ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్​ వాయిదా.. ధోనీ కెరీర్​పై నీలినీడలు! - ధోనీ భవితవ్యం

భారత క్రికెట్ జట్టులో తనదైన ముద్ర వేసిన ధోనీ.. ఐపీఎల్​ 13వ సీజన్​లో సత్తా చాటి ఈ ఏడాది టీ20 ప్రపంచకప్​తో జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇస్తాడని అంతా భావించారు. కానీ అనూహ్య రీతిలో కరోనా కారణంగా ఈ మెగాటోర్నీ వాయిదా పడింది. దీంతో మహీ.. టీమ్​ఇండియా పునరాగమనానికి బ్రేక్​ పడినట్లైంది. ప్రస్తుతం అతడి పరిస్థితి ఏంటనే విషయమై పెద్ద చర్చే నడుస్తోంది.

dhoni
ధోనీ
author img

By

Published : Jul 21, 2020, 6:03 PM IST

గతేడాది ప్రపంచకప్​లో న్యూజిలాండ్​తో జరిగిన సెమీస్​లో చివరగా ఆడిన టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ.. ఆ తర్వాత ఆటకు తాత్కాలిక విరామం ప్రకటించాడు. ఈ నేపథ్యంలో మహీ రీఎంట్రీ కోసం సుదీర్ఘ కాలం నుంచి అభిమానులు సహా మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ అతడు మాత్రం ఇప్పటివరకు దీనిపై మౌనం పాటిస్తూ వచ్చాడు.

ఐపీఎల్​తో జాతీయ జట్టులోకి

ఈ ఏడాది ఐపీఎల్​లో సత్తాచాటి అక్టోబరులో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్​ జట్టులో మహీ చోటు దక్కించుకుంటాడని అంతా భావించారు. మార్చిలో చెన్నై సూపర్ కింగ్స్ శిక్షణా శిబిరంలో ధోనీ ప్రాక్టీసు కూడా చేశాడు. కానీ దేశంలో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో లాక్​డౌన్​ విధించగా ఐపీఎల్​ను ​నిరవధిక వాయిదా వేసింది బీసీసీఐ. దీంతో అతడి కెరీర్​పై నీలినీడలు కమ్ముకున్నాయి.

dhoni
ధోనీ

ప్రపంచకప్ వాయిదా పడింది .. మరి ధోనీ పరిస్థితేంటి?

బీసీసీఐ భావించినట్లు.. కరోనా నేపథ్యంలో టీ20 ప్రపంచకప్​ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది ఐసీసీ. దీంతో ఐపీఎల్​ నిర్వహణకు మార్గం సుగమమైంది. కానీ మహీ జాతీయ జట్టులోకి రీఎంట్రీపై మళ్లీ ఎదురుచూడాల్సి వస్తోంది. ఒకవేళ అక్టోబరులో ఈ మెగాటోర్నీ జరిగితే.. మహీ ఇందులో ఆడినప్పటికీ టీమ్​ఇండియాకు ఆడే అవకాశం మాత్రం ముందుకు జరిగినట్లైంది.

మరి అప్పటికైనా ధోనీకి జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాలనే ఆలోచన ఉందా? లేక గుడ్​బై చెప్తాడా? జట్టు మేనేజ్​మెంట్​ అతడిని ఎంపిక చేస్తుందా? అతడి కెరీర్​కు బ్రేక్​ పడినట్లేనా? అన్న అనుమానాలు అభిమానులు సహా పలువురు క్రికెటర్లలో మెదులుతున్నాయి. ప్రస్తుతం ఇదే విషయం నెట్టింట హాట్​ టాపిక్​ అయింది.

భిన్నాభిప్రాయాలు

ధోనీ భవితవ్యంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అతడు ఇంకా ఫామ్​ కోల్పోలేదని, సత్తా అలానే ఉందని తప్పకుండా జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇస్తాడని కొంతమంది మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. మరికొంతమంది అతడు రిటైర్మెంట్​ ప్రకటిస్తాడని అంటున్నారు. ఏదేమైనప్పటికీ అతడి భవితవ్యం తేలాలంటే మహీ నోరు విప్పేదాకా వేచి ఉండాల్సిందే.

పంత్​, రాహుల్​కు అవకాశం.. ధోనీ కష్టమే

ధోనీ తాత్కాలిక విరామం ప్రకటించాక... అతడి స్థానంలో యువ ఆటగాళ్లు పంత్​, కేఎల్​ రాహుల్​ టీమ్​ఇండియా వికెట్​ కీపర్​గా​ బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. అయితే పంత్​ నిరాశపరిచినప్పటికీ.. రాహుల్​ మాత్రం అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ ఏడాది జరిగిన ఆరు వన్డేలు సహా టీ20ల్లో 70.00 స్ట్రైక్​రేట్​తో మంచి ప్రదర్శన చేశాడు. ఈ నేపథ్యంలో బాగా రాణిస్తోన్న రాహుల్​ను పక్కన పెట్టి.. ఆ స్థానాన్ని మళ్లీ ధోనీకి ఇచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ కారణంతోనూ మహీని టీమ్​ఇండియాలోకి తీసుకోవడం కష్టమని పలువురు భావిస్తున్నారు.

dhoni
ధోనీ

అసాధ్యాలను సుసాధ్యం చేశాడు

16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్​గా అసాధ్యాలను సుసాధ్యం చేశాడు టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. ఈ క్రమంలోనే అతడి ఖాతాలో ఎన్నో రికార్డులు వచ్చి చేరాయి. వన్డేల్లో అత్యధిక స్టంపింగ్​లు, వన్డేల్లో సారథి​గా 100కుపైగా విజయాలు, 200 సిక్స్​లు కొట్టిన తొలి భారత బ్యాట్స్​మన్​గా నిలవడమే కాకుండా మరెన్నో ఘనతలు తన పేరిట లిఖించుకున్నాడు.

ఐసీసీ టోర్నీలు అన్నింటిలో విజయవంతమైన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు మహీ. ఈతరం క్రికెటర్లకు ఎందరికో ఆదర్శంగా నిలిచాడు.

ఇది చూడండి : అలా ధోనీ, సాక్షి ప్రేమలో పడ్డారు

గతేడాది ప్రపంచకప్​లో న్యూజిలాండ్​తో జరిగిన సెమీస్​లో చివరగా ఆడిన టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ.. ఆ తర్వాత ఆటకు తాత్కాలిక విరామం ప్రకటించాడు. ఈ నేపథ్యంలో మహీ రీఎంట్రీ కోసం సుదీర్ఘ కాలం నుంచి అభిమానులు సహా మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ అతడు మాత్రం ఇప్పటివరకు దీనిపై మౌనం పాటిస్తూ వచ్చాడు.

ఐపీఎల్​తో జాతీయ జట్టులోకి

ఈ ఏడాది ఐపీఎల్​లో సత్తాచాటి అక్టోబరులో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్​ జట్టులో మహీ చోటు దక్కించుకుంటాడని అంతా భావించారు. మార్చిలో చెన్నై సూపర్ కింగ్స్ శిక్షణా శిబిరంలో ధోనీ ప్రాక్టీసు కూడా చేశాడు. కానీ దేశంలో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో లాక్​డౌన్​ విధించగా ఐపీఎల్​ను ​నిరవధిక వాయిదా వేసింది బీసీసీఐ. దీంతో అతడి కెరీర్​పై నీలినీడలు కమ్ముకున్నాయి.

dhoni
ధోనీ

ప్రపంచకప్ వాయిదా పడింది .. మరి ధోనీ పరిస్థితేంటి?

బీసీసీఐ భావించినట్లు.. కరోనా నేపథ్యంలో టీ20 ప్రపంచకప్​ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది ఐసీసీ. దీంతో ఐపీఎల్​ నిర్వహణకు మార్గం సుగమమైంది. కానీ మహీ జాతీయ జట్టులోకి రీఎంట్రీపై మళ్లీ ఎదురుచూడాల్సి వస్తోంది. ఒకవేళ అక్టోబరులో ఈ మెగాటోర్నీ జరిగితే.. మహీ ఇందులో ఆడినప్పటికీ టీమ్​ఇండియాకు ఆడే అవకాశం మాత్రం ముందుకు జరిగినట్లైంది.

మరి అప్పటికైనా ధోనీకి జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాలనే ఆలోచన ఉందా? లేక గుడ్​బై చెప్తాడా? జట్టు మేనేజ్​మెంట్​ అతడిని ఎంపిక చేస్తుందా? అతడి కెరీర్​కు బ్రేక్​ పడినట్లేనా? అన్న అనుమానాలు అభిమానులు సహా పలువురు క్రికెటర్లలో మెదులుతున్నాయి. ప్రస్తుతం ఇదే విషయం నెట్టింట హాట్​ టాపిక్​ అయింది.

భిన్నాభిప్రాయాలు

ధోనీ భవితవ్యంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అతడు ఇంకా ఫామ్​ కోల్పోలేదని, సత్తా అలానే ఉందని తప్పకుండా జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇస్తాడని కొంతమంది మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. మరికొంతమంది అతడు రిటైర్మెంట్​ ప్రకటిస్తాడని అంటున్నారు. ఏదేమైనప్పటికీ అతడి భవితవ్యం తేలాలంటే మహీ నోరు విప్పేదాకా వేచి ఉండాల్సిందే.

పంత్​, రాహుల్​కు అవకాశం.. ధోనీ కష్టమే

ధోనీ తాత్కాలిక విరామం ప్రకటించాక... అతడి స్థానంలో యువ ఆటగాళ్లు పంత్​, కేఎల్​ రాహుల్​ టీమ్​ఇండియా వికెట్​ కీపర్​గా​ బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. అయితే పంత్​ నిరాశపరిచినప్పటికీ.. రాహుల్​ మాత్రం అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ ఏడాది జరిగిన ఆరు వన్డేలు సహా టీ20ల్లో 70.00 స్ట్రైక్​రేట్​తో మంచి ప్రదర్శన చేశాడు. ఈ నేపథ్యంలో బాగా రాణిస్తోన్న రాహుల్​ను పక్కన పెట్టి.. ఆ స్థానాన్ని మళ్లీ ధోనీకి ఇచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ కారణంతోనూ మహీని టీమ్​ఇండియాలోకి తీసుకోవడం కష్టమని పలువురు భావిస్తున్నారు.

dhoni
ధోనీ

అసాధ్యాలను సుసాధ్యం చేశాడు

16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్​గా అసాధ్యాలను సుసాధ్యం చేశాడు టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. ఈ క్రమంలోనే అతడి ఖాతాలో ఎన్నో రికార్డులు వచ్చి చేరాయి. వన్డేల్లో అత్యధిక స్టంపింగ్​లు, వన్డేల్లో సారథి​గా 100కుపైగా విజయాలు, 200 సిక్స్​లు కొట్టిన తొలి భారత బ్యాట్స్​మన్​గా నిలవడమే కాకుండా మరెన్నో ఘనతలు తన పేరిట లిఖించుకున్నాడు.

ఐసీసీ టోర్నీలు అన్నింటిలో విజయవంతమైన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు మహీ. ఈతరం క్రికెటర్లకు ఎందరికో ఆదర్శంగా నిలిచాడు.

ఇది చూడండి : అలా ధోనీ, సాక్షి ప్రేమలో పడ్డారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.