చైనాతో సరిహద్దు వివాదంపై అధికార భాజపా, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చైనాతో రాజీ పడకూడదని, అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ ప్రకటనతో తలెత్తే సమస్యలను దృష్టిలో ఉంచుకోవాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సునిశిత విమర్శలు చేయగా... కమలదళం తీవ్రంగా స్పందించింది.
మన్మోహన్ తీవ్ర స్వరం..
తూర్పు లద్దాఖ్లో చైనాతో వివాదానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు మన్మోహన్ సింగ్. చైనా తాను తప్పు చేయలేదని చాటుకోవడానికి అవకాశం ఇవ్వరాదని హితవు పలికారు.
"చైనాతో ఏర్పడ్డ సమస్య మరింత ముదరకుండా ప్రభుత్వంలోని అన్ని విభాగాలు పని చేయాలి. వివాదంపై సమాచారం బయటపెట్టాలి. సమాచారాన్ని దాచి ఉంచడం దౌత్య నీతికి, సమర్థ నాయకత్వానికి ప్రత్యామ్నాయం కాదు. ఈ విషయంలో వెనక్కు తగ్గితే ప్రజల విశ్వాసాలకు చారిత్రక ద్రోహం చేసినవారవుతారు. ఈ కీలక సమయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతోనే భవిష్యత్తు తరాలు మనల్ని గుర్తిస్తాయి. చైనా ఆక్రమణకు సంబంధించి ప్రకటనపై పర్యవసనాలను దృష్టిలో పెట్టుకోవాలి. దీన్ని చైనా అవకాశంగా మలుచుకుంటుంది."
- మన్మోహన్ సింగ్, మాజీ ప్రధాని
నడ్డా కౌంటర్..
మన్మోహన్ విమర్శలపై భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ చేస్తోన్న విమర్శలు, మన్మోహన్ చెబుతున్నదానికి పొంతన లేదని, ఇలాంటి వారిని నమ్మకూడదని అన్నారు. సైనికులను అగౌరవపరిచే వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికారు.
"చైనాకు 43వేల కిలోమీటర్ల భారత భూభాగాన్ని అప్పగించిన పార్టీకి చెందినవారు మన్మోహన్. సరిహద్దులో ఎన్ని పరిణామాలు జరిగినా.. కనీసం ప్రతిఘటించకుండానే యూపీఏ ప్రభుత్వం చాలా సార్లు లొంగిపోయింది. ప్రధాని మోదీని భారతీయులు పూర్తిగా విశ్వసిస్తున్నారు. ఇప్పటివరకు మోదీ తీసుకున్న నిర్ణయాలతో దేశ రక్షణకు ఆయన ఇచ్చే ప్రాధాన్యాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు."
- జేపీ నడ్డా, భాజపా అధ్యక్షుడు
కాంగ్రెస్ ప్రతిదాడి..
మన్మోహన్పై నడ్డా విమర్శలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా స్పందించారు. జాతీయ భద్రతపై రాజీ పడటం మానుకోవాలని భాజపాను డిమాండ్ చేశారు.
-
Dear Sh. Nadda & the BJP,
— Randeep Singh Surjewala (@rssurjewala) June 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Stop compromising on ‘National Security’ & India’s ‘Territorial Integrity’.
This would be the biggest disservice to our Armed Forces & our 20 martyrs.
Don’t buckle down, have the strength to ‘rise to the occasion’. We’ll give the Govt every support. https://t.co/IgU1ZDOXJ7
">Dear Sh. Nadda & the BJP,
— Randeep Singh Surjewala (@rssurjewala) June 22, 2020
Stop compromising on ‘National Security’ & India’s ‘Territorial Integrity’.
This would be the biggest disservice to our Armed Forces & our 20 martyrs.
Don’t buckle down, have the strength to ‘rise to the occasion’. We’ll give the Govt every support. https://t.co/IgU1ZDOXJ7Dear Sh. Nadda & the BJP,
— Randeep Singh Surjewala (@rssurjewala) June 22, 2020
Stop compromising on ‘National Security’ & India’s ‘Territorial Integrity’.
This would be the biggest disservice to our Armed Forces & our 20 martyrs.
Don’t buckle down, have the strength to ‘rise to the occasion’. We’ll give the Govt every support. https://t.co/IgU1ZDOXJ7
"జేపీ నడ్డా, భాజపా.. జాతీయ భద్రత, భారత ప్రాదేశిక సమగ్రతపై రాజీ పడటం మానుకోవాలి. ఇది మన సాయుధ బలగాలు, 20 మంది సైనికుల ప్రాణ త్యాగాలకు తీరని అన్యాయం చేసినట్లే. వెనక్కు తగ్గకండి. ఈ సందర్భంలో మరింత బలంగా ముందుకెళ్లండి. ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా మా మద్దతు ఉంటుంది.