3 కిమీ మేర స్తంభించిన ట్రాఫిక్- వాహనదారుల ఇక్కట్లు​

By

Published : Nov 8, 2021, 2:09 PM IST

thumbnail

ఉత్తర్​ప్రదేశ్​లోని యమునా ఎక్స్​ప్రెస్​ వేపై ఆదివారం సాయంత్రం భారీగా ట్రాఫిక్ (Yamuna Expressway Traffic Jam)​ స్తంభించింది. మథురాలోని టోల్​ ప్లాజాల దగ్గర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మూడు కిలోమీటర్ల వరకు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. సాధారణంగా రోజుకు సగటున 10వేల నుంచి 15వేల వాహనాలు ఈ మార్గంలో రాకపోకలు జరుపుతాయని.. కానీ ఆదివారం ఒక్కరోజే 50వేలకుపైగా వాహనాలు తిరిగినట్లు అధికారులు వెల్లడించారు. దీపావళి సెలవులు పూర్తికావడం, ఉద్యోగులు అందరూ తిరుగు ప్రయాణం పట్టడమే ఈ ట్రాఫిక్​కు కారణమని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.