ETV Bharat / bharat

ఓపీఎస్, ఈపీఎస్​కు మళ్లీ కీలక పదవులు-​ శశికళకు ఇక కష్టాలే!

author img

By

Published : Dec 6, 2021, 5:14 PM IST

Updated : Dec 6, 2021, 5:30 PM IST

AIADMK Party: అన్నాడీఎంకే పార్టీ సమన్వయకర్త, సంయుక్త సమన్వయకర్తలుగా తిరిగి ఎన్నికయ్యారు ఓ పన్నీర్​ సెల్వం, ఎడప్పాడి పళనిస్వామి. పార్టీలో తిరిగి చక్రం తిప్పాలనుకుంటున్న మాజీ ప్రధాన కార్యదర్శి శశికళకు ఇది పెద్ద ఎదురుదెబ్బే.

AIADMK Coordinator,  Joint Coordinator of AIADMK
పన్నీర్​ సెల్వం, పళనిస్వామి

AIADMK Party: తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే కీలక పదవుల్లో.. మళ్లీ మాజీ ముఖ్యమంత్రులు ఓ పన్నీర్​ సెల్వం, ఎడప్పాడి పళనిస్వామి ఉండనున్నారు. పార్టీ సమన్వయకర్తగా పన్నీర్​ సెల్వం, సంయుక్త సమన్వయకర్తగా పళనిస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

డిసెంబర్​ 4న వీరు నామినేషన్లు సమర్పించగా.. పోటీ లేకుండానే విజయం పొందారు.

ఎన్నికలకు ముందు పార్టీ బైలాస్​ను సవరించి, శశికళ మళ్లీ చక్రం తిప్పేందుకు ఎలాంటి అవకాశం లేకుండా చేయడంలో ఓపీఎస్​, ఈపీఎస్​ సఫలమయ్యారు.

శశికళకు ఇక కష్టమే..!

అన్నాడీఎంకే పార్టీలో 2017లో తొలిసారిగా పార్టీ నిబంధనలను సవరించారు. జనరల్​ సెక్రటరీ స్థానాన్ని తొలగించి పార్టీ సమన్వయకర్త, సంయుక్త సమన్వయకర్త స్థానాలకు అధికారాన్ని కల్పించారు. రెండు పదవులు ఉన్నా.. సమాన అధికారం ఉండేలా మార్పులు చేశారు.

అప్పటివరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగిన శశికళను పదవిలో నుంచి తొలగించి.. పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత అక్రమాస్తుల కేసుల్లో.. దోషిగా తేలిన ఆమె జైలు జీవితం గడిపారు.

తిరిగొచ్చాక శశికళ మళ్లీ ప్రధాన కార్యదర్శినని చెప్పుకుంటూ.. అన్నాడీఎంకేలో తన స్థానాన్ని స్థిరపరుచుకోవాలనుకుంటుండగా ఎదురుదెబ్బ తగిలింది. ఆమెకు అన్ని దారులు మూసివేసేలా పార్టీ చర్యలు చేపట్టింది. కార్యనిర్వహక కమిటీ సభ్యులు ఇటీవల పార్టీ నిబంధనలలో కీలక మార్పులు చేశారు. పార్టీ సమన్వయకర్త, జాయింట్​ కోఆర్డినేటర్​ స్థానాలకు సింగిల్​ ఓటు విధానాన్ని తప్పనిసరి చేస్తూ బైలాస్​ను సవరించారు.

ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఎన్నికల్లో ఓటమి..

ఈ ఏడాది ఏప్రిల్​లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోయింది. మొత్తం 234 స్థానాలకు గానూ 70 చోట్లే గెలిచి.. ప్రతిపక్షానికి పరిమితమైంది.

డీఎంకే 131 చోట్ల నెగ్గి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎంకే స్టాలిన్​ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

ఇదీ చూడండి: రాజీనామా చేస్తా అంటే మోదీ వద్దన్నారు: దేవెగౌడ

AIADMK Party: తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే కీలక పదవుల్లో.. మళ్లీ మాజీ ముఖ్యమంత్రులు ఓ పన్నీర్​ సెల్వం, ఎడప్పాడి పళనిస్వామి ఉండనున్నారు. పార్టీ సమన్వయకర్తగా పన్నీర్​ సెల్వం, సంయుక్త సమన్వయకర్తగా పళనిస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

డిసెంబర్​ 4న వీరు నామినేషన్లు సమర్పించగా.. పోటీ లేకుండానే విజయం పొందారు.

ఎన్నికలకు ముందు పార్టీ బైలాస్​ను సవరించి, శశికళ మళ్లీ చక్రం తిప్పేందుకు ఎలాంటి అవకాశం లేకుండా చేయడంలో ఓపీఎస్​, ఈపీఎస్​ సఫలమయ్యారు.

శశికళకు ఇక కష్టమే..!

అన్నాడీఎంకే పార్టీలో 2017లో తొలిసారిగా పార్టీ నిబంధనలను సవరించారు. జనరల్​ సెక్రటరీ స్థానాన్ని తొలగించి పార్టీ సమన్వయకర్త, సంయుక్త సమన్వయకర్త స్థానాలకు అధికారాన్ని కల్పించారు. రెండు పదవులు ఉన్నా.. సమాన అధికారం ఉండేలా మార్పులు చేశారు.

అప్పటివరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగిన శశికళను పదవిలో నుంచి తొలగించి.. పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత అక్రమాస్తుల కేసుల్లో.. దోషిగా తేలిన ఆమె జైలు జీవితం గడిపారు.

తిరిగొచ్చాక శశికళ మళ్లీ ప్రధాన కార్యదర్శినని చెప్పుకుంటూ.. అన్నాడీఎంకేలో తన స్థానాన్ని స్థిరపరుచుకోవాలనుకుంటుండగా ఎదురుదెబ్బ తగిలింది. ఆమెకు అన్ని దారులు మూసివేసేలా పార్టీ చర్యలు చేపట్టింది. కార్యనిర్వహక కమిటీ సభ్యులు ఇటీవల పార్టీ నిబంధనలలో కీలక మార్పులు చేశారు. పార్టీ సమన్వయకర్త, జాయింట్​ కోఆర్డినేటర్​ స్థానాలకు సింగిల్​ ఓటు విధానాన్ని తప్పనిసరి చేస్తూ బైలాస్​ను సవరించారు.

ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఎన్నికల్లో ఓటమి..

ఈ ఏడాది ఏప్రిల్​లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోయింది. మొత్తం 234 స్థానాలకు గానూ 70 చోట్లే గెలిచి.. ప్రతిపక్షానికి పరిమితమైంది.

డీఎంకే 131 చోట్ల నెగ్గి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎంకే స్టాలిన్​ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

ఇదీ చూడండి: రాజీనామా చేస్తా అంటే మోదీ వద్దన్నారు: దేవెగౌడ

Last Updated : Dec 6, 2021, 5:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.