ETV Bharat / bharat

ఒబామా పర్యటనలో బాంబు పేలుళ్లకు కుట్ర - ఉగ్రదాడికి పన్నాగం పన్నిన ముష్కరులు

అమెరికా అధ్యక్షుడి హోదాలో బరాక్‌ ఒబామా 2015 జనవరి 26న భారత్‌లో పర్యటించినప్పుడు పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరిపేందుకు ఉగ్రవాదులు కుట్రపన్నారు. ఈ కుట్ర విషయం ఆదివారం తెలిసింది.

'ఒబామా పర్యటనలో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నాం'
author img

By

Published : Sep 30, 2019, 6:31 AM IST

Updated : Oct 2, 2019, 1:14 PM IST

2015 భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా హాజరైన సమయంలో ఉగ్రవాదులు పలు ప్రధాన ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు కుట్రపన్నినట్లు ఆలస్యంగా తెలిసింది.

ముంబయి జైల్లో ఉన్న ఉగ్రవాది జైనలుద్దీన్‌ను ఇటీవల విచారించినపుడు ఈ కుట్ర విషయం బహిర్గతం చేశాడని బెంగళూరు సీసీబీ పోలీసు అధికారులు ఆదివారం తెలిపారు. ఒబామా రాక ముందే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు ఇండియన్‌ ముజాహిద్దీన్‌ సంస్థ (ఐఎం) ఉగ్రవాదిని అదుపులోకి తీసుకొని విచారించినపుడు జైనలుద్దీన్‌ వ్యవహారం తెలిసింది.

2014లో బెంగళూరు చర్చి స్ట్రీట్‌లో జరిగిన బాంబు పేలుడు ఘటనతో జైనలుద్దీన్‌కు సంబంధం ఉన్నట్లు గుర్తించారు. తీవ్రవాది రియాజ్‌ భత్కళ్‌, సానుభూతిపరుడిగా మారిన వైద్యుడు సయ్యద్‌ ఇస్మాయిల్‌ అఫాక్‌తో నిందితుడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. భారత్‌లో పేలుడు పదార్థాలను తరలించేందుకు అఫాక్‌ సహకరించేవాడని జైనలుద్దీన్‌ విచారణలో పేర్కొన్నాడని సీసీబీ పోలీసులు తెలిపారు.

రియాజ్‌ భత్కళ్‌, అఫాక్‌లను వివిధ ప్రాంతాల్లో పోలీసులు అరెస్టు చేసి వేర్వేరు కారాగారాల్లో ఉంచారు.

2015 భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా హాజరైన సమయంలో ఉగ్రవాదులు పలు ప్రధాన ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు కుట్రపన్నినట్లు ఆలస్యంగా తెలిసింది.

ముంబయి జైల్లో ఉన్న ఉగ్రవాది జైనలుద్దీన్‌ను ఇటీవల విచారించినపుడు ఈ కుట్ర విషయం బహిర్గతం చేశాడని బెంగళూరు సీసీబీ పోలీసు అధికారులు ఆదివారం తెలిపారు. ఒబామా రాక ముందే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు ఇండియన్‌ ముజాహిద్దీన్‌ సంస్థ (ఐఎం) ఉగ్రవాదిని అదుపులోకి తీసుకొని విచారించినపుడు జైనలుద్దీన్‌ వ్యవహారం తెలిసింది.

2014లో బెంగళూరు చర్చి స్ట్రీట్‌లో జరిగిన బాంబు పేలుడు ఘటనతో జైనలుద్దీన్‌కు సంబంధం ఉన్నట్లు గుర్తించారు. తీవ్రవాది రియాజ్‌ భత్కళ్‌, సానుభూతిపరుడిగా మారిన వైద్యుడు సయ్యద్‌ ఇస్మాయిల్‌ అఫాక్‌తో నిందితుడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. భారత్‌లో పేలుడు పదార్థాలను తరలించేందుకు అఫాక్‌ సహకరించేవాడని జైనలుద్దీన్‌ విచారణలో పేర్కొన్నాడని సీసీబీ పోలీసులు తెలిపారు.

రియాజ్‌ భత్కళ్‌, అఫాక్‌లను వివిధ ప్రాంతాల్లో పోలీసులు అరెస్టు చేసి వేర్వేరు కారాగారాల్లో ఉంచారు.

Mysuru (Karnataka), Sep 29 (ANI): Mysore Palace has been decked ahead of festive season. Private Durbar was held at Amba Vilas or Khas Durbar Hall on September 29. Durbar is held at this hall every year during Navaratri. Crystal chandelier illuminated the golden throne where King Yaduveer Krishnadatta Chamaraja Wadiyar was seated. The diamond studded golden throne was assembled this morning ahead of private Durbar.
Last Updated : Oct 2, 2019, 1:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.