ETV Bharat / bharat

'మా పార్టీ గెలిస్తే ఆ పథకం మరో ఐదేళ్లు కొనసాగింపు' - 'మా పార్టీ గెలిస్తే ఆ పథకం మరో ఐదేళ్లు కొనసాగింపు'

దిల్లీలోని మహిళలకు మరోసారి హామీ ఇచ్చారు ఆమ్​ ఆద్మీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమలులో ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్​ పథకాలను మరో ఐదేళ్ల పాటు కొనసాగిస్తామని భరోసా కల్పించారు

delhi
దిల్లీ
author img

By

Published : Dec 30, 2019, 6:16 AM IST

త్వరలోనే జరగనున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కసరస్తు ముమ్మరం చేసింది అధికార ఆమ్​ ఆద్మీ పార్టీ. ఓటర్లను ఆకట్టుకునేందుకు పలు ప్రకటనలు చేస్తోంది. తమ పార్టీని మరోమారు అధికారంలోకి తీసుకొస్తే.. ప్రస్తుతం కొనసాగుతోన్న మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని మరో ఐదేళ్లు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​. దీంతో పాటు 200 యూనిట్ల లోపు వారికి అందించే ఉచిత విద్యుత్​ పథకాన్నీ కొనసాగిస్తామన్నారు.

ఈ మేరకు సిరాస్​పూర్​లోని 1,164 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఈ ప్రకటన చేశారు కేజ్రీవాల్​. విపక్షాల విమర్శలను పట్టించుకోకుండా.. ప్రజాసంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.

" రాజకీయ నాయకులు 4వేల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్​ను వినియోగించుకుంటున్నప్పుడు లేనిది పేద ప్రజలకు 200యూనిట్లు వరకు ఉచితంగా అందిస్తుంటే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలు గెలిస్తే ఉచిత బస్సు సర్వీసు, ఉచిత విద్యుత్​ను ఆపివేస్తామని అంటున్నారు. కానీ నేను అలా చేయనీయను. మీకు హామీ ఇస్తున్నా. నన్ను మీరు మరోమారు అధికారంలో నిలబడితే మరో ఐదేళ్ల పాటు ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకరాన్ని కొనసాగిస్తాను."

-కేజ్రీవాల్​, దిల్లీ ముఖ్యమంత్రి.

ఇదీ చూడండి : భారత్​- బంగ్లా సరిహద్దు 'స్మార్ట్​ ఫెన్స్'​ వచ్చే ఏడాది పూర్తి

త్వరలోనే జరగనున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కసరస్తు ముమ్మరం చేసింది అధికార ఆమ్​ ఆద్మీ పార్టీ. ఓటర్లను ఆకట్టుకునేందుకు పలు ప్రకటనలు చేస్తోంది. తమ పార్టీని మరోమారు అధికారంలోకి తీసుకొస్తే.. ప్రస్తుతం కొనసాగుతోన్న మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని మరో ఐదేళ్లు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​. దీంతో పాటు 200 యూనిట్ల లోపు వారికి అందించే ఉచిత విద్యుత్​ పథకాన్నీ కొనసాగిస్తామన్నారు.

ఈ మేరకు సిరాస్​పూర్​లోని 1,164 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఈ ప్రకటన చేశారు కేజ్రీవాల్​. విపక్షాల విమర్శలను పట్టించుకోకుండా.. ప్రజాసంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.

" రాజకీయ నాయకులు 4వేల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్​ను వినియోగించుకుంటున్నప్పుడు లేనిది పేద ప్రజలకు 200యూనిట్లు వరకు ఉచితంగా అందిస్తుంటే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలు గెలిస్తే ఉచిత బస్సు సర్వీసు, ఉచిత విద్యుత్​ను ఆపివేస్తామని అంటున్నారు. కానీ నేను అలా చేయనీయను. మీకు హామీ ఇస్తున్నా. నన్ను మీరు మరోమారు అధికారంలో నిలబడితే మరో ఐదేళ్ల పాటు ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకరాన్ని కొనసాగిస్తాను."

-కేజ్రీవాల్​, దిల్లీ ముఖ్యమంత్రి.

ఇదీ చూడండి : భారత్​- బంగ్లా సరిహద్దు 'స్మార్ట్​ ఫెన్స్'​ వచ్చే ఏడాది పూర్తి

Indore (Madhya Pradesh), Dec 29 (ANI): Authorities demolished a four-storey building by controlled explosion. The building did not have any permission by Municipal Corporation. All the safety measures were ensured before carrying out the explosion.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.