ETV Bharat / bharat

నేడు తేలనున్న నిర్భయ దోషుల భవితవ్యం..!

author img

By

Published : Jan 31, 2020, 5:29 AM IST

Updated : Feb 28, 2020, 2:52 PM IST

నిర్భయ దోషుల ఉరి శిక్ష అమలు... రోజుకో మలుపు తిరుగుతోంది. దోషుల న్యాయపరమైన అవకాశాలు పెండింగ్​లో ఉన్న నేపథ్యంలో శిక్ష అమలుపై సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో నలుగురు దోషులు దాఖలు చేసిన పిటిషన్​పై దిల్లీ కోర్టుకు నేడు తిహార్​ జైలు అధికారులు ఇవ్వనున్న నివేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

nirbhaya
నేడు తేలనున్న నిర్భయ దోషుల భవితవ్యం..!

నేడు తేలనున్న నిర్భయ దోషుల భవితవ్యం..!

దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషుల మరణ దండనకు ఆదేశాలు వచ్చినా అమలుపై ఇంకా సందిగ్ధం నెలకొంది. ఓవైపు శనివారం ఉరి శిక్ష అమలు చేసేందుకు తిహార్​ జైల్లో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మరోవైపు మరణ దండనను ఆలస్యం చేసేందుకు దోషులు న్యాయపరమైన అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు.

దోషుల్లో ఒకడైన ముకేశ్​ కుమార్​ క్షమాభిక్ష పిటిషన్​ కారణంగా ఇప్పటికే జనవరి 22న అమలు కావాల్సిన శిక్ష.. ఫిబ్రవరి 1కి వాయిదా పడింది. ప్రస్తుతం మరో దోషి వినయ్​ కుమార్​ తాజాగా రాష్ట్రపతికి క్షమాభిక్ష అర్జీ పెట్టుకున్నాడు. మూడో దోషి అక్షయ్‌ ఠాకూర్‌ దాఖలు చేసిన క్యురేటివ్​ పిటిషన్‌ను న్యాయస్థానం నిన్న కొట్టివేసినా అతనికి ఇంకా న్యాయపరమైన అవకాశాలు ఉన్నాయి. మరో దోషి పవన్​ గుప్తాకు క్యురేటివ్​ పిటిషన్ ​దాఖలు చేసేందుకు అవకాశముంది.

తిహార్​ జైలుకు కోర్టు నోటీసులు

ఇదే కారణంతో మరణ శిక్ష అమలుపై నిరవధికంగా స్టే విధించాలని నలుగురు దోషులు.. దిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం విచారణకు రాగా.. ప్రభుత్వ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్​... న్యాయ వ్యవస్థను అపహాస్యం చేసేలా, శిక్షను ఆలస్యం చేసే ఎత్తుగడలా ఉందని వాదించారు.

వాదనలు ఆలకించిన జడ్జి... తిహార్ జైలు అధికారులకు నోటీసులు జారీ చేశారు. దోషుల అభ్యర్థనపై శుక్రవారం ఉదయం 10 గంటలలోపు తమ అభిప్రాయం చెప్పాలని ఆదేశించారు.

ఆలస్యమవుతుందా?

అంతేకాకుండా వినయ్​ కుమార్​ క్షమాభిక్ష పిటిషన్​ను రాష్ట్రపతి ఒకవేళ తిరస్కరించినా.. దోషికి మరో 14 రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో తిహార్​ జైలు అధికారులు శుక్రవారం అందించే నివేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అధికారుల వివరణను అనుసరించి కోర్టు ఆదేశాలు ఇవ్వనుంది.

ముమ్మర ఏర్పాట్లు..

మరోవైపు తిహార్​ జైల్లో దోషులను శనివారం ఉరితీసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. తలారిగా ఎంపికైన పవన్​ జల్లాడ్​ నిన్న తిహార్​ జైలులో రిపోర్టు చేశాడు. నేడు ఉరి శిక్షకు సంబంధించి ట్రయల్స్​ చేయనున్నాడు.

నేడు తేలనున్న నిర్భయ దోషుల భవితవ్యం..!

దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషుల మరణ దండనకు ఆదేశాలు వచ్చినా అమలుపై ఇంకా సందిగ్ధం నెలకొంది. ఓవైపు శనివారం ఉరి శిక్ష అమలు చేసేందుకు తిహార్​ జైల్లో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మరోవైపు మరణ దండనను ఆలస్యం చేసేందుకు దోషులు న్యాయపరమైన అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు.

దోషుల్లో ఒకడైన ముకేశ్​ కుమార్​ క్షమాభిక్ష పిటిషన్​ కారణంగా ఇప్పటికే జనవరి 22న అమలు కావాల్సిన శిక్ష.. ఫిబ్రవరి 1కి వాయిదా పడింది. ప్రస్తుతం మరో దోషి వినయ్​ కుమార్​ తాజాగా రాష్ట్రపతికి క్షమాభిక్ష అర్జీ పెట్టుకున్నాడు. మూడో దోషి అక్షయ్‌ ఠాకూర్‌ దాఖలు చేసిన క్యురేటివ్​ పిటిషన్‌ను న్యాయస్థానం నిన్న కొట్టివేసినా అతనికి ఇంకా న్యాయపరమైన అవకాశాలు ఉన్నాయి. మరో దోషి పవన్​ గుప్తాకు క్యురేటివ్​ పిటిషన్ ​దాఖలు చేసేందుకు అవకాశముంది.

తిహార్​ జైలుకు కోర్టు నోటీసులు

ఇదే కారణంతో మరణ శిక్ష అమలుపై నిరవధికంగా స్టే విధించాలని నలుగురు దోషులు.. దిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం విచారణకు రాగా.. ప్రభుత్వ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్​... న్యాయ వ్యవస్థను అపహాస్యం చేసేలా, శిక్షను ఆలస్యం చేసే ఎత్తుగడలా ఉందని వాదించారు.

వాదనలు ఆలకించిన జడ్జి... తిహార్ జైలు అధికారులకు నోటీసులు జారీ చేశారు. దోషుల అభ్యర్థనపై శుక్రవారం ఉదయం 10 గంటలలోపు తమ అభిప్రాయం చెప్పాలని ఆదేశించారు.

ఆలస్యమవుతుందా?

అంతేకాకుండా వినయ్​ కుమార్​ క్షమాభిక్ష పిటిషన్​ను రాష్ట్రపతి ఒకవేళ తిరస్కరించినా.. దోషికి మరో 14 రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో తిహార్​ జైలు అధికారులు శుక్రవారం అందించే నివేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అధికారుల వివరణను అనుసరించి కోర్టు ఆదేశాలు ఇవ్వనుంది.

ముమ్మర ఏర్పాట్లు..

మరోవైపు తిహార్​ జైల్లో దోషులను శనివారం ఉరితీసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. తలారిగా ఎంపికైన పవన్​ జల్లాడ్​ నిన్న తిహార్​ జైలులో రిపోర్టు చేశాడు. నేడు ఉరి శిక్షకు సంబంధించి ట్రయల్స్​ చేయనున్నాడు.

ZCZC
PRI ERG ESPL NAT
.KOLKATA CES9
WB-OPPN-RALLY
Central government pursuing RSS agenda: Biman Bose
         Kolkata, Jan 30 (PTI) Left Front Chairman Biman Bose
on Thursday accused the BJP-led central government of pursuing
the agenda of the Rashtriya Swayamsevak Sangh (RSS) and urged
people to fight against divisive forces.
         Bose appealed to all "anti-BJP and anti-Trinamool
Congress" parties to come together in the "battle against
religion-based politics".
         "The main objective of the Narendra Modi government is
to pursue the agenda of the RSS, and not of the people of the
country," he said, addressing a joint rally of 17 Left
parties, the Congress and Welfare Party of India (WPI) to mark
the 72nd death anniversary of Mahatma Gandhi.
         The march started from Ramlila Maidan here and ended
at Gandhi Bhavan in Beliaghata, covering a distance of around
five km.
         "At this Gandhi Bhavan, we want to take the oath to
fight against divisive forces and defeat attempts to divide
people on religious lines," Bose said, claiming that both the
BJP and the TMC are "playing divisive politics".
         "The basic needs of people are not being addressed by
the government. The prices of essential commodities are
rising, while the Modi regime is dividing people on religious
lines through the CAA and NRC," Congress Rajya Sabha MP Pradip
Bhattacharya said.
         He asserted that the Congress and the Left parties
would together fight against the "evil designs of BJP and TMC
to divide the people on religious lines." PTI AMR
RBT
RBT
01302234
NNNN
Last Updated : Feb 28, 2020, 2:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.