ETV Bharat / bharat

భారత్​లో కనిష్ఠానికి కరోనా మరణాల రేటు​

author img

By

Published : Oct 16, 2020, 6:07 PM IST

భారత్​లో కరోనా కేసులు ఓవైపు భారీగా పెరుగుతుంటే.. మరోవైపు మరణాలు తగ్గడం ఊరట కలిగిస్తోంది. మార్చి 22 నుంచి తొలిసారి మరణాల రేటు కనిష్ఠానికి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ రేటు 1.52 శాతంగా ఉంది.

India's COVID-19 fatality rate
భారత్​లో కనిష్ఠానికి కరోనా మరణాల రేటు​

కరోనా ధాటికి కుదేలైన దేశాల్లో భారత్​ ఒకటి. ఈ మహమ్మారి దేశంపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటికీ ప్రతిరోజు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే.. భారత్​లో మరణాల రేటు తక్కువగా ఉండటం ఊరటనిస్తోంది.

ప్రతి పది లక్షల కేసుల్లో 81 కంటే తక్కువగానే మరణాలు నమోదవుతున్నాయి. అక్టోబర్​ 4 నుంచి మరణాల రేటు క్షీణిస్తోంది. ప్రస్తుతం 1.52 శాతంగా ఉన్న ఈ రేటు.. మార్చి 22 నుంచి తొలిసారి కనిష్ఠానికి చేరింది. మెరుగైన నియంత్రణ చర్యల వల్ల 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని మరణాల రేటు జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది.

" క్రమంగా కొవిడ్​-19 మరణాల రేటు తగ్గుతోంది. ప్రస్తుతం 1.52 శాతంగా ఉంది. మార్చి 22 నుంచి తొలిసారి ఈ రేటు అత్యల్పానికి చేరింది"

-- కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ.

ఈ ప్రాంతాల్లో ఎక్కువగా..

పుదుచ్చేరి(403), మహారాష్ట్ర(335), గోవా (331), దిల్లీ (317), కర్ణాటక (152), తమిళనాడు(135), పంజాబ్​(131)లో ప్రతి మిలియన్​కు ఎక్కువ మరణాలు నమోదవుతున్నాయి. ఇవి జాతీయ సగటు కంటే ఎక్కువ.

భారత్​లో ప్రతి రోజు నమోదవుతున్న కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా వస్తున్నాయి. యాక్టివ్​ కేసుల కంటే రికవరీలు ఎనిమిది రెట్లు పెరిగాయి. యాక్టివ్​ కేసుల సంఖ్య 10.92 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,212 కొవిడ్​ ఆసుపత్రులు ప్రజలకు సేవలందిస్తున్నాయి.

కరోనా ధాటికి కుదేలైన దేశాల్లో భారత్​ ఒకటి. ఈ మహమ్మారి దేశంపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటికీ ప్రతిరోజు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే.. భారత్​లో మరణాల రేటు తక్కువగా ఉండటం ఊరటనిస్తోంది.

ప్రతి పది లక్షల కేసుల్లో 81 కంటే తక్కువగానే మరణాలు నమోదవుతున్నాయి. అక్టోబర్​ 4 నుంచి మరణాల రేటు క్షీణిస్తోంది. ప్రస్తుతం 1.52 శాతంగా ఉన్న ఈ రేటు.. మార్చి 22 నుంచి తొలిసారి కనిష్ఠానికి చేరింది. మెరుగైన నియంత్రణ చర్యల వల్ల 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని మరణాల రేటు జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది.

" క్రమంగా కొవిడ్​-19 మరణాల రేటు తగ్గుతోంది. ప్రస్తుతం 1.52 శాతంగా ఉంది. మార్చి 22 నుంచి తొలిసారి ఈ రేటు అత్యల్పానికి చేరింది"

-- కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ.

ఈ ప్రాంతాల్లో ఎక్కువగా..

పుదుచ్చేరి(403), మహారాష్ట్ర(335), గోవా (331), దిల్లీ (317), కర్ణాటక (152), తమిళనాడు(135), పంజాబ్​(131)లో ప్రతి మిలియన్​కు ఎక్కువ మరణాలు నమోదవుతున్నాయి. ఇవి జాతీయ సగటు కంటే ఎక్కువ.

భారత్​లో ప్రతి రోజు నమోదవుతున్న కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా వస్తున్నాయి. యాక్టివ్​ కేసుల కంటే రికవరీలు ఎనిమిది రెట్లు పెరిగాయి. యాక్టివ్​ కేసుల సంఖ్య 10.92 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,212 కొవిడ్​ ఆసుపత్రులు ప్రజలకు సేవలందిస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.