ETV Bharat / bharat

శిరిడీలో కొనసాగుతున్న బంద్... తెరిచే ఉన్న ఆలయం

author img

By

Published : Jan 19, 2020, 9:24 AM IST

Updated : Jan 19, 2020, 9:32 AM IST

మహారాష్ట్ర శిరిడీ పట్టణంలో బంద్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయిబాబా ఆలయం తెరిచే ఉన్నందున భక్తులు దర్శనం కొనసాగిస్తున్నారు. పాథ్రీని బాబా జన్మస్థలంగా పేర్కొనడాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ బంద్​కు పిలుపునిచ్చారు శిరిడీ వాసులు. వివాదాన్ని పరిష్కరించే దిశగా చర్చలు జరపనున్నట్లు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రే స్పష్టం చేశారు.

bund in shirdi town
షిరిడీలో కొనసాగుతున్న బంద్... తెరిచే ఉన్న ఆలయం

పాథ్రీని సాయి జన్మభూమిగా పేర్కొనడాన్ని వ్యతిరేకిస్తూ శిరిడీ వాసులు చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బంద్​కు స్థానిక ఎమ్మెల్యే రాధాకృష్ణ విఖే పాటిల్​ మద్దతిచ్చారు. అయితే సాయిబాబా ఆలయం తెరిచే ఉంది. దర్శనం కోసం భక్తలు తరలివస్తూనే ఉన్నారు.

ఇదీ వివాదం...

మహారాష్ట్ర పర్భాణీ జిల్లా పాథ్రీలోని సాయి జన్మస్థానంలో వసతుల కల్పనకు రూ. 100 కోట్లు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే ఇటీవల ప్రకటించగా వివాదం చెలరేగింది. ఈ నిర్ణయంపై శిరిడీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాథ్రీ సాయి జన్మస్థలమని చెప్పేందుకు ఆధారాల్లేవని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో సాయి జన్మభూమి వివాదం సద్దుమణిగే దిశగా ప్రయత్నాలు చేయనున్నట్లు తెలిపారు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రే. సంబంధిత పార్టీలతో రాష్ట్ర సచివాలయంలో సీఎం త్వరలోనే సమావేశం కానున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది ముఖ్యమంత్రి కార్యాలయం.

శిరిడీలో కొనసాగుతున్న బంద్... తెరిచే ఉన్న ఆలయం

పాథ్రీని సాయి జన్మభూమిగా పేర్కొనడాన్ని వ్యతిరేకిస్తూ శిరిడీ వాసులు చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బంద్​కు స్థానిక ఎమ్మెల్యే రాధాకృష్ణ విఖే పాటిల్​ మద్దతిచ్చారు. అయితే సాయిబాబా ఆలయం తెరిచే ఉంది. దర్శనం కోసం భక్తలు తరలివస్తూనే ఉన్నారు.

ఇదీ వివాదం...

మహారాష్ట్ర పర్భాణీ జిల్లా పాథ్రీలోని సాయి జన్మస్థానంలో వసతుల కల్పనకు రూ. 100 కోట్లు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే ఇటీవల ప్రకటించగా వివాదం చెలరేగింది. ఈ నిర్ణయంపై శిరిడీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాథ్రీ సాయి జన్మస్థలమని చెప్పేందుకు ఆధారాల్లేవని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో సాయి జన్మభూమి వివాదం సద్దుమణిగే దిశగా ప్రయత్నాలు చేయనున్నట్లు తెలిపారు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రే. సంబంధిత పార్టీలతో రాష్ట్ర సచివాలయంలో సీఎం త్వరలోనే సమావేశం కానున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది ముఖ్యమంత్రి కార్యాలయం.

శిరిడీలో కొనసాగుతున్న బంద్... తెరిచే ఉన్న ఆలయం
Intro:Body:Conclusion:
Last Updated : Jan 19, 2020, 9:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.