ETV Bharat / bharat

ఔరా: అగ్గిపుల్లలతో జగన్నాథుడి కళాకృతి - ఒడిశా

ఒడిశాలోని పూరీలో జరిగిన నాగార్జున బేషా ఉత్సవాల్లో ఓ కళాకారుడు రూపొందించిన అగ్గిపుల్లల జగన్నాథుడి విగ్రహం అందరినీ ఆకట్టుకుంది. 11 రోజుల పాటు శ్రమించి సుమారు మూడున్నరవేల అగ్గిపుల్లలతో దీనిని తయారు చేశాడు.

an idol of Lord Jagannath with matchsticks
అగ్గిపుల్లలతో జగన్నాథుడి కళాకృతి
author img

By

Published : Nov 29, 2020, 7:30 AM IST

ఒడిశా పూరీలో 26 ఏళ్ల తర్వాత శనివారం భగవాన్​ జగన్నాథుడి నాగార్జున బేషా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కళాకారులు వివిధ రూపాల్లో జగన్నాథుడి విగ్రహాలు తయారు చేసి ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో పూరీకి చెందిన సాస్వత్​ రంజన్​ సాహూ అనే కళాకారుడు రూపొందించిన అగ్గిపుల్లల జగన్నాథుడి విగ్రహం అందరి దృష్టిని ఆకర్షించింది. మూడున్నరవేలకుపైగా అగ్గిపుల్లలతో యుద్ధ వీరుడి రూపంలో జగన్నాథ ప్రభువును తీర్చిదిద్ది ఔరా అనిపించాడు.

అగ్గిపుల్లలతో జగన్నాథుడి కళాకృతి

" జగన్నాథుడి విగ్రహం తయారీకి 3,635 అగ్గిపుల్లలను వినియోగించాను. దానిని పూర్తి చేసేందుకు 11 రోజుల సమయం పట్టింది."

- సాస్వత్​ రంజన్​ సాహూ, కళాకారుడు

an idol of Lord Jagannath with matchsticks
జగన్నాథుడి కళాకృతి వద్ద సాస్వత్​ రంజన్​ సాహూ

కార్తీక మాసంలో విష్ణువు మరో అవతారం పరుశరాముడిని కోలుచుకుంటూ జగన్నాథుడిని యుద్ధవీరుడిగా అలంకరించి నాగార్జున బేషా నిర్వహిస్తారు. వెయ్యి చేతులు గల కార్తవీర్యార్జునుడ్ని పరుశురాముడు అంతమొందించినందుకు గుర్తుగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారని అక్కడి ప్రజలు చెబుతారు. అలాగే ఆర్జునుడు, అతని కుమారుడు నాగార్జునుడి మధ్య యుద్ధానికి గుర్తుగా చేస్తారని మరికొందరు చెప్తారు. ఈ సందర్భంగా 16 రకాల ఆయుధాలతో జగన్నాథుడిని అలంకరిస్తారు.

ఇదీ చూడండి:గణేశుడికి ఆ తల ఎలా వచ్చింది?

ఒడిశా పూరీలో 26 ఏళ్ల తర్వాత శనివారం భగవాన్​ జగన్నాథుడి నాగార్జున బేషా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కళాకారులు వివిధ రూపాల్లో జగన్నాథుడి విగ్రహాలు తయారు చేసి ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో పూరీకి చెందిన సాస్వత్​ రంజన్​ సాహూ అనే కళాకారుడు రూపొందించిన అగ్గిపుల్లల జగన్నాథుడి విగ్రహం అందరి దృష్టిని ఆకర్షించింది. మూడున్నరవేలకుపైగా అగ్గిపుల్లలతో యుద్ధ వీరుడి రూపంలో జగన్నాథ ప్రభువును తీర్చిదిద్ది ఔరా అనిపించాడు.

అగ్గిపుల్లలతో జగన్నాథుడి కళాకృతి

" జగన్నాథుడి విగ్రహం తయారీకి 3,635 అగ్గిపుల్లలను వినియోగించాను. దానిని పూర్తి చేసేందుకు 11 రోజుల సమయం పట్టింది."

- సాస్వత్​ రంజన్​ సాహూ, కళాకారుడు

an idol of Lord Jagannath with matchsticks
జగన్నాథుడి కళాకృతి వద్ద సాస్వత్​ రంజన్​ సాహూ

కార్తీక మాసంలో విష్ణువు మరో అవతారం పరుశరాముడిని కోలుచుకుంటూ జగన్నాథుడిని యుద్ధవీరుడిగా అలంకరించి నాగార్జున బేషా నిర్వహిస్తారు. వెయ్యి చేతులు గల కార్తవీర్యార్జునుడ్ని పరుశురాముడు అంతమొందించినందుకు గుర్తుగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారని అక్కడి ప్రజలు చెబుతారు. అలాగే ఆర్జునుడు, అతని కుమారుడు నాగార్జునుడి మధ్య యుద్ధానికి గుర్తుగా చేస్తారని మరికొందరు చెప్తారు. ఈ సందర్భంగా 16 రకాల ఆయుధాలతో జగన్నాథుడిని అలంకరిస్తారు.

ఇదీ చూడండి:గణేశుడికి ఆ తల ఎలా వచ్చింది?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.