ETV Bharat / sports

చరిత్రలో ఈరోజు: ధోనీ సారథ్యంలో మూడోసారి విశ్వవిజేతగా

టీమ్​ఇండియా ప్రపంచ ఛాంపియన్​షిప్​ ట్రోఫీని దక్కించుకుని నేటితో ఏడేళ్లు పూర్తయ్యాయి. 2013లో ఇంగ్లాండ్​తో జరిగిన తుదిపోరులో గెలిచి.. రెండోసారి ట్రోఫీని భారత జట్టు ముద్దాడింది. టీ20, వన్డే ప్రపంచకప్​ల తర్వాత ధోనీ సారథ్యంలో భారత్​కు దక్కిన మూడో ఐసీసీ ట్రోఫీ ఇది.

author img

By

Published : Jun 23, 2020, 3:10 PM IST

This day that year: India beat England in thrilling final to claim 2nd Champions Trophy title in 2013
చరిత్రలో ఈ రోజు: ధోనీ కెప్టెన్సీలో భారత్​కు మరో ట్రోఫీ

కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన క్రీడాటోర్నీలన్నీ వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో గతంలో జరిగిన కొన్ని జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు క్రికెట్​ అభిమానులు. క్రికెట్​ ప్రపంచ ఛాంపియన్​షిప్​-2013లో టీమ్​ఇండియా విజేతగా నిలిచిన క్షణాలను సోషల్​మీడియా వేదికగా గుర్తుచేసుకుంటున్నారు. మహేంద్రసింగ్​ ధోనీ నాయకత్వంలో అప్పటికే టీ20, వన్డే ప్రపంచకప్​లు గెలిచి భారత జట్టు అద్భుతమైన ఫామ్​లో ఉంది. అతని సారథ్యంలోనే ప్రపంచ ఛాంపియన్​షిప్​లో అడుగుపెట్టిన భారత్​.. మరో ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ చారిత్రక ఘటన నేటితో ఏడేళ్లు పూర్తి చేసుకుంది.

This day that year: India beat England in thrilling final to claim 2nd Champions Trophy title in 2013
ట్రోఫీని అందుకుంటున్న మహేంద్రసింగ్​ ధోనీ

ఇంగ్లాండ్​లోని ఎడ్జ్​బాస్టన్ వేదికగా జరిగిన ప్రపంచ ఛాంపియన్​షిప్​ తుదిపోరులో భారత్​, ఇంగ్లాండ్​ పోటీ పడ్డాయి. వర్షం కారణంగా మ్యాచ్​ను 20 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్​ చేసిన టీమ్​ఇండియా 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. విరాట్​ కోహ్లీ (43), రవీంద్ర జడేజా (33) రాణించడం వల్ల భారత్​ మెరుగైన స్కోర్ సాధించగలిగింది.

130 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లీష్​ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 124 పరుగులు చేసి పరాజయం పాలైంది. ఓపెనర్లు విఫలమైనా.. మోర్గాన్​ (33), బొపారా (30) మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. ఫలితంగా 5 పరుగుల తేడాతో ఇంగ్లాండ్​పై టీమ్ఇండియా విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. 'మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​'గా రవీంద్ర జడేజా, 'మ్యాన్​ ఆఫ్​ ది సిరీస్​'గా శిఖర్​ ధావన్​లు నిలిచారు.

This day that year: India beat England in thrilling final to claim 2nd Champions Trophy title in 2013
విజయోత్సవంలో టీమ్ఇండియా ఆటగాళ్లు

రెండోసారి విజేతగా..

ఆస్ట్రేలియా తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రపంచ ఛాంపియన్​గా అవతరించిన రెండో జట్టుగా టీమ్​ఇండియా ఘనత సాధించింది. 2002లో శ్రీలంకలో జరిగిన ఛాంపియన్​షిప్ టోర్నీలో వర్షం కారణంగా లంక, భారత్​లను ఆ ఏడాది సంయుక్త విజేతలుగా ప్రకటించారు.

ఇదీ చూడండి... 'టెస్టుల్లో రాహుల్​కు కీపింగ్ బాధ్యతలు ఇవ్వొద్దు'

కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన క్రీడాటోర్నీలన్నీ వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో గతంలో జరిగిన కొన్ని జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు క్రికెట్​ అభిమానులు. క్రికెట్​ ప్రపంచ ఛాంపియన్​షిప్​-2013లో టీమ్​ఇండియా విజేతగా నిలిచిన క్షణాలను సోషల్​మీడియా వేదికగా గుర్తుచేసుకుంటున్నారు. మహేంద్రసింగ్​ ధోనీ నాయకత్వంలో అప్పటికే టీ20, వన్డే ప్రపంచకప్​లు గెలిచి భారత జట్టు అద్భుతమైన ఫామ్​లో ఉంది. అతని సారథ్యంలోనే ప్రపంచ ఛాంపియన్​షిప్​లో అడుగుపెట్టిన భారత్​.. మరో ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ చారిత్రక ఘటన నేటితో ఏడేళ్లు పూర్తి చేసుకుంది.

This day that year: India beat England in thrilling final to claim 2nd Champions Trophy title in 2013
ట్రోఫీని అందుకుంటున్న మహేంద్రసింగ్​ ధోనీ

ఇంగ్లాండ్​లోని ఎడ్జ్​బాస్టన్ వేదికగా జరిగిన ప్రపంచ ఛాంపియన్​షిప్​ తుదిపోరులో భారత్​, ఇంగ్లాండ్​ పోటీ పడ్డాయి. వర్షం కారణంగా మ్యాచ్​ను 20 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్​ చేసిన టీమ్​ఇండియా 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. విరాట్​ కోహ్లీ (43), రవీంద్ర జడేజా (33) రాణించడం వల్ల భారత్​ మెరుగైన స్కోర్ సాధించగలిగింది.

130 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లీష్​ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 124 పరుగులు చేసి పరాజయం పాలైంది. ఓపెనర్లు విఫలమైనా.. మోర్గాన్​ (33), బొపారా (30) మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. ఫలితంగా 5 పరుగుల తేడాతో ఇంగ్లాండ్​పై టీమ్ఇండియా విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. 'మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​'గా రవీంద్ర జడేజా, 'మ్యాన్​ ఆఫ్​ ది సిరీస్​'గా శిఖర్​ ధావన్​లు నిలిచారు.

This day that year: India beat England in thrilling final to claim 2nd Champions Trophy title in 2013
విజయోత్సవంలో టీమ్ఇండియా ఆటగాళ్లు

రెండోసారి విజేతగా..

ఆస్ట్రేలియా తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రపంచ ఛాంపియన్​గా అవతరించిన రెండో జట్టుగా టీమ్​ఇండియా ఘనత సాధించింది. 2002లో శ్రీలంకలో జరిగిన ఛాంపియన్​షిప్ టోర్నీలో వర్షం కారణంగా లంక, భారత్​లను ఆ ఏడాది సంయుక్త విజేతలుగా ప్రకటించారు.

ఇదీ చూడండి... 'టెస్టుల్లో రాహుల్​కు కీపింగ్ బాధ్యతలు ఇవ్వొద్దు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.