ETV Bharat / bharat

ముగిసిన భారత్-ఫ్రాన్స్ వాయుసేన విన్యాసాలు - భారత్ ఫ్రాన్స్ వాయుసేన విన్యాసాలు

భారత్, ఫ్రాన్స్ ఎయిర్​ఫోర్స్​లు కలిసి నిర్వహించిన విన్యాసాలు శనివారం ముగిశాయి. వాయుసేనలు అనుసరించే ఉత్తమ పద్ధతులను ఒకరినొకరితో పంచుకునేందుకు విన్యాసాలు ఉపయోగపడతాయని రక్షణ శాఖ పేర్కొంది. రఫేల్ యుద్ధవిమానాలు ఈ డ్రిల్​లో పాల్గొని కఠినతరమైన విన్యాసాలు చేశాయని తెలిపింది.

Indian and French air forces conclude mega drill in Jodhpur
ముగిసిన భారత్, ఫ్రాన్స్ వాయుసేనల విన్యాసాలు
author img

By

Published : Jan 24, 2021, 5:24 AM IST

భారత్, ఫ్రాన్స్ వాయుసేనలు కలిసి నాలుగు రోజుల పాటు నిర్వహించిన మెగా డ్రిల్ శనివారం ముగిసింది. 'ఎక్స్ డిజర్ట్ నైట్' పేరిట జోధ్​పుర్​లో ఈ విన్యాసాలు జరిగాయి. ఇందులో భారత్, ఫ్రాన్స్​కు చెందిన రఫేల్ విమానాలు పాల్గొని, కఠినమైన విన్యాసాలను ప్రదర్శించాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మిరాజ్, సుఖోయ్​ విమానాలతో పాటు, గగనతల హెచ్చరిక వ్యవస్థ, ఐఎల్-78 ఫ్లైట్ రీఫ్యూయెలింగ్ విమానం సైతం విన్యాసాల్లో పాల్గొన్నాయని పేర్కొంది.

Indian and French air forces conclude mega drill in Jodhpur
ఇరుదేశాల వాయుసేన పైలట్లు, అధికారులు

"రఫేల్​తో పాటు, సు-30 ఎంకేఐ, మిరాజ్ 2000 ఎయిర్​క్రాఫ్ట్​లు పలు కఠినమైన విన్యాసాలను చేపట్టాయి. కార్యాచరణ సామర్థ్యాలు మెరుగుపపర్చడం, ఇంటరాపరేబిలిటీని పెంచే లక్ష్యంతో ఇరుదేశాల వాయుసేనలు విన్యాసాల్లో పాల్గొన్నాయి. వాయుసేనలు పాటించే ఉత్తమ పద్ధతులను ఒకరినొకరితో పంచుకునేందుకు విన్యాసాలు ఉపయోగపడతాయి."

-రక్షణ శాఖ ప్రకటన

నాలుగు రోజుల పాటు సాగిన ఈ విన్యాసాలను ఎయిర్​ఫోర్స్ చీఫ్ ఆర్​కేఎస్ భదౌరియా పరిశీలించారు. భారత్​లోని ఫ్రాన్స్ రాయబారి సైతం భదౌరియాతో కలిసి శనివారం జోధ్​పుర్​లోని ఎయిర్​ఫోర్స్ స్టేషన్​ను సందర్శించారు.

Indian and French air forces conclude mega drill in Jodhpur
ఫ్రాన్స్ రాయబారితో భదౌరియా

భారత్, ఫ్రాన్స్ వాయుసేనలు కలిసి నాలుగు రోజుల పాటు నిర్వహించిన మెగా డ్రిల్ శనివారం ముగిసింది. 'ఎక్స్ డిజర్ట్ నైట్' పేరిట జోధ్​పుర్​లో ఈ విన్యాసాలు జరిగాయి. ఇందులో భారత్, ఫ్రాన్స్​కు చెందిన రఫేల్ విమానాలు పాల్గొని, కఠినమైన విన్యాసాలను ప్రదర్శించాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మిరాజ్, సుఖోయ్​ విమానాలతో పాటు, గగనతల హెచ్చరిక వ్యవస్థ, ఐఎల్-78 ఫ్లైట్ రీఫ్యూయెలింగ్ విమానం సైతం విన్యాసాల్లో పాల్గొన్నాయని పేర్కొంది.

Indian and French air forces conclude mega drill in Jodhpur
ఇరుదేశాల వాయుసేన పైలట్లు, అధికారులు

"రఫేల్​తో పాటు, సు-30 ఎంకేఐ, మిరాజ్ 2000 ఎయిర్​క్రాఫ్ట్​లు పలు కఠినమైన విన్యాసాలను చేపట్టాయి. కార్యాచరణ సామర్థ్యాలు మెరుగుపపర్చడం, ఇంటరాపరేబిలిటీని పెంచే లక్ష్యంతో ఇరుదేశాల వాయుసేనలు విన్యాసాల్లో పాల్గొన్నాయి. వాయుసేనలు పాటించే ఉత్తమ పద్ధతులను ఒకరినొకరితో పంచుకునేందుకు విన్యాసాలు ఉపయోగపడతాయి."

-రక్షణ శాఖ ప్రకటన

నాలుగు రోజుల పాటు సాగిన ఈ విన్యాసాలను ఎయిర్​ఫోర్స్ చీఫ్ ఆర్​కేఎస్ భదౌరియా పరిశీలించారు. భారత్​లోని ఫ్రాన్స్ రాయబారి సైతం భదౌరియాతో కలిసి శనివారం జోధ్​పుర్​లోని ఎయిర్​ఫోర్స్ స్టేషన్​ను సందర్శించారు.

Indian and French air forces conclude mega drill in Jodhpur
ఫ్రాన్స్ రాయబారితో భదౌరియా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.