ETV Bharat / bharat

'19 లక్షల ఈవీఎంలు మాయం'.. ఎన్నికల సంఘానికి సమన్లు!

Missing EVM Machines in India: దేశంలో 2016-2018 మధ్య 19 లక్షల ఈవీఎంలు మాయమయ్యాయని ఆరోపించారు కాంగ్రెస్​ నేత హెచ్​కే పాటిల్​. ఎన్నికల సంస్కరణలపై కర్ణాటక అసెంబ్లీలో జరిగిన సమావేశం సందర్భంగా ఈ ఆరోపణలు చేశారు. ఈ విషయంపై ఎన్నికల సంఘం అధికారులకు సమన్లు జారీ చేస్తామని అన్నారు సభాపతి విశ్వేశ్వర్​ హెగ్డే కగేరీ.

author img

By

Published : Apr 1, 2022, 12:00 PM IST

evm
ఈవీఎం

Missing EVM Machines in India: కర్ణాటక శాసనసభ్యుడు, కాంగ్రెస్​ నేత హెచ్​కే పాటిల్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2016-2018 మధ్య మొత్తం 19 లక్షల ఈవీఎంలు మాయమైనట్లు ఆరోపించారు. ఎన్నికల సంస్కరణలపై ఆ రాష్ట్ర అసెంబ్లీలో మంగళవారం జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై ప్రశ్నించగా ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి సమాధానం లేదని పేర్కొన్నారు. ఈ వైఖరి వల్ల ఈవీఎంలకు సంబంధించి అవకతవకలు జరుగుతున్నాయనే అనుమానం మరింత బలపడుతుందని పేర్కొన్నారు.

"ఈ వ్యవస్థలో మార్పులు తేవాల్సిన అవసరం ఉంది. కొన్ని రోజుల క్రితం ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. ప్రజలు ఓ పార్టీకే భారీగా మద్దతు పలికారు. కేబినెట్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అందులోని 53 మంది మంత్రుల్లో 22 మందిపై క్రిమినల్​ కేసులు ఉన్నాయి. దీని గురించి ప్రజలు ఏమనుకోవాలి? ఈవీఎంలపై చాలా సందేహాలు ఉన్నాయి. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఎన్నికల సంఘమా లేక ప్రభుత్వమా?"

-హెచ్​కే పాటిల్, కాంగ్రెస్​ నేత

పాటిల్​ వ్యాఖ్యలపై స్పందించిన స్పీకర్ విశ్వేశ్వర్​ హెగ్డే కగేరీ​.. ఈ ఆరోపణల వెనుక కారణంపై పాటిల్​ స్పష్టత ఇస్తే ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం అధికారులకు సమన్లు జారీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు వారికి లేఖ రాస్తానని తెలిపారు. మరోవైపు ఎన్నికల అవకతవకలపై స్పందిస్తూ.. ఎన్నికల వ్యవస్థ దిగజారిపోయిందని వ్యాఖ్యానించారు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి. ప్రజలు, రాజకీయ పార్టీలే ఇందుకు కారణం అని పేర్కొన్నారు.

ఇదీ చూడండి : 17 ఏళ్లకే ఆంగ్లేయులకు వణుకు పుట్టించిన 'అనంతుడు'

Missing EVM Machines in India: కర్ణాటక శాసనసభ్యుడు, కాంగ్రెస్​ నేత హెచ్​కే పాటిల్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2016-2018 మధ్య మొత్తం 19 లక్షల ఈవీఎంలు మాయమైనట్లు ఆరోపించారు. ఎన్నికల సంస్కరణలపై ఆ రాష్ట్ర అసెంబ్లీలో మంగళవారం జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై ప్రశ్నించగా ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి సమాధానం లేదని పేర్కొన్నారు. ఈ వైఖరి వల్ల ఈవీఎంలకు సంబంధించి అవకతవకలు జరుగుతున్నాయనే అనుమానం మరింత బలపడుతుందని పేర్కొన్నారు.

"ఈ వ్యవస్థలో మార్పులు తేవాల్సిన అవసరం ఉంది. కొన్ని రోజుల క్రితం ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. ప్రజలు ఓ పార్టీకే భారీగా మద్దతు పలికారు. కేబినెట్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అందులోని 53 మంది మంత్రుల్లో 22 మందిపై క్రిమినల్​ కేసులు ఉన్నాయి. దీని గురించి ప్రజలు ఏమనుకోవాలి? ఈవీఎంలపై చాలా సందేహాలు ఉన్నాయి. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఎన్నికల సంఘమా లేక ప్రభుత్వమా?"

-హెచ్​కే పాటిల్, కాంగ్రెస్​ నేత

పాటిల్​ వ్యాఖ్యలపై స్పందించిన స్పీకర్ విశ్వేశ్వర్​ హెగ్డే కగేరీ​.. ఈ ఆరోపణల వెనుక కారణంపై పాటిల్​ స్పష్టత ఇస్తే ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం అధికారులకు సమన్లు జారీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు వారికి లేఖ రాస్తానని తెలిపారు. మరోవైపు ఎన్నికల అవకతవకలపై స్పందిస్తూ.. ఎన్నికల వ్యవస్థ దిగజారిపోయిందని వ్యాఖ్యానించారు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి. ప్రజలు, రాజకీయ పార్టీలే ఇందుకు కారణం అని పేర్కొన్నారు.

ఇదీ చూడండి : 17 ఏళ్లకే ఆంగ్లేయులకు వణుకు పుట్టించిన 'అనంతుడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.