ETV Bharat / bharat

వెంటాడిన కరోనా భయాలు.. ఇద్దరు ఆత్మహత్య

author img

By

Published : Apr 11, 2020, 4:59 PM IST

మహారాష్ట్రలో కరోనా ధాటికి పరోక్షంగా ఇద్దరు వ్యక్తులు బలయ్యారు. కొవిడ్​ వైరస్​ సోకిందన్న అనుమానాలు, భయాలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఓ వ్యక్తి గొంతుకోసుకొని చనిపోగా.. మరొకరు ఉరి వేసుకున్నారు.

Maha: COVID-19 patient from Assam allegedly commits suicide
వెంటాడిన కరోనా భయాలు.. ఇద్దరు ఆత్మహత్య

కరోనా మహమ్మారి వల్ల ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లక్షకుపైగా మరణాలు సంభవించాయి. అయితే.. కరోనా భయాలతోనే ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడిన వేర్వేరు ఘటనలు మహారాష్ట్రలో జరిగాయి.

అసోం కార్మికుడు..

అసోం- నాగోన్​ నుంచి మహారాష్ట్రకు వచ్చిన ఓ వలస కార్మికుడికి ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించారు. ఫలితాల్లో పాజిటివ్​ రావడం వల్ల అతడిని ఈ నెల 7న అకోలాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. తీవ్ర భయాందోళనలకు గురైన ఆ బాధితుడు అక్కడే గొంతుకోసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నాసిక్​లో మరో వ్యక్తి

మహారాష్ట్ర- నాసిక్​లో మరో వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చెహేది ప్రాంతానికి చెందిన ప్రతీక్​ రాజు అనే వ్యక్తి సూసైడ్​ నోట్​ రాసి మరీ.. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ప్లంబర్​గా పనిచేసే రాజు.. గొంతు వ్యాధితో ఓ ప్రైవేట్​ వైద్యుని వద్ద చికిత్స పొందుతున్నాడు. అయితే.. తనకు కరోనా సోకిందన్న అనుమానం, భయాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అతని రక్త నమూనాలను సేకరించి పరీక్షకు పంపించినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: కరోనాపై ఆందోళన వద్దు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు!

కరోనా మహమ్మారి వల్ల ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లక్షకుపైగా మరణాలు సంభవించాయి. అయితే.. కరోనా భయాలతోనే ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడిన వేర్వేరు ఘటనలు మహారాష్ట్రలో జరిగాయి.

అసోం కార్మికుడు..

అసోం- నాగోన్​ నుంచి మహారాష్ట్రకు వచ్చిన ఓ వలస కార్మికుడికి ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించారు. ఫలితాల్లో పాజిటివ్​ రావడం వల్ల అతడిని ఈ నెల 7న అకోలాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. తీవ్ర భయాందోళనలకు గురైన ఆ బాధితుడు అక్కడే గొంతుకోసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నాసిక్​లో మరో వ్యక్తి

మహారాష్ట్ర- నాసిక్​లో మరో వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చెహేది ప్రాంతానికి చెందిన ప్రతీక్​ రాజు అనే వ్యక్తి సూసైడ్​ నోట్​ రాసి మరీ.. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ప్లంబర్​గా పనిచేసే రాజు.. గొంతు వ్యాధితో ఓ ప్రైవేట్​ వైద్యుని వద్ద చికిత్స పొందుతున్నాడు. అయితే.. తనకు కరోనా సోకిందన్న అనుమానం, భయాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అతని రక్త నమూనాలను సేకరించి పరీక్షకు పంపించినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: కరోనాపై ఆందోళన వద్దు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.