ETV Bharat / bharat

లెక్కల చిక్కులు: మరో మిత్రపక్షంతో భాజపాకు ఇబ్బందులు!

author img

By

Published : Oct 30, 2019, 7:05 PM IST

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో భాజపా- శివసేన మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ వివాదం తేలక ముందే... భాజపాకు జేడీయూతోనూ కొత్త చిక్కులు ఎదురయ్యేలా ఉన్నాయి. కేంద్ర కేబినెట్​లో మిత్రపక్షాలకు వాటాపై నితీశ్​ పార్టీ ప్రతిపాదించిన సూత్రమే ఇందుకు కారణం.

లెక్కల చిక్కులు: మరో మిత్రపక్షంతో భాజపాకు ఇబ్బందులు!

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై మిత్రపక్షం శివసేనతో చిక్కులు ఎదుర్కొంటోంది భాజపా. పాలన చెరిసగం ప్రతిపాదనపై పట్టుపట్టింది సేనా. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొంది. శివసేనతో పాటు భాజపాకు మిత్రపక్షమైన జేడీయూతోనూ చిక్కులు తప్పేలా లేవు.

మోదీ 2.0 ప్రభుత్వం కొలువుదీరే సమయంలో... కేంద్ర కేబినెట్​లో చేరేందుకు నిరాకరించింది జేడీయూ. ఒకే సీటు ఇవ్వటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే.. తాజాగా సరికొత్త ప్రతిపాదన చేసింది జేడీయూ. పార్టీ సంఖ్యాబలం దమాషా ప్రకారం కేంద్ర కేబినెట్​లో సముచిత స్థానం కల్పించాలని కోరింది. ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్​ షా ఈ ప్రతిపాదనపై చొరవ తీసుకుంటే స్వాగతిస్తామని పేర్కొనటం ప్రాధాన్యం సంతరించుకుంది.

జేడీయూ అధ్యక్షుడిగా బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​కుమార్​ మరో మూడేళ్ల కాలానికి ఎన్నికైన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి. రాష్ట్ర ప్రభుత్వంలో భాజపాకు ముఖ్యమంత్రి నితీశ్​కుమార్​ సముచిత స్థానం కల్పించారని గుర్తుచేశారు.

కేసీ త్యాగి, జేడీయూ ప్రధాన కార్యదర్శి

"2015 బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పు భాజపాకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ జేడీయూ మంత్రి పదవులను పంచుకుంది. ఉపముఖ్యమంత్రి పదవిని ఇచ్చింది. బిహార్​లో ఎన్డీఏకి జేడీయూ అతిపెద్ద భాగస్వామి. కేంద్ర ప్రభుత్వంలో జేడీయూకు తగినంత ప్రాతినిధ్యం కల్పిస్తే... బిహార్​కు మరింత ప్రాధాన్యం లభిస్తుంది.

లాలూ ప్రసాద్​ నేతృత్వంలోని ఆర్జేడీ, కాంగ్రెస్​ నుంచి 2017లో భాగస్వామ్యాన్ని తెంచుకుని భాజపాతో జట్టుకడితే.. మోదీ తొలి ప్రభుత్వంలోకి జేడీయూని చేర్చుకోలేదు. రెండోసారి అధికారం చేపట్టినప్పుడు మూడు మంత్రి పదవులను డిమాండ్​ చేస్తే ఒకదానికే అంగీకరించారు."

- కేసీ త్యాగి, జేడీయూ ప్రధాన కార్యదర్శి

అయితే.. కేబినెట్​ బెర్తుల అంశంలో భాజపాపై తమ పార్టీ ఎటువంటి షరతులు విధించడం లేదని స్పష్టం చేశారు త్యాగి. భాజపాతో పొత్తుపై ఎలాంటి అనుమానలు లేవన్నారు. కానీ.. రానున్న ఝార్ఖండ్​, దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.

కశ్మీర్​లో ఈయూ బృందం పర్యటనపై..

ఐరోపా సమాఖ్య ఎంపీల బృందం కశ్మీర్​లో పర్యటించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించటంపై అభ్యంతరం తెలిపింది జేడీయూ. కశ్మీర్​ సమస్యను అంతర్జాతీయం చేయడానికి వ్యతిరేకమనే భారత్​ విధానానికి ఇది విరుద్ధంగా లేదా అని ప్రశ్నించింది.

ఇదీ చూడండి: బంగారం మింగిన ఎద్దు- బయటకు తీసేందుకు పాట్లు

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై మిత్రపక్షం శివసేనతో చిక్కులు ఎదుర్కొంటోంది భాజపా. పాలన చెరిసగం ప్రతిపాదనపై పట్టుపట్టింది సేనా. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొంది. శివసేనతో పాటు భాజపాకు మిత్రపక్షమైన జేడీయూతోనూ చిక్కులు తప్పేలా లేవు.

మోదీ 2.0 ప్రభుత్వం కొలువుదీరే సమయంలో... కేంద్ర కేబినెట్​లో చేరేందుకు నిరాకరించింది జేడీయూ. ఒకే సీటు ఇవ్వటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే.. తాజాగా సరికొత్త ప్రతిపాదన చేసింది జేడీయూ. పార్టీ సంఖ్యాబలం దమాషా ప్రకారం కేంద్ర కేబినెట్​లో సముచిత స్థానం కల్పించాలని కోరింది. ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్​ షా ఈ ప్రతిపాదనపై చొరవ తీసుకుంటే స్వాగతిస్తామని పేర్కొనటం ప్రాధాన్యం సంతరించుకుంది.

జేడీయూ అధ్యక్షుడిగా బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​కుమార్​ మరో మూడేళ్ల కాలానికి ఎన్నికైన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి. రాష్ట్ర ప్రభుత్వంలో భాజపాకు ముఖ్యమంత్రి నితీశ్​కుమార్​ సముచిత స్థానం కల్పించారని గుర్తుచేశారు.

కేసీ త్యాగి, జేడీయూ ప్రధాన కార్యదర్శి

"2015 బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పు భాజపాకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ జేడీయూ మంత్రి పదవులను పంచుకుంది. ఉపముఖ్యమంత్రి పదవిని ఇచ్చింది. బిహార్​లో ఎన్డీఏకి జేడీయూ అతిపెద్ద భాగస్వామి. కేంద్ర ప్రభుత్వంలో జేడీయూకు తగినంత ప్రాతినిధ్యం కల్పిస్తే... బిహార్​కు మరింత ప్రాధాన్యం లభిస్తుంది.

లాలూ ప్రసాద్​ నేతృత్వంలోని ఆర్జేడీ, కాంగ్రెస్​ నుంచి 2017లో భాగస్వామ్యాన్ని తెంచుకుని భాజపాతో జట్టుకడితే.. మోదీ తొలి ప్రభుత్వంలోకి జేడీయూని చేర్చుకోలేదు. రెండోసారి అధికారం చేపట్టినప్పుడు మూడు మంత్రి పదవులను డిమాండ్​ చేస్తే ఒకదానికే అంగీకరించారు."

- కేసీ త్యాగి, జేడీయూ ప్రధాన కార్యదర్శి

అయితే.. కేబినెట్​ బెర్తుల అంశంలో భాజపాపై తమ పార్టీ ఎటువంటి షరతులు విధించడం లేదని స్పష్టం చేశారు త్యాగి. భాజపాతో పొత్తుపై ఎలాంటి అనుమానలు లేవన్నారు. కానీ.. రానున్న ఝార్ఖండ్​, దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.

కశ్మీర్​లో ఈయూ బృందం పర్యటనపై..

ఐరోపా సమాఖ్య ఎంపీల బృందం కశ్మీర్​లో పర్యటించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించటంపై అభ్యంతరం తెలిపింది జేడీయూ. కశ్మీర్​ సమస్యను అంతర్జాతీయం చేయడానికి వ్యతిరేకమనే భారత్​ విధానానికి ఇది విరుద్ధంగా లేదా అని ప్రశ్నించింది.

ఇదీ చూడండి: బంగారం మింగిన ఎద్దు- బయటకు తీసేందుకు పాట్లు

Intro:Body:

Yadagiri: A KSRTC bus mowed down a boy and injured a woman in Shahpur, Yadgir district. The deceased has been identified as 5-year-old Mohammed Mubarak. The incident was caught on CCTV. Incident took place yesterday

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.