ETV Bharat / bharat

లాక్​డౌన్ ఉన్నా కాలుష్యం తగ్గనది ఆ 2 నగరాల్లోనే!

author img

By

Published : Apr 1, 2020, 9:52 AM IST

Updated : Apr 1, 2020, 11:08 AM IST

లాక్​డౌన్​ కారణంగా దేశవ్యాప్తంగా 88 నగరాల్లో వాయు కాలుష్యంలో తగ్గుదల నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది. దేశా రాజధాని దిల్లీలో వాయు నాణ్యత పెరిగిందని పేర్కొంది. మొత్తం 103కు గాను రెండు నగరాల్లోనే వాయు నాణ్యత తక్కువగా ఉన్నట్లు పేర్కొంది.

వాయుకాలుష్యం
POLLUTION

కరోనా మహమ్మారి నియంత్రణే లక్ష్యంగా విధించిన లాక్​డౌన్​ కారణంగా దేశవ్యాప్తంగా కాలుష్యం తగ్గి వాయు నాణ్యత పెరిగింది. దేశంలోని 103 ప్రధాన నగరాలకు గాను 23 నగరాల్లో వాయునాణ్యత మెరుగుపడినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది. మరో 65 నగరాల్లో సాధారణ స్థాయికి చేరినట్లు పేర్కొంది.

దేశ రాజధానిలో వృద్ధి

లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో గాలి కాలుష్యం అదుపులోకి వచ్చింది. ఎప్పుడూ ప్రమాదకర స్థాయిలో ఉండే గాలి నాణ్యత సూచీలు హరిత రంగులో దర్శనమిస్తున్నాయి. అందరూ ఇంట్లోనే ఉండాలన్న నినాదంతో పాటు ట్రాఫిక్ లేకపోవటం,పరిశ్రమలు మూతపడడం వల్ల మునుపెన్నడూ లేని స్థాయిలో దిల్లీలో గాలి నాణ్యత పెరిగింది.

రెండు నగరాల్లో...

ఉత్తర్​ప్రదేశ్​లోని బులంద్​ షహర్, అసోంలోని గువహటి నగరల్లో మాత్రమే వాయునాణ్యత మెరగుపడలేదని కాలుష్య నియంత్రణ బోర్డు పేర్కొంది.

కాలుష్యం తగ్గించేందుకు లాక్​డౌన్ వంటి విధానాలు సరికానప్పటికీ ఇలాంటి వాటి వల్ల ఫలితాలుంటాయని రుజువైందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: దేశం​లో 1400కు చేరువలో కరోనా కేసులు.. 35 మంది మృతి

కరోనా మహమ్మారి నియంత్రణే లక్ష్యంగా విధించిన లాక్​డౌన్​ కారణంగా దేశవ్యాప్తంగా కాలుష్యం తగ్గి వాయు నాణ్యత పెరిగింది. దేశంలోని 103 ప్రధాన నగరాలకు గాను 23 నగరాల్లో వాయునాణ్యత మెరుగుపడినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది. మరో 65 నగరాల్లో సాధారణ స్థాయికి చేరినట్లు పేర్కొంది.

దేశ రాజధానిలో వృద్ధి

లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో గాలి కాలుష్యం అదుపులోకి వచ్చింది. ఎప్పుడూ ప్రమాదకర స్థాయిలో ఉండే గాలి నాణ్యత సూచీలు హరిత రంగులో దర్శనమిస్తున్నాయి. అందరూ ఇంట్లోనే ఉండాలన్న నినాదంతో పాటు ట్రాఫిక్ లేకపోవటం,పరిశ్రమలు మూతపడడం వల్ల మునుపెన్నడూ లేని స్థాయిలో దిల్లీలో గాలి నాణ్యత పెరిగింది.

రెండు నగరాల్లో...

ఉత్తర్​ప్రదేశ్​లోని బులంద్​ షహర్, అసోంలోని గువహటి నగరల్లో మాత్రమే వాయునాణ్యత మెరగుపడలేదని కాలుష్య నియంత్రణ బోర్డు పేర్కొంది.

కాలుష్యం తగ్గించేందుకు లాక్​డౌన్ వంటి విధానాలు సరికానప్పటికీ ఇలాంటి వాటి వల్ల ఫలితాలుంటాయని రుజువైందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: దేశం​లో 1400కు చేరువలో కరోనా కేసులు.. 35 మంది మృతి

Last Updated : Apr 1, 2020, 11:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.