నాదెండ్ల మనోహర్​తో ఏపీ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధుల భేటీ - సమస్యలపై వినతి పత్రం - janasena nadendla manohar

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 3, 2023, 10:57 AM IST

AP Lorry Owners Met Nadendla Manohar: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ విధానాలతో రంగం కుదేలైపోయిందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) అన్నారు. ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వై.వి.ఈశ్వర రావు, వజీర్, సూరపనేని విజయ్, జి. వీర వెంకయ్య, నాదెళ్ల కృష్ణ రవాణా రంగంలో నెలకొన్న సమస్యలపై మనోహర్​తో భేటీ అయ్యారు. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వినతి పత్రం అందించారు. 

లారీలు, ట్రక్కులు, మినీ ట్రక్కులు, ఇలా రవాణాలో భాగమైన వాహనాల యజమానులు నష్టాల పాలవుతున్నారనీ ప్రభుత్వ విధానాలలో సరళీకరణ తీసుకురావాలన్నారు. దేశంలో అన్ని ఆటోనగర్​లకు నమూనాగా ఉన్న విజయవాడ ఆటోనగర్​ను వైసీపీ నాశనం చేసిందని మండిపడ్డారు. రవాణా రంగంలో ఉన్న సమస్యలపై పరిష్కారానికి జనసేన పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని నాదెండ్ల మనోహర్‌ హామీ ఇచ్చారు. త్వరలో జనసేన అధినేత పవన్ కల్యాణ్​తో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. రవాణా రంగాన్ని బలోపేతం చేసే అంశాలను మా మేనిఫెస్టోలో చేరుస్తామన్నారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.