ETV Bharat / bharat

డీజీపీకి కొత్త చిక్కు తెచ్చిపెట్టిన ట్వీట్​

author img

By

Published : Jun 15, 2020, 4:19 PM IST

Updated : Jun 15, 2020, 4:45 PM IST

జమ్ముకశ్మీర్​ డీజీపీ దిల్బాగ్​ సింగ్​కు.. ఓ ట్వీట్​ ఇబ్బందికరంగా మారింది. స్థానిక ఐజీ స్థాయి అధికారి.. దిల్బాగ్​ అక్రమంగా భూమి కలిగి ఉన్నారని ఆరోపణలు గుప్పించారు. దీనిపై కశ్మీర్​ మొత్తం పెద్ద చర్చే నడిచింది.

IGP rank officer accuses JK DG of owning 'unregistered' land in Jammu
డీజీపీకి కొత్త చిక్కుతెచ్చిపెట్టిన ఆ ట్వీట్​!

తన దురుసు ప్రవర్తనతో గతంలో వార్తల్లో నిలిచిన జమ్ముకశ్మీర్​ ఇన్​స్పెక్టర్​ జనరల్​ స్థాయి అధికారి బసంత్​ రథ్​.. మరోసారి వివాదం సృష్టించారు. ఇప్పుడు ఏకంగా జమ్మూ డీజీపీ దిల్బాగ్​ సింగ్​పైనే ట్విట్టర్​ వేదికగా నిరాధార ఆరోపణలు గుప్పించారు.

వివరాల్లోకి వస్తే.. దిల్బాగ్​ సింగ్​ పేరుతో ఉన్న ఓ ట్విట్టర్ ఖాతా​ నుంచి రథ్​పై ట్వీట్ రావడమే వివాదానికి కారణమైంది. ఓ ఆంగ్ల పత్రిక​ కథనాన్ని ఉదహరిస్తూ.. 'ఎవరో అపరిచితులు తన చదువుల కోసం సాయం చేశారు. అందుకే బదులుగా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తూ సమాజానికి సేవ చేస్తున్నారు' అని రథ్​ ఖాతాను ట్యాగ్​ చేస్తూ దిల్బాగ్​ సింగ్​ పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ చేశారు.

ఈ ట్వీట్​కు రిప్లై ఇచ్చిన బసంత్... డీజీపీ దిల్బాగ్​ సింగ్​పైనే తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

IGP rank officer accuses JK DG of owning 'unregistered' land in Jammu
ఇదే వివాదానికి కారణం

''హాయ్​ దిల్బాగ్​ సింగ్​. నేను నిన్ను దిల్లూ అని పిలవచ్చా? సరోరేలో దంత కళాశాల సమీపంలో మీకు 50 కెనాళ్ల భూమి ఉంది కదా? అది నీ పేరు మీదే ఉందా?''

- బసంత్​ రథ్​ ట్వీట్​

ఈ ఒక్క ట్వీట్​తో ఆ డీజీపీకి పెద్ద చిక్కొచ్చిపడింది. ఆ ట్వీట్​ డీజీపీ దిల్బాగ్​ సింగ్​ను ఉద్దేశించే చేసిందా..? లేక వేరెవరైనా అని కశ్మీర్​ మొత్తం చర్చించుకున్నారు. సీనియర్​ అధికారులు, జర్నలిస్టులు సభ్యులుగా ఉన్న వాట్సాప్​ గ్రూపులోనూ దీనిపై పెద్ద చర్చే నడిచింది.

ఈ ఆరోపణలపై అదే గ్రూపులో స్పందించిన డీజీపీ దిల్బాగ్​ సింగ్​.. ట్వీట్​ చేసిన వ్యక్తికి సవాల్​ విసిరారు. దీనితో బసంత్​ రథ్​ చేసిన ట్వీట్లు తనను ఉద్దేశించనవే అని డీజీపీ అంగీకరించినట్లయింది.

''నా పేరు మీద, నా కుటుంబ సభ్యుల పేరు మీద.. అంగుళం భూమైనా, ఆస్తులు, ఇతర వ్యాపారాలు ఏమైనా ఉంటే సాక్ష్యాలతో నిరూపించాలని అతనికి సవాల్​ విసురుతున్నా.''

- ఓ అనధికారిక ప్రకటనలో డీజీపీ దిల్బాగ్​ సింగ్​

డీజీపీనే అంటావా..!

కశ్మీర్​ ఐజీపీ విజయ్​ కుమార్​ కూడా.. బసంత్​ రథ్​ను తీవ్రంగా మందలించారు. ఇదొక క్రమశిక్షాణారాహిత్య చర్యగా అభివర్ణించారు. డీజీపీని చూసి గర్విస్తున్నామని అన్నారు.

''ఐజీపీ బసంత్​ క్రమశిక్షణా చర్యలను ఉల్లంఘిస్తూ.. పోలీసు దళాలకు ముప్పును సృష్టిస్తున్నారు. ఒకవేళ ఆయన దగ్గర సాక్ష్యాలేమైనా ఉంటే.. నేరుగా ఫిర్యాదు చేయాలి. దిల్బాగ్​ సింగ్ ఐపీఎస్​.. గొప్ప పోలీస్. ఆయనను చూసి మేం గర్విస్తున్నాం. ఆయన నాయకత్వంలో మేమెంతో నేర్చుకుంటున్నాం.''

- కశ్మీర్​ ఐజీపీ విజయ్​ కుమార్​

అయితే.. ఇలా వివాదాలు సృష్టించడం ఐజీపీ రథ్​కు కొత్తేమీ కాదు. గతేడాది మాజీ డీజీపీ ఎస్పీ వైద్​పైన ఇలాగే అనుచిత విమర్శలు చేశారు.

ఆ నేతపైనా బెదిరింపులు..!

ఇదే సమయంలో.. రథ్​ తనను బెదిరింపులకు గురిచేస్తున్నారని స్థానిక పీడీపీ మాజీ శాసనసభ్యుడు ఖుర్షీద్​ ఆలం శనివారం ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం శ్రీనగర్​ పీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన.. మాజీ ట్రాఫిక్​ ఐజీ బసంత్​ రథ్​పై హుంహామా పోలీస్​స్టేషన్​లో కంప్లయింట్​ చేశారు. ఫోన్​ చేసి బెదిరిస్తున్నారని, అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆరోపించారు.

తన దురుసు ప్రవర్తనతో గతంలో వార్తల్లో నిలిచిన జమ్ముకశ్మీర్​ ఇన్​స్పెక్టర్​ జనరల్​ స్థాయి అధికారి బసంత్​ రథ్​.. మరోసారి వివాదం సృష్టించారు. ఇప్పుడు ఏకంగా జమ్మూ డీజీపీ దిల్బాగ్​ సింగ్​పైనే ట్విట్టర్​ వేదికగా నిరాధార ఆరోపణలు గుప్పించారు.

వివరాల్లోకి వస్తే.. దిల్బాగ్​ సింగ్​ పేరుతో ఉన్న ఓ ట్విట్టర్ ఖాతా​ నుంచి రథ్​పై ట్వీట్ రావడమే వివాదానికి కారణమైంది. ఓ ఆంగ్ల పత్రిక​ కథనాన్ని ఉదహరిస్తూ.. 'ఎవరో అపరిచితులు తన చదువుల కోసం సాయం చేశారు. అందుకే బదులుగా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తూ సమాజానికి సేవ చేస్తున్నారు' అని రథ్​ ఖాతాను ట్యాగ్​ చేస్తూ దిల్బాగ్​ సింగ్​ పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ చేశారు.

ఈ ట్వీట్​కు రిప్లై ఇచ్చిన బసంత్... డీజీపీ దిల్బాగ్​ సింగ్​పైనే తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

IGP rank officer accuses JK DG of owning 'unregistered' land in Jammu
ఇదే వివాదానికి కారణం

''హాయ్​ దిల్బాగ్​ సింగ్​. నేను నిన్ను దిల్లూ అని పిలవచ్చా? సరోరేలో దంత కళాశాల సమీపంలో మీకు 50 కెనాళ్ల భూమి ఉంది కదా? అది నీ పేరు మీదే ఉందా?''

- బసంత్​ రథ్​ ట్వీట్​

ఈ ఒక్క ట్వీట్​తో ఆ డీజీపీకి పెద్ద చిక్కొచ్చిపడింది. ఆ ట్వీట్​ డీజీపీ దిల్బాగ్​ సింగ్​ను ఉద్దేశించే చేసిందా..? లేక వేరెవరైనా అని కశ్మీర్​ మొత్తం చర్చించుకున్నారు. సీనియర్​ అధికారులు, జర్నలిస్టులు సభ్యులుగా ఉన్న వాట్సాప్​ గ్రూపులోనూ దీనిపై పెద్ద చర్చే నడిచింది.

ఈ ఆరోపణలపై అదే గ్రూపులో స్పందించిన డీజీపీ దిల్బాగ్​ సింగ్​.. ట్వీట్​ చేసిన వ్యక్తికి సవాల్​ విసిరారు. దీనితో బసంత్​ రథ్​ చేసిన ట్వీట్లు తనను ఉద్దేశించనవే అని డీజీపీ అంగీకరించినట్లయింది.

''నా పేరు మీద, నా కుటుంబ సభ్యుల పేరు మీద.. అంగుళం భూమైనా, ఆస్తులు, ఇతర వ్యాపారాలు ఏమైనా ఉంటే సాక్ష్యాలతో నిరూపించాలని అతనికి సవాల్​ విసురుతున్నా.''

- ఓ అనధికారిక ప్రకటనలో డీజీపీ దిల్బాగ్​ సింగ్​

డీజీపీనే అంటావా..!

కశ్మీర్​ ఐజీపీ విజయ్​ కుమార్​ కూడా.. బసంత్​ రథ్​ను తీవ్రంగా మందలించారు. ఇదొక క్రమశిక్షాణారాహిత్య చర్యగా అభివర్ణించారు. డీజీపీని చూసి గర్విస్తున్నామని అన్నారు.

''ఐజీపీ బసంత్​ క్రమశిక్షణా చర్యలను ఉల్లంఘిస్తూ.. పోలీసు దళాలకు ముప్పును సృష్టిస్తున్నారు. ఒకవేళ ఆయన దగ్గర సాక్ష్యాలేమైనా ఉంటే.. నేరుగా ఫిర్యాదు చేయాలి. దిల్బాగ్​ సింగ్ ఐపీఎస్​.. గొప్ప పోలీస్. ఆయనను చూసి మేం గర్విస్తున్నాం. ఆయన నాయకత్వంలో మేమెంతో నేర్చుకుంటున్నాం.''

- కశ్మీర్​ ఐజీపీ విజయ్​ కుమార్​

అయితే.. ఇలా వివాదాలు సృష్టించడం ఐజీపీ రథ్​కు కొత్తేమీ కాదు. గతేడాది మాజీ డీజీపీ ఎస్పీ వైద్​పైన ఇలాగే అనుచిత విమర్శలు చేశారు.

ఆ నేతపైనా బెదిరింపులు..!

ఇదే సమయంలో.. రథ్​ తనను బెదిరింపులకు గురిచేస్తున్నారని స్థానిక పీడీపీ మాజీ శాసనసభ్యుడు ఖుర్షీద్​ ఆలం శనివారం ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం శ్రీనగర్​ పీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన.. మాజీ ట్రాఫిక్​ ఐజీ బసంత్​ రథ్​పై హుంహామా పోలీస్​స్టేషన్​లో కంప్లయింట్​ చేశారు. ఫోన్​ చేసి బెదిరిస్తున్నారని, అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆరోపించారు.

Last Updated : Jun 15, 2020, 4:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.