ETV Bharat / bharat

రాజ్​పథ్​ పనుల కాంట్రాక్ట్​ షాపూర్​జీ పల్లోంజీకే! - రాజ్​పథ్​​ పునర్నిర్మాణ పనుల కాంట్రాక్ట్

సెంట్రల్​ విస్టా ప్రాజెక్టులో భాగమైన రాజ్​పథ్​​ పునర్నిర్మాణ పనుల కాంట్రాక్ట్​.. షాపూర్​జీ పల్లోంజీకి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫైనాన్షియల్​ బిడ్స్​లో అత్యంత తక్కువ మొత్తానికి ఈ కంపెనీ కోట్​ చేసినట్లు తెలుస్తోంది. ఈ పనులను వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Central Vista
రాజ్​పథ్​ పనుల కాంట్రాక్ట్​ షాపూర్​జీ పల్లోంజీకే!
author img

By

Published : Jan 7, 2021, 5:14 AM IST

నూతన పార్లమెంట్​ భవన సముదాయ నిర్మాణానికి సంబంధించిన సెంట్రల్​ విస్టా ప్రాజెక్టులో భాగమైన రాజ్​పథ్​ పునర్నిర్మాణ పనుల కాంట్రాక్ట్​.. షాపూర్​జీ పల్లోంజీకి దక్కే అవకాశం ఉంది. ఈ పనుల కోసం పిలిచిన ఫైనాన్షియల్​ బిడ్స్​లో అత్యంత తక్కువ మొత్తాన్ని (రూ.477.08 కోట్లు)ఆ కంపెనీ కోట్​ చేసి ప్రథమ స్థానంలో నిలిచింది.

రాజ్​పథ్​ పునర్నిర్మాణ పనులకు కేంద్ర ప్రజా పనుల విభాగం (సీపీడబ్ల్యూడీ) ప్రతిపాదించిన అంచనా వ్యయం కన్నా ఇది 4.99 శాతం తక్కువ. అర్హత సాధించిన ఇతర కంపెనీలు.. వరుస క్రమంలో టాటా ప్రాజెక్ట్స్​ ( రూ.488.78 కోట్లు), ఐటీడీ సిమెంటేషన్​ ఇండియా లిమిటెడ్​ (రూ.490.59 కోట్లు), ఎన్​సీసీ లిమిటెడ్​ ( రూ.601.46 కోట్లు) నిలిచాయి.

పార్లమెంటు భవన నిర్మాణం కోసం గత ఏడాది సెప్టెంబర్​లో పిలిచిన టెండర్​ను టాటా ప్రాజెక్ట్స్​ గెలుచుకున్న విషయం తెలిసిందే. రాజ్​పథ్​ పునర్నిర్మాణ పనులను ఈ నెల 26న గణతంత్ర దినోత్సవాలు ముగిసిన మరుసటి రోజు నుంచే ప్రారంభించి వచ్చే ఏడాది రిపబ్లిక్​ డే నాటికి పూర్తి చేస్తారని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: యూఎస్​ క్యాపిటల్​ వద్ద ఉద్రిక్తత.. ట్రంప్​ శాంతి మంత్రం

నూతన పార్లమెంట్​ భవన సముదాయ నిర్మాణానికి సంబంధించిన సెంట్రల్​ విస్టా ప్రాజెక్టులో భాగమైన రాజ్​పథ్​ పునర్నిర్మాణ పనుల కాంట్రాక్ట్​.. షాపూర్​జీ పల్లోంజీకి దక్కే అవకాశం ఉంది. ఈ పనుల కోసం పిలిచిన ఫైనాన్షియల్​ బిడ్స్​లో అత్యంత తక్కువ మొత్తాన్ని (రూ.477.08 కోట్లు)ఆ కంపెనీ కోట్​ చేసి ప్రథమ స్థానంలో నిలిచింది.

రాజ్​పథ్​ పునర్నిర్మాణ పనులకు కేంద్ర ప్రజా పనుల విభాగం (సీపీడబ్ల్యూడీ) ప్రతిపాదించిన అంచనా వ్యయం కన్నా ఇది 4.99 శాతం తక్కువ. అర్హత సాధించిన ఇతర కంపెనీలు.. వరుస క్రమంలో టాటా ప్రాజెక్ట్స్​ ( రూ.488.78 కోట్లు), ఐటీడీ సిమెంటేషన్​ ఇండియా లిమిటెడ్​ (రూ.490.59 కోట్లు), ఎన్​సీసీ లిమిటెడ్​ ( రూ.601.46 కోట్లు) నిలిచాయి.

పార్లమెంటు భవన నిర్మాణం కోసం గత ఏడాది సెప్టెంబర్​లో పిలిచిన టెండర్​ను టాటా ప్రాజెక్ట్స్​ గెలుచుకున్న విషయం తెలిసిందే. రాజ్​పథ్​ పునర్నిర్మాణ పనులను ఈ నెల 26న గణతంత్ర దినోత్సవాలు ముగిసిన మరుసటి రోజు నుంచే ప్రారంభించి వచ్చే ఏడాది రిపబ్లిక్​ డే నాటికి పూర్తి చేస్తారని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: యూఎస్​ క్యాపిటల్​ వద్ద ఉద్రిక్తత.. ట్రంప్​ శాంతి మంత్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.