దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్ప్రదేశ్ హాథ్రస్ హత్యాచార ఘటనను నిరసిస్తూ ఆందోళన చేపట్టింది తృణమూల్ కాంగ్రెస్. కోల్కతాలోని బిర్లా ప్లానిటేరియం నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ తలపెట్టింది.
ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు బంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. యూపీ ముఖ్యమంత్రి యోగిపై ఆమె విమర్శలు గుప్పించారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
దేశంలో నియంతృత్వ పాలన సాగుతోందని దీదీ ఆరోపించారు. మోదీ హయాంలో దళితులపై దాడులు పెరిగాయని మండిపడ్డారు. కొవిడ్ కంటే భాజపానే అతి పెద్ద మహమ్మారి అని విమర్శించిన మమత.. దళితులు, వెనుకబడిన వర్గాల తరఫున నిలబడతామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: హాథ్రస్ ఘటనకు వ్యతిరేకంగా దీదీ నిరసన