు చేయడంలో బిజీగా ఉన్నారు.

author img

By

Published : Feb 24, 2020, 9:43 AM IST

Updated : Mar 2, 2020, 9:13 AM IST

PAN_shop_from_where_PAN_to_be_serve_to_Trump on his visit to india
నమస్తే ట్రంప్​: అతిథి కోసం స్పెషల్​ 'స్వచ్ఛ భారత్​ కిళ్లీ'​
అతిథి కోసం స్పెషల్​ 'స్వచ్ఛ భారత్​ కిళ్లీ'​

భారత పర్యటనకు విచ్చేస్తున్న అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. భారతీయ వంటకాలే కాదు, కిళ్లీ రుచి కూడా చూడనున్నారు. దిల్లీలోని 'పాండే పాన్స్​' దుకాణంలో తయారైన పాన్​ను స్వీకరించనున్నారు.

పాన్​ బనానేవాలా..

పాండే పాన్స్​ 1943లో ప్రారంభమైంది. ఎలాంటి రసాయనాలు వాడకుండా, నోట్లో వేస్తే కరిగిపోయే కిళ్లీలు తయారు చేయడం ఈ దుకాణం ప్రత్యేకత. భారత ప్రథమ రాష్ట్రపతి డాక్టర్​ రాజేంద్ర ప్రసాద్​, ఒకప్పటి ప్రధాని ఇందిరా గాంధీ నుంచి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ వరకు ఎందరో ప్రముఖులు పాండే కిళ్లీలు రుచిచూశారు.

"మేము ఎలాంటి ఫ్లేవర్లు, రసాయనాలు వినియోగించం. ఏదైనా సహజ రుచులే ఉంటాయి. అంతే కాదు. ఈ పాన్​ తిన్నవారెవరూ బయటకు ఊమ్మివేయలేరు. మోదీ చెప్పినట్టు పాన్​ ఉమ్మితే, అది భారత్​ మాతపైన ఉమ్మివేసినట్టు. అందుకే, మేము కొత్త పద్ధతిని తీసుకొచ్చాం. నికొటిన్​ లేని మీఠా, సాదా పాన్​లను తయారు చేస్తాం. అవి తిని ఎవ్వరూ ఉమ్మివేయరు. ఇప్పుడు ట్రంప్​కు ఎలాంటి పాన్​ తయారు చేయాలో మేము పరిశోధన చేసి, సిద్ధంగా ఉంచాము."

-దేవీ ప్రసాద్​ పాండే, యజమాని

అమెరికా ఒకప్పటి అధ్యక్షుడు బరాక్​ ఒబామా సైతం పాండే పాన్​ రుచిచూసి మైమరచిపోయారు.​ ఇప్పుడు ట్రంప్​ నోటినీ ఎరుపు చేసేందుకు సిద్ధమవుతున్నారు పాండే.

ఇదీ చదవండి:ట్రంప్​ కోసం 'పోలీస్​ అమ్మ' డ్యూటీ- పసి బిడ్డతో కలిసి...

అతిథి కోసం స్పెషల్​ 'స్వచ్ఛ భారత్​ కిళ్లీ'​

భారత పర్యటనకు విచ్చేస్తున్న అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. భారతీయ వంటకాలే కాదు, కిళ్లీ రుచి కూడా చూడనున్నారు. దిల్లీలోని 'పాండే పాన్స్​' దుకాణంలో తయారైన పాన్​ను స్వీకరించనున్నారు.

పాన్​ బనానేవాలా..

పాండే పాన్స్​ 1943లో ప్రారంభమైంది. ఎలాంటి రసాయనాలు వాడకుండా, నోట్లో వేస్తే కరిగిపోయే కిళ్లీలు తయారు చేయడం ఈ దుకాణం ప్రత్యేకత. భారత ప్రథమ రాష్ట్రపతి డాక్టర్​ రాజేంద్ర ప్రసాద్​, ఒకప్పటి ప్రధాని ఇందిరా గాంధీ నుంచి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ వరకు ఎందరో ప్రముఖులు పాండే కిళ్లీలు రుచిచూశారు.

"మేము ఎలాంటి ఫ్లేవర్లు, రసాయనాలు వినియోగించం. ఏదైనా సహజ రుచులే ఉంటాయి. అంతే కాదు. ఈ పాన్​ తిన్నవారెవరూ బయటకు ఊమ్మివేయలేరు. మోదీ చెప్పినట్టు పాన్​ ఉమ్మితే, అది భారత్​ మాతపైన ఉమ్మివేసినట్టు. అందుకే, మేము కొత్త పద్ధతిని తీసుకొచ్చాం. నికొటిన్​ లేని మీఠా, సాదా పాన్​లను తయారు చేస్తాం. అవి తిని ఎవ్వరూ ఉమ్మివేయరు. ఇప్పుడు ట్రంప్​కు ఎలాంటి పాన్​ తయారు చేయాలో మేము పరిశోధన చేసి, సిద్ధంగా ఉంచాము."

-దేవీ ప్రసాద్​ పాండే, యజమాని

అమెరికా ఒకప్పటి అధ్యక్షుడు బరాక్​ ఒబామా సైతం పాండే పాన్​ రుచిచూసి మైమరచిపోయారు.​ ఇప్పుడు ట్రంప్​ నోటినీ ఎరుపు చేసేందుకు సిద్ధమవుతున్నారు పాండే.

ఇదీ చదవండి:ట్రంప్​ కోసం 'పోలీస్​ అమ్మ' డ్యూటీ- పసి బిడ్డతో కలిసి...

Last Updated : Mar 2, 2020, 9:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.