ETV Bharat / bharat

'మహా'లో కరోనా విలయం..10 లక్షలు దాటిన కేసులు

దేశంలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నప్పటికీ.. అదే స్థాయిలో రికవరీలు ఉండటం ఊరటనిస్తోంది. గురువారం 70,880 మంది కోలుకున్నారు. వీరితో మొత్తం రికవరీల సంఖ్య 35,42,663కు ఎగబాకింది. మహారాష్ట్ర​లో తాజాగా రికార్డు స్థాయిలో 24,886 మంది వైరస్ బారిన పడ్డారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది.

author img

By

Published : Sep 11, 2020, 7:30 PM IST

Updated : Sep 11, 2020, 11:07 PM IST

COVID-19 recoveries in India surge to 35,42,663
దేశంలో 35 లక్షలు దాటిన కరోనా రికవరీలు!

దేశవ్యాప్తంగా నమోదవుతున్న రోజువారీ రికవరీల్లో 60 శాతం మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్​, కర్ణాటక, ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రాలవేనని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే 57 శాతం కేసులు ఈ రాష్ట్రాల నుంచి బయటపడుతున్నట్లు తెలిపింది.

గురువారం 70,880 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 35,42,663కు చేరింది. రికవరీ రేటు 77.65 శాతంగా ఉంది.

రాష్ట్రాల వారీగా కేసులు...

  • మహారాష్ట్రను కరోనా వణికిస్తోంది. తాజాగా 24,886 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 10 లక్షలు దాటింది. రాష్ట్రవ్యాప్తంగా 10,15,681 కేసులు ఉన్నాయి. వీరిలో 7,15,023 మంది డిశ్చార్జ్ కాగా.. 2,71,566 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం 28,724 మంది వైరస్​ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
  • కర్ణాటకలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. తాజాగా 9,464 మందికి పాజిటివ్​గా తేలింది. మరో 130 మంది మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,34,999 మంది డిశ్చార్జ్ కాగా... 98,326 మంది చికిత్స పొందుతున్నారు.
  • తమిళనాట మరో 5,519 కేసులు వెలుగు చూడగా.. 77 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు 8,231 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 4,35,422 మంది డిశ్చార్జ్​ అయ్యారు.
  • ఉత్తర్​ప్రదేశ్​లో తాజాగా 4,282 కేసులు బయటపడ్డాయి. మరో 76 మంది మృతి చెందగా.. 7 వేల మంది కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం బాధితుల సంఖ్య మూడు లక్షలకు చేరువైంది.
  • దిల్లీలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 4,266 కేసులను గుర్తించారు. మరో 21 మంది వైరస్​కు బలయ్యారు. రాష్ట్రంలో మొత్తం 1,78,154 మంది కోలుకోగా.. 26,907 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. మరో 4,687 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఒడిశాలో రికార్డు స్థాయిలో 3,996 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. మరో 14 మంది మృతి చెందగా.. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 605కు ఎగబాకింది. మొత్తం 1,43,117 మంది బాధితులు ఉన్నారు.
  • బంగాల్​ మరో 3,157 మందికి పాజిటివ్​గా తేలగా... మొత్తం 1,96,332 కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు.
  • కేరళలో కొత్తగా 2,988 కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రంలో 27,877 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. మరో 73,904 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.
  • జమ్ముకశ్మీర్​లో మరో 1,578 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది.
  • త్రిపురలో మరో 559 మంది కరోనా బారినపడగా... మొత్తం బాధితుల సంఖ్య 17,833కు చేరింది. 172 మంది వైరస్​కు బలయ్యారు.
  • రైల్వే సహాయ మంత్రి సురేశ్‌ అంగాడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్​ ద్వారా తెలిపారు. ఇటీవల తనను కలిసిన వ్యక్తులు పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

దేశవ్యాప్తంగా నమోదవుతున్న రోజువారీ రికవరీల్లో 60 శాతం మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్​, కర్ణాటక, ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రాలవేనని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే 57 శాతం కేసులు ఈ రాష్ట్రాల నుంచి బయటపడుతున్నట్లు తెలిపింది.

గురువారం 70,880 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 35,42,663కు చేరింది. రికవరీ రేటు 77.65 శాతంగా ఉంది.

రాష్ట్రాల వారీగా కేసులు...

  • మహారాష్ట్రను కరోనా వణికిస్తోంది. తాజాగా 24,886 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 10 లక్షలు దాటింది. రాష్ట్రవ్యాప్తంగా 10,15,681 కేసులు ఉన్నాయి. వీరిలో 7,15,023 మంది డిశ్చార్జ్ కాగా.. 2,71,566 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం 28,724 మంది వైరస్​ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
  • కర్ణాటకలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. తాజాగా 9,464 మందికి పాజిటివ్​గా తేలింది. మరో 130 మంది మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,34,999 మంది డిశ్చార్జ్ కాగా... 98,326 మంది చికిత్స పొందుతున్నారు.
  • తమిళనాట మరో 5,519 కేసులు వెలుగు చూడగా.. 77 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు 8,231 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 4,35,422 మంది డిశ్చార్జ్​ అయ్యారు.
  • ఉత్తర్​ప్రదేశ్​లో తాజాగా 4,282 కేసులు బయటపడ్డాయి. మరో 76 మంది మృతి చెందగా.. 7 వేల మంది కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం బాధితుల సంఖ్య మూడు లక్షలకు చేరువైంది.
  • దిల్లీలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 4,266 కేసులను గుర్తించారు. మరో 21 మంది వైరస్​కు బలయ్యారు. రాష్ట్రంలో మొత్తం 1,78,154 మంది కోలుకోగా.. 26,907 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. మరో 4,687 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఒడిశాలో రికార్డు స్థాయిలో 3,996 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. మరో 14 మంది మృతి చెందగా.. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 605కు ఎగబాకింది. మొత్తం 1,43,117 మంది బాధితులు ఉన్నారు.
  • బంగాల్​ మరో 3,157 మందికి పాజిటివ్​గా తేలగా... మొత్తం 1,96,332 కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు.
  • కేరళలో కొత్తగా 2,988 కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రంలో 27,877 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. మరో 73,904 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.
  • జమ్ముకశ్మీర్​లో మరో 1,578 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది.
  • త్రిపురలో మరో 559 మంది కరోనా బారినపడగా... మొత్తం బాధితుల సంఖ్య 17,833కు చేరింది. 172 మంది వైరస్​కు బలయ్యారు.
  • రైల్వే సహాయ మంత్రి సురేశ్‌ అంగాడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్​ ద్వారా తెలిపారు. ఇటీవల తనను కలిసిన వ్యక్తులు పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
Last Updated : Sep 11, 2020, 11:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.