ETV Bharat / bharat

100 Times Blood Donor : 100సార్లు రక్తదానం.. 'బ్లడ్​ ఫైటర్స్'​ కేర్ ప్రారంభం.. ఎందరికో ఆదర్శంగా..

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2023, 5:34 PM IST

100 Times Blood Donor : అన్ని దానాల్లోనూ రక్తదానం అపురూపం. అలాంటి దానంలో ముందుంటున్నారు కర్ణాటక.. హవేరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి. తాజాగా వందో సారి రక్తదానం చేసిన రికార్డు సృష్టించారు. దీంతో పాటు బ్లడ్​ ఫైటర్స్​ కేర్​ హోమ్​ను కూడా ప్రారంభించారు. రక్తదానం చేయడమే కాకుండా దాని ప్రాముఖ్యతపై అందరికీ అవగాహన కల్పిస్తున్నారు.

man who donated blood 100 times
man who donated blood 100 times

100 Times Blood Donor : రక్త సైనికుల గ్రామంగా తమిళనాడు.. హవేరి జిల్లాలోని అక్కిఆలూరూ గ్రామం పేరుగాంచింది. తాజాగా ఆ గ్రామానికి చెందిన కరబనప్ప మనోహర్​ గొంది అనే వ్యక్తి ఇప్పుడు మరో రికార్డు సృష్టించాడు. జిల్లాలో 100 సార్లు రక్తదానం చేసిన ఏకైక వ్యక్తిగా నిలిచాడు. తరచూ రక్తదానం చేస్తూ.. ఎంతో మంది ప్రాణాలను కాపాడి అందరిలో స్ఫూర్తి నింపుతున్నాడు.

అక్కిఆలూరు గ్రామంలోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో వందో రక్తదానం, రక్త సంబంధ వ్యాధుల సమయోధుల ఉచిత సంరక్షణ గృహం ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం జరిగింది. అందులో బ్లడ్​ డిజార్డర్​ ఫైటర్స్​ (తలసేమియా, హిమోఫిలియా) ఉచిత కేర్​ హోమ్​ను ప్రారంభించారు. రాష్ట్రంలో బ్లడ్​ డిజార్డర్​ ఫైటర్స్​ కోసం నిర్మించిన తొలి కేర్​ హోమ్​గా నిలిచింది. ఈ కార్యక్రమంలో కరబసప్ప గొంది వందో సారి రక్తదానం చేశారు. ఆయనతో పాటు మరో 30 మందికి పైగా దాతలు రక్తదానం చేశారు.

man who donated blood 100 times
వందసార్లు రక్తదానం చేసిన కరబనప్ప మనోహర్​ గొంది

ఈ సందర్భంగా కరబనప్ప గొంది మీడియాతో మాట్లాడారు. "రక్తదానంపై మొదట్లో చాలా మూఢనమ్మకాలు ఉండేవి. అందుకే స్నేహ మైత్రి బ్లడ్ ఆర్మీ గ్రూప్‌ను ఏర్పాటు చేసి రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించాం. ప్రారంభంలో ప్రజలు రక్తదానంపై విముఖత చూపేవారు. కానీ క్రమంగా రక్తదానం చేయడం మొదలు పెట్టారు. ఇప్పటి వరకు స్నేహ మైత్రి బ్లడ్ ఆర్మీ ఆధ్వర్యంలో దాదాపు 125 రక్తదాన శిబిరాలు నిర్విహించాం. అందులో దాదాపు వంద శిబిరాలు హవేరి జిల్లాలో ఏర్పాటు చేశాం. రక్త సైనికులకు నిలయమైన అక్కి ఆలూరులోనే సుమారు 25 రక్తదాన శిబిరాలు నిర్వహించాం. హావేరి జిల్లాలో 200 మందికి పైగా చిన్నారులు తలసేమియా, హీమోఫీలియాతో పాటు వివిధ వ్యాధులతో బాధపడుతున్నారు" అని చెప్పారు.

man who donated blood 100 times
వందోసారి రక్తదానం చేస్తున్న కరబనప్ప మనోహర్​ గొంది

"ఈ పిల్లలకు చికిత్స ప్రకారం నెలకోసారి, వారానికోసారి రక్తం అవసరం అవుతుంది. దీనికి తోడు మ్యాచ్​ అయ్యే రక్తం దొరకడం చాలా కష్టం. ఈ చిన్నారులు బ్లడ్​ ఇంజక్షన్ల కోసం తరచూ జిల్లా ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. జిల్లా ఆస్పత్రిలో ఇందుకు ప్రత్యేక విభాగం లేదు. అందుకే స్నేహ మైత్రి బ్లడ్ ఆర్మీ, జిల్లా యంత్రాంగం, దావణగెరె స్టేట్ హీమోఫీలియా సొసైటీ సహకారంతో అక్కిఆలూరులో బ్లడ్​ ఫైటర్స్​ సంరక్షణ గృహాన్ని ప్రారంభించాం. ఈ సంరక్షణ గృహంలో వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న పిల్లలు ఈ ఇంట్లో చికిత్స పొందవచ్చు. ప్రతినెలా మొదటి ఆదివారం ఇక్కడ అన్నిరకాల ఆరోగ్య సేవలు అందిస్తారు. ఇంతకుముందు ఇలాంటి పిల్లలకు రక్తదానం చేయమని ప్రజలను ప్రోత్సహించేవాడిని. ఇప్పుడు అక్కిఆలూరులో సంరక్షణ గృహాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. జిల్లాలోని బ్లడ్ డిజార్డర్ ఫైటర్స్ దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు" అని కరబనప్ప గొంది తెలిపారు.

ఈ విషయంపై హవేరి బ్లడ్​ బ్యాంక్​ ప్రతినిధి డాక్టర్ బసవరాజ తల్వార్ స్పందించారు. స్నేహ బ్లడ్​ ఆర్మీ చేస్తున్న కృషిని అభినందించారు. "రక్తదానం ప్రాముఖ్యతను ప్రచారం చేయడంలో స్నేహ మైత్రి బ్లడ్ ఆర్మీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. అలాగే హవేరి జిల్లాలో సేకరిస్తున్న రక్తంలో 60 నుంచి 70 శాతం హనగల్ తాలూకా నుంచే వస్తోంది. రక్తదాత కరబసప్ప గొంది అవగాహన కార్యక్రమమే ఇందుకు కారణం" అని బసవరాజ తల్వార్​ కొనియాడారు.

గర్భిణీ శునకానికి రక్తదానం.. పెద్ద మనసు చాటుకున్న జిమ్మీ

'ఆగిపోయే ప్రాణాన్ని కాపాడేది రక్తదానమే'

100 Times Blood Donor : రక్త సైనికుల గ్రామంగా తమిళనాడు.. హవేరి జిల్లాలోని అక్కిఆలూరూ గ్రామం పేరుగాంచింది. తాజాగా ఆ గ్రామానికి చెందిన కరబనప్ప మనోహర్​ గొంది అనే వ్యక్తి ఇప్పుడు మరో రికార్డు సృష్టించాడు. జిల్లాలో 100 సార్లు రక్తదానం చేసిన ఏకైక వ్యక్తిగా నిలిచాడు. తరచూ రక్తదానం చేస్తూ.. ఎంతో మంది ప్రాణాలను కాపాడి అందరిలో స్ఫూర్తి నింపుతున్నాడు.

అక్కిఆలూరు గ్రామంలోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో వందో రక్తదానం, రక్త సంబంధ వ్యాధుల సమయోధుల ఉచిత సంరక్షణ గృహం ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం జరిగింది. అందులో బ్లడ్​ డిజార్డర్​ ఫైటర్స్​ (తలసేమియా, హిమోఫిలియా) ఉచిత కేర్​ హోమ్​ను ప్రారంభించారు. రాష్ట్రంలో బ్లడ్​ డిజార్డర్​ ఫైటర్స్​ కోసం నిర్మించిన తొలి కేర్​ హోమ్​గా నిలిచింది. ఈ కార్యక్రమంలో కరబసప్ప గొంది వందో సారి రక్తదానం చేశారు. ఆయనతో పాటు మరో 30 మందికి పైగా దాతలు రక్తదానం చేశారు.

man who donated blood 100 times
వందసార్లు రక్తదానం చేసిన కరబనప్ప మనోహర్​ గొంది

ఈ సందర్భంగా కరబనప్ప గొంది మీడియాతో మాట్లాడారు. "రక్తదానంపై మొదట్లో చాలా మూఢనమ్మకాలు ఉండేవి. అందుకే స్నేహ మైత్రి బ్లడ్ ఆర్మీ గ్రూప్‌ను ఏర్పాటు చేసి రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించాం. ప్రారంభంలో ప్రజలు రక్తదానంపై విముఖత చూపేవారు. కానీ క్రమంగా రక్తదానం చేయడం మొదలు పెట్టారు. ఇప్పటి వరకు స్నేహ మైత్రి బ్లడ్ ఆర్మీ ఆధ్వర్యంలో దాదాపు 125 రక్తదాన శిబిరాలు నిర్విహించాం. అందులో దాదాపు వంద శిబిరాలు హవేరి జిల్లాలో ఏర్పాటు చేశాం. రక్త సైనికులకు నిలయమైన అక్కి ఆలూరులోనే సుమారు 25 రక్తదాన శిబిరాలు నిర్వహించాం. హావేరి జిల్లాలో 200 మందికి పైగా చిన్నారులు తలసేమియా, హీమోఫీలియాతో పాటు వివిధ వ్యాధులతో బాధపడుతున్నారు" అని చెప్పారు.

man who donated blood 100 times
వందోసారి రక్తదానం చేస్తున్న కరబనప్ప మనోహర్​ గొంది

"ఈ పిల్లలకు చికిత్స ప్రకారం నెలకోసారి, వారానికోసారి రక్తం అవసరం అవుతుంది. దీనికి తోడు మ్యాచ్​ అయ్యే రక్తం దొరకడం చాలా కష్టం. ఈ చిన్నారులు బ్లడ్​ ఇంజక్షన్ల కోసం తరచూ జిల్లా ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. జిల్లా ఆస్పత్రిలో ఇందుకు ప్రత్యేక విభాగం లేదు. అందుకే స్నేహ మైత్రి బ్లడ్ ఆర్మీ, జిల్లా యంత్రాంగం, దావణగెరె స్టేట్ హీమోఫీలియా సొసైటీ సహకారంతో అక్కిఆలూరులో బ్లడ్​ ఫైటర్స్​ సంరక్షణ గృహాన్ని ప్రారంభించాం. ఈ సంరక్షణ గృహంలో వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న పిల్లలు ఈ ఇంట్లో చికిత్స పొందవచ్చు. ప్రతినెలా మొదటి ఆదివారం ఇక్కడ అన్నిరకాల ఆరోగ్య సేవలు అందిస్తారు. ఇంతకుముందు ఇలాంటి పిల్లలకు రక్తదానం చేయమని ప్రజలను ప్రోత్సహించేవాడిని. ఇప్పుడు అక్కిఆలూరులో సంరక్షణ గృహాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. జిల్లాలోని బ్లడ్ డిజార్డర్ ఫైటర్స్ దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు" అని కరబనప్ప గొంది తెలిపారు.

ఈ విషయంపై హవేరి బ్లడ్​ బ్యాంక్​ ప్రతినిధి డాక్టర్ బసవరాజ తల్వార్ స్పందించారు. స్నేహ బ్లడ్​ ఆర్మీ చేస్తున్న కృషిని అభినందించారు. "రక్తదానం ప్రాముఖ్యతను ప్రచారం చేయడంలో స్నేహ మైత్రి బ్లడ్ ఆర్మీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. అలాగే హవేరి జిల్లాలో సేకరిస్తున్న రక్తంలో 60 నుంచి 70 శాతం హనగల్ తాలూకా నుంచే వస్తోంది. రక్తదాత కరబసప్ప గొంది అవగాహన కార్యక్రమమే ఇందుకు కారణం" అని బసవరాజ తల్వార్​ కొనియాడారు.

గర్భిణీ శునకానికి రక్తదానం.. పెద్ద మనసు చాటుకున్న జిమ్మీ

'ఆగిపోయే ప్రాణాన్ని కాపాడేది రక్తదానమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.