పెన్సిళ్లు, చాక్పీసులతో అద్భుత కళాఖండాలు రూపొందించి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించాడు కేరళ తిరూరంగడికి చెందిన మహ్మద్ ఆసిఫ్. దేవదార్ పాఠశాలలో ప్లస్టూ కంప్యూటర్ సైన్స్ విద్యార్థిగా ఉన్న ఆసిఫ్.. 16 మీటర్ల పొడవైన పెన్సిల్పై 50 మలయాళం అక్షరాలను తీర్చిదిద్దాడు. ఈ కళాసృష్టికి గుర్తింపుగానే అతడికి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది.
అలా మొదలైంది...
స్నేహితుడి పుట్టిన రోజు కానుక ఇవ్వడం కోసం సరదాగా ప్రారంభించిన ఈ పెన్సిల్ ఆర్ట్.. క్రమంగా ఆసిఫ్లో కళానైపుణ్యం వెలికితీయడానికి దోహదపడింది. చాక్పీస్లతో ప్రముఖ జాతీయ నాయకుల బొమ్మలు, ప్రసిద్ధ కట్టడాల నమూనాలు తీర్చిదిద్దడం మొదలుపెట్టాడు.
"స్నేహితుడి పుట్టినరోజుకు ఏదొక ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలనుకున్నాను. ఇన్స్టాగ్రామ్లో పెన్సిల్ కార్వింగ్ చూశాను. అది చూసి చిన్న బొమ్మలా తయారు చేద్దామనుకున్నాను. అక్కడ నుంచి మైక్రో ఆర్ట్ అలవాటైంది. ఆ తర్వాత ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది. 50 మలయాళం అక్షరాలను 16 సె.మీ పెన్సిల్పై చెక్కాను. అది ఓ రికార్డ్ అయింది." - మహ్మద్ ఆసిఫ్, కళాకారుడు
ఎనలేని గుర్తింపు...
ఆసిఫ్ రూపొందించిన బొమ్మలు, చిత్రాలను స్కూల్ ఆర్ట్ ఎక్స్పోలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తానూర్ ఎమ్మెల్యే అబ్దుల్ రహ్మాన్.. ఆసిఫ్ కళానైపుణ్యానికి అచ్చెరువొందారు. అలా తక్కువ కాలంలోనే ఆసిఫ్కు ఎనలేని గుర్తింపు లభించింది. ప్రస్తుతం తన కళను కేరళ విద్యాశాఖమంత్రి రవీంద్రనాథ్ ముందు ప్రదర్శించడానికి ఆసిఫ్ సిద్ధమవుతున్నాడు.
ఇదీ చూడండి: మళ్లీ బ్రిటన్ ప్రధానిగా బోరిస్- కన్జర్వేటివ్ పార్టీ జయభేరి