ETV Bharat / bharat

కోర్టు అనూహ్య తీర్పు.. 100 మొక్కలు నాటాలని ఆదేశం!

ఓ ఆదాయపు పన్ను కేసులో ఐఏఎస్​ అధికారిని 100 మొక్కలు నాటాలని ఆదేశించింది కేరళ హైకోర్టు. గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంలో జాప్యం వహించినందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

author img

By

Published : Feb 14, 2020, 11:24 PM IST

Updated : Mar 1, 2020, 9:16 AM IST

HC orders bureaucrat to plant saplings for delayed action
కోర్టు అనూహ్య తీర్పు.. 100 మొక్కలు నాటాలని జరిమానా!

కేరళ రాష్ట్ర పరిశ్రమల శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉన్నతాధికారి 'కె బిజు'కు ఊహించని శిక్ష విధించింది ఆ రాష్ట్ర హైకోర్టు. ఆదాయపు పన్నుకు సంబంధించి ఓ ప్రైవేటు రసాయన పరిశ్రమ దాఖలు చేసిన పిటిషన్​ను విచారించిన న్యాయస్థానం.. బిజు 100 మొక్కలు నాటాల్సిందిగా తీర్పునిచ్చింది. ఆదాయపన్నులో రసాయన పరిశ్రమకు మినహాయింపునిస్తూ.. కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంలో ఆలస్యం చేసినందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే ఆయన ఏఏ ప్రాంతాల్లో మొక్కలు నాటాలన్న విషయాన్ని అటవీ అధికారులకు అప్పగించింది. అనంతరం మొక్కలు నాటిన జాబితాను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

కేరళ రాష్ట్ర పరిశ్రమల శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉన్నతాధికారి 'కె బిజు'కు ఊహించని శిక్ష విధించింది ఆ రాష్ట్ర హైకోర్టు. ఆదాయపు పన్నుకు సంబంధించి ఓ ప్రైవేటు రసాయన పరిశ్రమ దాఖలు చేసిన పిటిషన్​ను విచారించిన న్యాయస్థానం.. బిజు 100 మొక్కలు నాటాల్సిందిగా తీర్పునిచ్చింది. ఆదాయపన్నులో రసాయన పరిశ్రమకు మినహాయింపునిస్తూ.. కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంలో ఆలస్యం చేసినందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే ఆయన ఏఏ ప్రాంతాల్లో మొక్కలు నాటాలన్న విషయాన్ని అటవీ అధికారులకు అప్పగించింది. అనంతరం మొక్కలు నాటిన జాబితాను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

ఇదీ చదవండి: రామాయణం థీమ్​తో కొత్త రైలు.. మార్చి 10న ప్రారంభం!

Last Updated : Mar 1, 2020, 9:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.