ETV Bharat / bharat

బిహార్​ పోరు: 'హస్తం' రేఖలు ఈసారైనా మారేనా?

author img

By

Published : Sep 6, 2020, 5:50 PM IST

Updated : Sep 6, 2020, 7:12 PM IST

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీలన్నీ వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. మహాఘట్ ‌బంధన్‌లో కీలకంగా ఉన్న కాంగ్రెస్​ పార్టీ తన పూర్వవైభవం కోసం పరితపిస్తుంది. మరోవైపు అధికార జేడీయూ కూటమి మరో ఐదేళ్లు పరిపాలించాలనే పట్టుదలతో ఉంది. అయితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ పార్టీ బలం తగ్గుతున్న నేపథ్యంలో రాజకీయ నిపుణులు కాంగ్రెస్​ పుంజుకునేందుకు పలు సూచనలు చేశారు.

Bihar polls: Will Congress be left behind, or revive?
బిహార్​ ఎన్నికల్లో ఈసారైనా కాంగ్రెస్​ కోలుకుంటుందా..?

ఒకప్పుడు దేశాన్ని ఏలిన కాంగ్రెస్​ పార్టీ ప్రస్తుతం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది! మోదీ జోరుకు హస్తం పార్టీ తన హవాను కోల్పోతోంది. 2014 నుంచి ఎన్నికలేవైనా కాంగ్రెస్​ పార్టీ పరిస్థితి దాదాపు ఇంతే. అయితే రాబోయే బిహార్​ ఎన్నికలతో కాంగ్రెస్ తన పూర్వవైభవాన్ని సంపాదించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. హస్తం పార్టీ నేతృత్వంలోని 'మహాఘట్​ బంధన్' బిహార్​లో విజయకేతనం ఎగురవేయాలని చూస్తుంటే.. అధికార పార్టీ అయిన జేడీయూ కూటమి మాత్రం ప్రత్యర్థులను ఓడించాలనే పట్టుదలతో ఉంది.

ఘన చరిత్ర...

Bihar polls: Will Congress be left behind, or revive?
బిహార్​ పోరు: 'హస్తం' రేఖలు ఈసారైనా మారేనా?

ఒకప్పుడు బిహార్​లో 196 సీట్లు గెలిచిన కాంగ్రెస్​ గత ఎన్నికల్లో 27 సీట్లకే పరిమితమైంది. గతంలో రాష్ట్రానికి 20 మంది ముఖ్యమంత్రులను ఇచ్చిన పార్టీ ప్రస్తుతం అవస్థలు పడుతోంది. కాంగ్రెస్​ పుంజుకోవాలని ఎంత ప్రయత్నిస్తున్నా.. ఫలితాలు మాత్రం ఆ స్థాయిలో రావట్లేదు. కాంగ్రెస్ ఈ సారి ఎక్కువ సీట్లు గెలవాలంటే 2015లో పోటీ చేసిన స్థానాల కంటే ఎక్కువ స్థానాల్లో పోటీచేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కాంగ్రెస్​ ఎందుకు పొత్తులను నమ్ముకుంటోంది..? ఇలా అయితే కాంగ్రెస్ పుంజుకుంటుందని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎలా నమ్ముతున్నారు..? వంటి అంశాలపై బిహార్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మదన్​ మోహన్​ ఝా మాట్లాడారు.

"క్షేత్ర స్థాయిలో పనులు సీనియర్​ నేతలకు అప్పగించనున్నాం. ఖాళీగా ఉన్న స్థానాలను కొత్త వారితో భర్తీ చేస్తాం. పనితీరు, ప్రదర్శనను అంచనా వేసి.. ఆ నివేదికను అధిష్ఠానానికి పంపుతాం. వాటి ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపులను పరిశీలిస్తాం. 2015లో కంటే కచ్చితంగా ఎక్కువ సీట్లలో పోటీచేసి విజయం సాధిస్తాం".

- మదన్​ మోహన్​ ఝా, బిహార్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు

బిహార్​లో కాంగ్రెస్​ పని అయిపోయిందని.. పార్టీ పూర్తిగా పట్టు కోల్పోయిందని అభిప్రాయపడ్డారు జేడీయూ అధికార ప్రతినిధి రాజీవ్​ రంజన్​. నితీశ్​​ అధ్యక్షతన కూటమి అద్భుతంగా పనిచేస్తున్నప్పడు.. ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమికి ప్రజలు ఎలా మద్దతిస్తారని ఆయన ప్రశ్నించారు.

ప్రస్తుత పరిస్థితిపై అధికార, ప్రతిపక్ష పార్టీలతో మాట్లాడిన తర్వాత మరో ఇద్దరు నిపుణులతో చర్చించింది ఈటీవీ భారత్​. ఏఎన్​ సిన్హా రీసెర్ఛ్​ ఇన్​స్టిట్యూట్​కు చెందిన ప్రొఫెసర్​ డీఎమ్​ దివాకర్​​ ఈ అంశంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

"ప్రాంతీయ పార్టీలు అప్పుడప్పుడే బలపడుతున్న సమయంలో కాంగ్రెస్ దేశంలోనే అతిపెద్ద పార్టీ. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్.. ప్రాంతీయ పార్టీలతో కలిసింది. కానీ ఇది కాంగ్రెస్‌కు అనుకూల ఫలితాలు ఇవ్వలేదు. దీనికి బిహార్ ఒక ఉదాహరణ. మళ్లీ బిహార్​లో కాంగ్రెస్​ పూర్వవైభవం పొందాలంటే.. ఆ పార్టీ అన్ని సీట్లలో పోటీ చేయాల్సి ఉంది. అప్పుడే రాష్ట్రంలో వారి కార్యకర్తలు, మద్దతుదారుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. కాంగ్రెస్‌లోని సీనియర్ నాయకులకు కాకుండా యువతరానికి అధికారం అప్పగిస్తే మంచిది."

-డీఎమ్​ దివాకర్​ ,ఏఎన్​ సిన్హా రీసెర్ఛ్​ ఇన్​స్టిట్యూట్​ ప్రొఫెసర్​

సీనియర్​ జర్నలిస్ట్​ సురేంద్ర కిశోర్​ కూడా ఈ అంశంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

"భగల్​పుర్​ గొడవల వల్ల కాంగ్రెస్​ ముస్లింల మద్దతు కోల్పోయింది. మండల కమిషన్​లో కాంగ్రెస్​ సరైన విధివిధానాలు పాటించకపోవడం వల్ల చాలా మంది వెనుకబడిన వర్గాలు దూరమయ్యాయి. లాలూ-రబ్డీ ప్రభుత్వానికి దన్నుగా ఉండటం వల్ల అగ్రవర్ణాల ఓట్​బ్యాంక్​ కూడా కాంగ్రెస్​కు మద్దతివ్వలేదు. అలా గత 30 ఏళ్లలో కాంగ్రెస్​ క్షేత్రస్థాయి నుంచే బలహీనపడుతూ వచ్చింది"

--సురేంద్ర కిశోర్, సీనియర్​ జర్నలిస్ట్​

కాంగ్రెస్​ జోరు తగ్గాక.. సంప్రదాయ హస్తం ఓటర్లు భాజపాతో వెళ్లగా, మరొక విభాగం ఆర్జేడీలో కలిసిపోయింది. బలహీనపడిన కాంగ్రెస్..​ ఆర్జేడీ, రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్‌పీ), వికాషీల్‌ ఇన్సాన్‌ పార్టీ (వీఐపీ)లతో కలిసి కూటమి ఏర్పాటు చేసింది. నవంబర్‌ 29తో బిహార్‌ శాసనసభ గడువు ముగియనుంది. అక్టోబర్‌ చివర్లో గానీ నవంబర్‌లో గానీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది.

ఒకప్పుడు దేశాన్ని ఏలిన కాంగ్రెస్​ పార్టీ ప్రస్తుతం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది! మోదీ జోరుకు హస్తం పార్టీ తన హవాను కోల్పోతోంది. 2014 నుంచి ఎన్నికలేవైనా కాంగ్రెస్​ పార్టీ పరిస్థితి దాదాపు ఇంతే. అయితే రాబోయే బిహార్​ ఎన్నికలతో కాంగ్రెస్ తన పూర్వవైభవాన్ని సంపాదించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. హస్తం పార్టీ నేతృత్వంలోని 'మహాఘట్​ బంధన్' బిహార్​లో విజయకేతనం ఎగురవేయాలని చూస్తుంటే.. అధికార పార్టీ అయిన జేడీయూ కూటమి మాత్రం ప్రత్యర్థులను ఓడించాలనే పట్టుదలతో ఉంది.

ఘన చరిత్ర...

Bihar polls: Will Congress be left behind, or revive?
బిహార్​ పోరు: 'హస్తం' రేఖలు ఈసారైనా మారేనా?

ఒకప్పుడు బిహార్​లో 196 సీట్లు గెలిచిన కాంగ్రెస్​ గత ఎన్నికల్లో 27 సీట్లకే పరిమితమైంది. గతంలో రాష్ట్రానికి 20 మంది ముఖ్యమంత్రులను ఇచ్చిన పార్టీ ప్రస్తుతం అవస్థలు పడుతోంది. కాంగ్రెస్​ పుంజుకోవాలని ఎంత ప్రయత్నిస్తున్నా.. ఫలితాలు మాత్రం ఆ స్థాయిలో రావట్లేదు. కాంగ్రెస్ ఈ సారి ఎక్కువ సీట్లు గెలవాలంటే 2015లో పోటీ చేసిన స్థానాల కంటే ఎక్కువ స్థానాల్లో పోటీచేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కాంగ్రెస్​ ఎందుకు పొత్తులను నమ్ముకుంటోంది..? ఇలా అయితే కాంగ్రెస్ పుంజుకుంటుందని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎలా నమ్ముతున్నారు..? వంటి అంశాలపై బిహార్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మదన్​ మోహన్​ ఝా మాట్లాడారు.

"క్షేత్ర స్థాయిలో పనులు సీనియర్​ నేతలకు అప్పగించనున్నాం. ఖాళీగా ఉన్న స్థానాలను కొత్త వారితో భర్తీ చేస్తాం. పనితీరు, ప్రదర్శనను అంచనా వేసి.. ఆ నివేదికను అధిష్ఠానానికి పంపుతాం. వాటి ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపులను పరిశీలిస్తాం. 2015లో కంటే కచ్చితంగా ఎక్కువ సీట్లలో పోటీచేసి విజయం సాధిస్తాం".

- మదన్​ మోహన్​ ఝా, బిహార్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు

బిహార్​లో కాంగ్రెస్​ పని అయిపోయిందని.. పార్టీ పూర్తిగా పట్టు కోల్పోయిందని అభిప్రాయపడ్డారు జేడీయూ అధికార ప్రతినిధి రాజీవ్​ రంజన్​. నితీశ్​​ అధ్యక్షతన కూటమి అద్భుతంగా పనిచేస్తున్నప్పడు.. ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమికి ప్రజలు ఎలా మద్దతిస్తారని ఆయన ప్రశ్నించారు.

ప్రస్తుత పరిస్థితిపై అధికార, ప్రతిపక్ష పార్టీలతో మాట్లాడిన తర్వాత మరో ఇద్దరు నిపుణులతో చర్చించింది ఈటీవీ భారత్​. ఏఎన్​ సిన్హా రీసెర్ఛ్​ ఇన్​స్టిట్యూట్​కు చెందిన ప్రొఫెసర్​ డీఎమ్​ దివాకర్​​ ఈ అంశంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

"ప్రాంతీయ పార్టీలు అప్పుడప్పుడే బలపడుతున్న సమయంలో కాంగ్రెస్ దేశంలోనే అతిపెద్ద పార్టీ. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్.. ప్రాంతీయ పార్టీలతో కలిసింది. కానీ ఇది కాంగ్రెస్‌కు అనుకూల ఫలితాలు ఇవ్వలేదు. దీనికి బిహార్ ఒక ఉదాహరణ. మళ్లీ బిహార్​లో కాంగ్రెస్​ పూర్వవైభవం పొందాలంటే.. ఆ పార్టీ అన్ని సీట్లలో పోటీ చేయాల్సి ఉంది. అప్పుడే రాష్ట్రంలో వారి కార్యకర్తలు, మద్దతుదారుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. కాంగ్రెస్‌లోని సీనియర్ నాయకులకు కాకుండా యువతరానికి అధికారం అప్పగిస్తే మంచిది."

-డీఎమ్​ దివాకర్​ ,ఏఎన్​ సిన్హా రీసెర్ఛ్​ ఇన్​స్టిట్యూట్​ ప్రొఫెసర్​

సీనియర్​ జర్నలిస్ట్​ సురేంద్ర కిశోర్​ కూడా ఈ అంశంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

"భగల్​పుర్​ గొడవల వల్ల కాంగ్రెస్​ ముస్లింల మద్దతు కోల్పోయింది. మండల కమిషన్​లో కాంగ్రెస్​ సరైన విధివిధానాలు పాటించకపోవడం వల్ల చాలా మంది వెనుకబడిన వర్గాలు దూరమయ్యాయి. లాలూ-రబ్డీ ప్రభుత్వానికి దన్నుగా ఉండటం వల్ల అగ్రవర్ణాల ఓట్​బ్యాంక్​ కూడా కాంగ్రెస్​కు మద్దతివ్వలేదు. అలా గత 30 ఏళ్లలో కాంగ్రెస్​ క్షేత్రస్థాయి నుంచే బలహీనపడుతూ వచ్చింది"

--సురేంద్ర కిశోర్, సీనియర్​ జర్నలిస్ట్​

కాంగ్రెస్​ జోరు తగ్గాక.. సంప్రదాయ హస్తం ఓటర్లు భాజపాతో వెళ్లగా, మరొక విభాగం ఆర్జేడీలో కలిసిపోయింది. బలహీనపడిన కాంగ్రెస్..​ ఆర్జేడీ, రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్‌పీ), వికాషీల్‌ ఇన్సాన్‌ పార్టీ (వీఐపీ)లతో కలిసి కూటమి ఏర్పాటు చేసింది. నవంబర్‌ 29తో బిహార్‌ శాసనసభ గడువు ముగియనుంది. అక్టోబర్‌ చివర్లో గానీ నవంబర్‌లో గానీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది.

Last Updated : Sep 6, 2020, 7:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.