ETV Bharat / bharat

అఫ్గాన్​లో 74 మంది ముష్కరులు హతం

author img

By

Published : Dec 20, 2020, 7:11 PM IST

ఉగ్రవాదులకు, అఫ్గానిస్థాన్‌ భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో సుమారు 74మంది ముష్కరులు హతమయ్యారని ఆ దేశ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. కాందహార్​ రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో శనివారం పలు దాడులు జరిగినట్టు వెల్లడించింది.

Afghan troops kill 74 Taliban terrorists during clashes in Kandahar province
'అఫ్గానిస్థాన్​లో 74మంది ముష్కరుల హతం'

దేశంలోని ​వివిధ చోట్ల దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్న ఉగ్రవాదుల శిబిరాలపై అఫ్గాన్ సైన్యం విరుచుకుపడింది. ఈ దాడుల్లో శనివారం ఒక్కరోజే 74 మంది చనిపోయారని, మరో 15 తీవ్రంగా గాయపడ్డారని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

పక్కా సమాచారంతో కాందహార్​ రాష్ట్రంలోని జెరియా, దాండ్​, పంజావి, అర్గందాబ్​లో పెద్ద ఎత్తున సైనిక కార్యకలాపాలను చేపట్టినట్టు తెలిపింది. ముష్కర స్థావరాల నుంచి పెద్దఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది.

దేశంలోని ​వివిధ చోట్ల దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్న ఉగ్రవాదుల శిబిరాలపై అఫ్గాన్ సైన్యం విరుచుకుపడింది. ఈ దాడుల్లో శనివారం ఒక్కరోజే 74 మంది చనిపోయారని, మరో 15 తీవ్రంగా గాయపడ్డారని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

పక్కా సమాచారంతో కాందహార్​ రాష్ట్రంలోని జెరియా, దాండ్​, పంజావి, అర్గందాబ్​లో పెద్ద ఎత్తున సైనిక కార్యకలాపాలను చేపట్టినట్టు తెలిపింది. ముష్కర స్థావరాల నుంచి పెద్దఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది.

ఇదీ చదవండి: అఫ్గాన్​లో కారు బాంబు దాడి- 8 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.