ETV Bharat / bharat

కరోనాపై పోరులో ఆయుర్వేద మందుకు చోటు

author img

By

Published : May 11, 2020, 6:20 PM IST

శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద మందు ఫిఫట్రాల్​కు అరుదైన గుర్తింపు లభించింది. కరోనాకు చెక్​ పెట్టగలిగే మందుల జాబితాలో చోటు దక్కించుకుంది. ఇటీవల కొంతమంది నిపుణులు పరిశోధనలు జరిపి, ఈ నివేదిక రూపొందించారు.

Fifatrol as an immunity-boosting ayurvedic drug
కరోనాపై పోరులో ఆయుర్వేద మందుకు చోటు

కొవిడ్​-19 మహమ్మారి నియంత్రణకు ఆయుర్వేద ఔషధం ఫిఫట్రాల్​ పనికొస్తుందని.. జాతీయ పరిశోధన అభివృద్ధి మండలి (ఎన్​ఆర్​డీసీ) నిపుణులు పేర్కొన్నారు. స్వదేశీ సాంకేతికతలు, పరిశోధనల ఆధారంగా తయారు చేసిన మందుల జాబితాలో దీనికి చోటు దక్కింది.

ఫిఫట్రాల్​ రోగనిరోధక శక్తిని పెంచి వైరస్​, బ్యాక్టీరియాలను చంపేస్తుందని స్పష్టం చేశారు నిపుణులు. ఈ మందు వాడితే బాధితుడు త్వరగా మహమ్మారి నుంచి కోలుకునే అవకాశముందని స్పష్టం చేశారు.

" ఫిఫట్రాల్‌లో రోగనిరోధక శక్తిని పెంచే మూలికలు ఉన్నాయి. బ్యాక్టీరియాతో వచ్చే జ్వరం, దగ్గు, జలుబు, చర్మ వ్యాధులు, తలనొప్పికి సమర్థంగా పనిచేస్తుంది. శ్వాశనాళంలో వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌, ఫ్లూ నివారణకు ఈ ఔషధాన్ని ఇప్పటికే ఉపయోగిస్తున్నారు"

-- ఎన్​ఆర్​డీసీ నిపుణులు

ఫిఫట్రాల్‌ను ఏఐఎంఐఎల్‌ ఫార్మా సంస్థ తయారుచేస్తోంది. ఎలాంటి దుష్ఫ్రభావాలు లేకుండా ఈ మందు కాలేయాన్ని బలవర్ధకం చేస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. సుదర్శన్‌ వటి, సంజీవని వటి, గోదాంతి భస్మ, త్రిభువన కిర్తిరసం, మృత్యుంజయ రసం, తులసి, కుత్కి, చిరయత, మోఠా, గిలోయ్‌ వంటి మూలికలు ఇందులో ఉన్నాయి.

కొవిడ్​-19 మహమ్మారి నియంత్రణకు ఆయుర్వేద ఔషధం ఫిఫట్రాల్​ పనికొస్తుందని.. జాతీయ పరిశోధన అభివృద్ధి మండలి (ఎన్​ఆర్​డీసీ) నిపుణులు పేర్కొన్నారు. స్వదేశీ సాంకేతికతలు, పరిశోధనల ఆధారంగా తయారు చేసిన మందుల జాబితాలో దీనికి చోటు దక్కింది.

ఫిఫట్రాల్​ రోగనిరోధక శక్తిని పెంచి వైరస్​, బ్యాక్టీరియాలను చంపేస్తుందని స్పష్టం చేశారు నిపుణులు. ఈ మందు వాడితే బాధితుడు త్వరగా మహమ్మారి నుంచి కోలుకునే అవకాశముందని స్పష్టం చేశారు.

" ఫిఫట్రాల్‌లో రోగనిరోధక శక్తిని పెంచే మూలికలు ఉన్నాయి. బ్యాక్టీరియాతో వచ్చే జ్వరం, దగ్గు, జలుబు, చర్మ వ్యాధులు, తలనొప్పికి సమర్థంగా పనిచేస్తుంది. శ్వాశనాళంలో వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌, ఫ్లూ నివారణకు ఈ ఔషధాన్ని ఇప్పటికే ఉపయోగిస్తున్నారు"

-- ఎన్​ఆర్​డీసీ నిపుణులు

ఫిఫట్రాల్‌ను ఏఐఎంఐఎల్‌ ఫార్మా సంస్థ తయారుచేస్తోంది. ఎలాంటి దుష్ఫ్రభావాలు లేకుండా ఈ మందు కాలేయాన్ని బలవర్ధకం చేస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. సుదర్శన్‌ వటి, సంజీవని వటి, గోదాంతి భస్మ, త్రిభువన కిర్తిరసం, మృత్యుంజయ రసం, తులసి, కుత్కి, చిరయత, మోఠా, గిలోయ్‌ వంటి మూలికలు ఇందులో ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.