ETV Bharat / bharat

'పక్కా కుట్రతోనే చైనా సైన్యం కాల్పులు!'

author img

By

Published : Sep 8, 2020, 6:54 PM IST

Updated : Sep 8, 2020, 9:10 PM IST

around-50-pla-soldiers-approached-aggressively-towards-indian-post-near-mukhpari-peak-govt-sources-on-ladakh-faceoff
భారత స్థావరంవైపు దూసుకొచ్చిన చైనా సైనికులు

18:50 September 08

'పక్కా కుట్రతోనే చైనా సైన్యం కాల్పులు!'

around-50-pla-soldiers-approached-aggressively-towards-indian-post-near-mukhpari-peak-govt-sources-on-ladakh-faceoff
ఆయుధాలతో చైనీయులు

తూర్పు లద్దాఖ్​లో కాల్పుల కలకలంతో సరిహద్దులో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. అయితే చైనా ఉద్దేశపూర్వకంగానే ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు సమాచారం. సోమవారం సాయంత్రం.. ముఖ్​పారీ శిఖరం వద్ద 50మంది పీఎల్​ఏ సైనికులు.. భారత్​ సైనిక స్థావరంవైపు దూసుకొచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత జవాన్లపై దాడి చేసేందుకు రాడ్లు, కర్రలు, పదునైన ఆయుధాలను చైనీయులు తమ వెంట తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.

వ్యూహాత్మక ప్రాంతమైన ముఖ్​పారీ నుంచి భారత దళాలను తప్పించేందుకే చైనా ఈ కుట్రకు పాల్పడినట్టు సమాచారం. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని భారత్​ హెచ్చరించినట్టు.. అదే సమయంలో చైనీయులు గాల్లోకి 10-15రౌండ్ల కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది.

చైనా దుశ్చర్యలు కొనసాగుతున్నప్పటికీ.. దక్షిణ పాంగాంగ్​ ప్రాంతంలో భారత్​ పట్టుకోల్పోలేదని అధికారులు వెల్లడించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.

18:50 September 08

'పక్కా కుట్రతోనే చైనా సైన్యం కాల్పులు!'

around-50-pla-soldiers-approached-aggressively-towards-indian-post-near-mukhpari-peak-govt-sources-on-ladakh-faceoff
ఆయుధాలతో చైనీయులు

తూర్పు లద్దాఖ్​లో కాల్పుల కలకలంతో సరిహద్దులో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. అయితే చైనా ఉద్దేశపూర్వకంగానే ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు సమాచారం. సోమవారం సాయంత్రం.. ముఖ్​పారీ శిఖరం వద్ద 50మంది పీఎల్​ఏ సైనికులు.. భారత్​ సైనిక స్థావరంవైపు దూసుకొచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత జవాన్లపై దాడి చేసేందుకు రాడ్లు, కర్రలు, పదునైన ఆయుధాలను చైనీయులు తమ వెంట తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.

వ్యూహాత్మక ప్రాంతమైన ముఖ్​పారీ నుంచి భారత దళాలను తప్పించేందుకే చైనా ఈ కుట్రకు పాల్పడినట్టు సమాచారం. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని భారత్​ హెచ్చరించినట్టు.. అదే సమయంలో చైనీయులు గాల్లోకి 10-15రౌండ్ల కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది.

చైనా దుశ్చర్యలు కొనసాగుతున్నప్పటికీ.. దక్షిణ పాంగాంగ్​ ప్రాంతంలో భారత్​ పట్టుకోల్పోలేదని అధికారులు వెల్లడించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.

Last Updated : Sep 8, 2020, 9:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.