ETV Bharat / bharat

బంగాల్​ హింసపై సీజేఐకి మహిళా న్యాయవాదుల లేఖ

author img

By

Published : May 24, 2021, 7:14 PM IST

బంగాల్​లో ఎన్నికల తర్వాత హింసపై ప్రత్యేక దర్యాప్తు కమిటీని నియమించాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణకు లేఖ రాశారు 2వేల మంది మహిళా న్యాయవాదులు. కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిగేలా చూడాలని, బాధితులకు పరిహారం అందేలా ఆదేశాలివ్వాలని కోరారు.

CJI NV Ramana
జస్టిస్​ ఎన్వీ రమణ

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హింసపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​వీ రమణకు లేఖ రాశారు 2093 మంది మహిళా న్యాయవాదుల. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన న్యాయవాదులు లేఖపై సంతకాలు చేశారు.

బంగాల్ హింసలో చిన్నారులు, మహిళలు, దళితులపై దాడి జరిగిందని లేఖలో పేర్కొన్న న్యాయవాదులు.. ప్రత్యేక దర్యాప్తు కమిటీని నియమించాలని కోరారు. కోర్టు పర్యవేక్షణలో కాలపరిమితితో దర్యాప్తు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. మరణించిన, గాయపడిన బాధిత కుటుంబాలకు పరిహారం అందించేలా ఆదేశాలు ఇవ్వాలని, ఇతర రాష్ట్రాలకు వెళ్లిన బాధితులు తిరిగే వచ్చేలా ఆ రాష్ట్ర పోలీసులు భద్రత కల్పించాలని విన్నవించారు.

ఈ ఘటనపై వచ్చిన ఫిర్యాదులను కోర్టుకు సమర్పించేలా డీజీపీని ఆదేశించాలని కోరారు న్యాయవాదులు.

ఇదీ చూడండి: భాజపా, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హింసపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​వీ రమణకు లేఖ రాశారు 2093 మంది మహిళా న్యాయవాదుల. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన న్యాయవాదులు లేఖపై సంతకాలు చేశారు.

బంగాల్ హింసలో చిన్నారులు, మహిళలు, దళితులపై దాడి జరిగిందని లేఖలో పేర్కొన్న న్యాయవాదులు.. ప్రత్యేక దర్యాప్తు కమిటీని నియమించాలని కోరారు. కోర్టు పర్యవేక్షణలో కాలపరిమితితో దర్యాప్తు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. మరణించిన, గాయపడిన బాధిత కుటుంబాలకు పరిహారం అందించేలా ఆదేశాలు ఇవ్వాలని, ఇతర రాష్ట్రాలకు వెళ్లిన బాధితులు తిరిగే వచ్చేలా ఆ రాష్ట్ర పోలీసులు భద్రత కల్పించాలని విన్నవించారు.

ఈ ఘటనపై వచ్చిన ఫిర్యాదులను కోర్టుకు సమర్పించేలా డీజీపీని ఆదేశించాలని కోరారు న్యాయవాదులు.

ఇదీ చూడండి: భాజపా, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.