ETV Bharat / bharat

శ్రీనగర్​లో ల్యాండ్​లైన్ల ముందు వందల మంది క్యూ!

జమ్ముకశ్మీర్​ శ్రీనగర్​లో ల్యాండ్​లైన్ ఫోన్ల వద్ద వందల మంది ప్రజలు క్యూలో నిల్చుంటున్నారు. తమ బంధువులతో మాట్లాడేందుకు గుమికూడుతున్నారు. ఈ పరిస్థితితో మొబైల్​ ఫోన్లు వచ్చాక కనుమరుగైన ప్రజాటెలిఫోన్లు కళకళలాడుతూ పాత రోజుల్ని గుర్తుకు తెస్తున్నాయి.

author img

By

Published : Sep 4, 2019, 6:31 AM IST

Updated : Sep 29, 2019, 9:18 AM IST

శ్రీనగర్​లో ల్యాండలైన్ల ముందు వందల మంది క్యూ!

జమ్ముకశ్మీర్​లోని కొన్ని ప్రాంతాల్లో లాండ్​లైన్​ సేవలను పునరుద్ధరించారు. శ్రీనగర్​లోని వందలాది మంది ప్రజలు తమ బంధువులతో మాట్లాడటానికి లాండ్​లైన్ కోసం క్యూలో నిలబడుతున్నారు. మొబైల్ ఫోన్లు​ వచ్చాక ప్రజా టెలిఫోన్​ (పీసీఓ), లాండ్​లైన్​ వాడకం తగ్గిపోయింది. కశ్మీర్​లో ప్రస్తుత పరిస్థితులతో వీటికి మళ్లీ డిమాండ్​ పెరిగింది.

గత నెలలో ఆర్టికల్​ 370 రద్దు బిల్లును పార్లమెంట్​లో ప్రవేశపెట్టడానికి కొన్ని గంటల ముందు కశ్మీర్​లో మొబైల్​, ఇంటర్​ నెట్ సేవలను నిలిపివేసింది కేంద్రం. ప్రసుత్తం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ సేవలను పునరుద్ధరించింది. ల్యాండ్​లైన్ అందుబాటులో లేని వారు ప్రజాటెలిఫోన్ల ముందు క్యూ కడుతున్నారు. దీంతో మొబైల్​ ఫోన్ల వినియోగం లేని పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. ప్రజా టెలిఫోన్లు రద్దీగా మారాయి.

శ్రీనగర్​లో​ ఓ స్థానికుడు దూర ప్రాంతాల్లో ఉన్న వారితో మాట్లాడేందుకు రెండు ల్యాండ్​లైన్లను​ ఏర్పాటు చేశాడు. తమ బంధువులతో మాట్లాడటానికి అతని ఇంటికి వందల మంది ప్రజలు వస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల వారి నుంచి కొంత డబ్బు తీసుకోవడం మొదలుపెట్టాడు.

"ఎక్కువ మంది రావటం వలన వారిని నిలువరించలేకపోయాం. కొంత మంది కాల్​ చేయటం కోసం గొడవ పడ్డారు. చివరికి వారి నుంచి కొంత రుసుము తీసుకోవాలనుకున్నాను."

-లాండ్​లైన్​ యజమాని.

టెలిఫోన్ అవసరం ఎక్కువగా ఉండటం వల్ల కశ్మీర్​ ప్రభుత్వం అన్ని పోలీస్​ స్టేషన్లల్లో ఉచిత టెలిఫోన్ సేవలను అందుబాటులో ఉంచింది.

బీఎస్​ఎన్​ఎల్​ కార్యాలయానికి కొత్తగా ల్యాండ్​లైన్​ సేవల కోసం వందల దరఖాస్తులు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాటిని పరిశీలించాక సేవలను అందించగల ప్రదేశాలలో త్వరలో కొత్తవి ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఇదీ చూడండి:'విక్రమ్'​ తొలి కక్ష్య విజయవంతంగా తగ్గింపు

జమ్ముకశ్మీర్​లోని కొన్ని ప్రాంతాల్లో లాండ్​లైన్​ సేవలను పునరుద్ధరించారు. శ్రీనగర్​లోని వందలాది మంది ప్రజలు తమ బంధువులతో మాట్లాడటానికి లాండ్​లైన్ కోసం క్యూలో నిలబడుతున్నారు. మొబైల్ ఫోన్లు​ వచ్చాక ప్రజా టెలిఫోన్​ (పీసీఓ), లాండ్​లైన్​ వాడకం తగ్గిపోయింది. కశ్మీర్​లో ప్రస్తుత పరిస్థితులతో వీటికి మళ్లీ డిమాండ్​ పెరిగింది.

గత నెలలో ఆర్టికల్​ 370 రద్దు బిల్లును పార్లమెంట్​లో ప్రవేశపెట్టడానికి కొన్ని గంటల ముందు కశ్మీర్​లో మొబైల్​, ఇంటర్​ నెట్ సేవలను నిలిపివేసింది కేంద్రం. ప్రసుత్తం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ సేవలను పునరుద్ధరించింది. ల్యాండ్​లైన్ అందుబాటులో లేని వారు ప్రజాటెలిఫోన్ల ముందు క్యూ కడుతున్నారు. దీంతో మొబైల్​ ఫోన్ల వినియోగం లేని పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. ప్రజా టెలిఫోన్లు రద్దీగా మారాయి.

శ్రీనగర్​లో​ ఓ స్థానికుడు దూర ప్రాంతాల్లో ఉన్న వారితో మాట్లాడేందుకు రెండు ల్యాండ్​లైన్లను​ ఏర్పాటు చేశాడు. తమ బంధువులతో మాట్లాడటానికి అతని ఇంటికి వందల మంది ప్రజలు వస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల వారి నుంచి కొంత డబ్బు తీసుకోవడం మొదలుపెట్టాడు.

"ఎక్కువ మంది రావటం వలన వారిని నిలువరించలేకపోయాం. కొంత మంది కాల్​ చేయటం కోసం గొడవ పడ్డారు. చివరికి వారి నుంచి కొంత రుసుము తీసుకోవాలనుకున్నాను."

-లాండ్​లైన్​ యజమాని.

టెలిఫోన్ అవసరం ఎక్కువగా ఉండటం వల్ల కశ్మీర్​ ప్రభుత్వం అన్ని పోలీస్​ స్టేషన్లల్లో ఉచిత టెలిఫోన్ సేవలను అందుబాటులో ఉంచింది.

బీఎస్​ఎన్​ఎల్​ కార్యాలయానికి కొత్తగా ల్యాండ్​లైన్​ సేవల కోసం వందల దరఖాస్తులు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాటిని పరిశీలించాక సేవలను అందించగల ప్రదేశాలలో త్వరలో కొత్తవి ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఇదీ చూడండి:'విక్రమ్'​ తొలి కక్ష్య విజయవంతంగా తగ్గింపు

Pune (Maharashtra), Sep 03 (ANI): A devotee offered massive 151-kg 'modak' to lord Ganesha in Pune. City is dipped in festive mood of Ganesh Chaturthi. Sweet shops are stacked with varieties of modaks. Modaks in chocolate, pista, blueberry, malai flavours are attracting devotees this year. Modak are available in different sizes ranging from 25 gm to 150 kg. While speaking to ANI, owner of a sweet shop said, "We have prepared 11 to 12 types of Modak. We have different types of modak to sell our customers. People demand mawa modak more." The annual festival, which marks the birthday of Lord Ganesha is celebrated with much fervour across western and southern India.
Last Updated : Sep 29, 2019, 9:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.