ETV Bharat / opinion

'తిప్రా' రాక.. త్రిముఖంగా కాక.. త్రిపురలో కమలనాథులకు గుబులు!

author img

By

Published : Feb 9, 2023, 7:18 AM IST

2018లో త్రిపురలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన భాజపా.. ఇప్పుడా పీఠాన్ని నిలబెట్టుకోవటానికి కష్టపడుతోంది. ఐదేళ్ల కిందట కమ్యూనిస్టు కోటను కూల్చిన కమలనాథులకు ఈసారి త్రిపురాధీశుడు ప్రద్యోత్‌దేవ్‌ వర్మ రూపంలో గట్టిపోటీ ఎదురవుతోంది. 2023 ఎన్నికల్లో అందరి కళ్లూ ఇప్పుడు ఆయన పార్టీ తిప్రా మోథీపైనే!

TRIPURA ELECTION 2023
TRIPURA ELECTION 2023

శూన్యం నుంచి త్రిపురలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన భాజపా ఇప్పుడా పీఠాన్ని నిలబెట్టుకోవటానికి కష్టపడుతోంది. ఐదేళ్ల కిందట కమ్యూనిస్టు కోటను కూల్చిన కమలనాథులకు ఈసారి త్రిపురాధీశుడు ప్రద్యోత్‌దేవ్‌ వర్మ రూపంలో గట్టిపోటీ ఎదురవుతోంది. త్రిపుర ఎన్నికల్లో అందరి కళ్లూ ఇప్పుడు ఆయన పార్టీ తిప్రా మోథాపైనే! ఈ తిప్రా కారణంగా త్రిపుర ఎన్నికలు త్రిముఖ సమరంగా మారాయి.

మొఘలాయిలనూ ఓడించిన తెగలు
తిప్రా అంటే త్రిపుర స్థానిక తెగల సమూహం. త్రిపుర రాజ్యాన్ని మాణిక్య వంశం పాలించేది. ఒకదశలో మొఘల్స్‌ను కూడా ఓడించిన ఈ తెగలు ఈశాన్య భారతంలోని త్రిపుర నుంచి ప్రస్తుత బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌ దాకా విస్తరించాయి. భారత్‌పై బ్రిటిష్‌ పెత్తనం మొదలయ్యే దాకా చిట్టగాంగ్‌లోని కొన్ని ప్రాంతాలు వీరి పాలనలోనే భాగంగా ఉండేవి. 18వ శతాబ్దం తర్వాత త్రిపుర మైదాన ప్రాంతం ఆంగ్లేయుల పాలనలోకి వెళ్లింది. పర్వత ప్రాంతం (ప్రస్తుత త్రిపుర) మాణిక్య సంస్థానంగా మారింది.

స్వాతంత్య్రానంతరం ఇది భారత్‌లో భాగమై త్రిపుర రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ, సామాజిక పరిణామాలతో బంగ్లాదేశ్‌, అస్సాం, బెంగాల్‌ తదితర ప్రాంతాల నుంచి ప్రజలు త్రిపురలో వచ్చి స్థిరపడ్డారు. దీంతో త్రిపుర జనాభా నిష్పత్తిలో మార్పులొచ్చాయి. త్రిపుర మాది అనుకునే తిప్రా తెగలు తమ రాజ్యంలోనే తాము వెలివేతకు గురైనట్లు భావించటం ఆరంభించారు. ఈ ఆదివాసీల మద్దతుతో ఐపీఎఫ్‌టీ (ఇండిజినియస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర) ఏర్పడింది.

స్వయంప్రతిపత్తి మండళ్లలో సత్తా చాటారు
గత ఎన్నికల్లో ఈ ఐపీఎఫ్‌టీతో భాజపా పొత్తుపెట్టుకుంది. అంతకుముందు వరకూ త్రిపుర అసెంబ్లీలో ఒక్కసీటు కూడా లేని కమలనాథులు ఐపీటీఎఫ్‌ అండతో ఏకంగా అధికారంలోకి వచ్చేశారు. ఆ తర్వాత వీరి స్నేహానికి గండిపడి బలహీనపడింది. అయితే ఈలోపు త్రిపుర రాజకీయాల్లో కొత్త పరిణామం చోటు చేసుకుంది. అదే... తిప్రా మోథా ఆవిర్భావం. మాణిక్య రాజవంశానికి చెందిన 45 సంవత్సరాల ప్రద్యోత్‌ విక్రమ్‌ వర్మ సారథ్యంలో ఏర్పడ్డ ఈ పార్టీ రాకతో ఆదివాసీలపై ఐపీఎఫ్‌టీ ప్రాబల్యం తగ్గింది.

2021 త్రిపుర ఆదివాసీ ప్రాంతాల స్వయం ప్రతిపత్తి మండలి ఎన్నికల్లో తిప్రా మోథా 30కిగాను 18 సీట్లు గెల్చుకొని తన సత్తా చాటింది. త్రిపుర స్థానికుల హక్కుల కోసం గళమెత్తుతున్న ప్రద్యోత్‌ ప్రత్యేక రాష్ట్రం తిప్రల్యాండ్‌ కావాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తిప్రా మోథా ఆదివాసీ సీట్లన్నింటితోపాటు రాష్ట్రంలో 42 సీట్లలో ఒంటరిగా పోటీ చేస్తోంది. రాజవంశీయుడైన ప్రద్యోత్‌ ఎన్నికల బరిలో దిగకుండా స్థానిక నేతలకే ప్రాధాన్యం ఇవ్వటం గమనార్హం. తద్వారా తనపై భాజపా బురదజల్లే అవకాశాన్ని ఇవ్వలేదాయన.

స్థానిక ఆదివాసీల్లో పట్టున్న తిప్రా పార్టీ ప్రభావం ఈసారి ఎన్నికలపై గట్టిగా పడుతుందని అనుకుంటున్నారు. అది ప్రధాన పార్టీల విజయావకాశాలను దెబ్బతీసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అంతర్గత కుమ్ములాటలతోపాటు తన కూటమిలోని ఆదివాసీ పార్టీ ఐపీఎఫ్‌టీ బలహీనమవటం భాజపాకు ఇబ్బందికరంగా మారింది.

సాధారణంగానైతే ఎన్నికల్లో భాజపా కూటమికి, కమ్యూనిస్టు కూటమికి మధ్య పోటీ ఉండేది. కానీ తిప్రా రాకతో ఎన్నిక త్రిముఖంగా మారింది. సొంతగా అధికారంలోకి వచ్చేన్ని సీట్లు తిప్రాకు వస్తాయని చెప్పటం కష్టమే అయినా... ఇతర పార్టీల అవకాశాలను ఈ పార్టీ ప్రభావితం చేసే పరిస్థితిని కొట్టిపారేయలేం. ఎన్నికల తర్వాత వీలైతే తాను కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతానని ప్రద్యోత్‌ ఇప్పటికే సంకేతాలిస్తుండటం గమనార్హం.

భాజపా ఓట్లకు గండి
తిప్రా రాకతో ఆదివాసీ ఓట్లకు గండిపడుతుందన్న భయం భాజపాలో మొదలైంది. అందుకే వద్దనుకున్న ఐపీఎఫ్‌టీతో ఈ ఎన్నికలకు ముందు మళ్లీ పొత్తు కుదుర్చుకుంది. గతంలో కంటే తక్కువ సీట్లను ఐపీఎఫ్‌టీకి ఇచ్చింది. 55 సీట్లలో భాజపా, 5 సీట్లలో ఐపీఎఫ్‌టీ పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్‌తో కలసి కమ్యూనిస్టులు బరిలోకి దిగుతున్నారు.

శూన్యం నుంచి త్రిపురలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన భాజపా ఇప్పుడా పీఠాన్ని నిలబెట్టుకోవటానికి కష్టపడుతోంది. ఐదేళ్ల కిందట కమ్యూనిస్టు కోటను కూల్చిన కమలనాథులకు ఈసారి త్రిపురాధీశుడు ప్రద్యోత్‌దేవ్‌ వర్మ రూపంలో గట్టిపోటీ ఎదురవుతోంది. త్రిపుర ఎన్నికల్లో అందరి కళ్లూ ఇప్పుడు ఆయన పార్టీ తిప్రా మోథాపైనే! ఈ తిప్రా కారణంగా త్రిపుర ఎన్నికలు త్రిముఖ సమరంగా మారాయి.

మొఘలాయిలనూ ఓడించిన తెగలు
తిప్రా అంటే త్రిపుర స్థానిక తెగల సమూహం. త్రిపుర రాజ్యాన్ని మాణిక్య వంశం పాలించేది. ఒకదశలో మొఘల్స్‌ను కూడా ఓడించిన ఈ తెగలు ఈశాన్య భారతంలోని త్రిపుర నుంచి ప్రస్తుత బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌ దాకా విస్తరించాయి. భారత్‌పై బ్రిటిష్‌ పెత్తనం మొదలయ్యే దాకా చిట్టగాంగ్‌లోని కొన్ని ప్రాంతాలు వీరి పాలనలోనే భాగంగా ఉండేవి. 18వ శతాబ్దం తర్వాత త్రిపుర మైదాన ప్రాంతం ఆంగ్లేయుల పాలనలోకి వెళ్లింది. పర్వత ప్రాంతం (ప్రస్తుత త్రిపుర) మాణిక్య సంస్థానంగా మారింది.

స్వాతంత్య్రానంతరం ఇది భారత్‌లో భాగమై త్రిపుర రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ, సామాజిక పరిణామాలతో బంగ్లాదేశ్‌, అస్సాం, బెంగాల్‌ తదితర ప్రాంతాల నుంచి ప్రజలు త్రిపురలో వచ్చి స్థిరపడ్డారు. దీంతో త్రిపుర జనాభా నిష్పత్తిలో మార్పులొచ్చాయి. త్రిపుర మాది అనుకునే తిప్రా తెగలు తమ రాజ్యంలోనే తాము వెలివేతకు గురైనట్లు భావించటం ఆరంభించారు. ఈ ఆదివాసీల మద్దతుతో ఐపీఎఫ్‌టీ (ఇండిజినియస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర) ఏర్పడింది.

స్వయంప్రతిపత్తి మండళ్లలో సత్తా చాటారు
గత ఎన్నికల్లో ఈ ఐపీఎఫ్‌టీతో భాజపా పొత్తుపెట్టుకుంది. అంతకుముందు వరకూ త్రిపుర అసెంబ్లీలో ఒక్కసీటు కూడా లేని కమలనాథులు ఐపీటీఎఫ్‌ అండతో ఏకంగా అధికారంలోకి వచ్చేశారు. ఆ తర్వాత వీరి స్నేహానికి గండిపడి బలహీనపడింది. అయితే ఈలోపు త్రిపుర రాజకీయాల్లో కొత్త పరిణామం చోటు చేసుకుంది. అదే... తిప్రా మోథా ఆవిర్భావం. మాణిక్య రాజవంశానికి చెందిన 45 సంవత్సరాల ప్రద్యోత్‌ విక్రమ్‌ వర్మ సారథ్యంలో ఏర్పడ్డ ఈ పార్టీ రాకతో ఆదివాసీలపై ఐపీఎఫ్‌టీ ప్రాబల్యం తగ్గింది.

2021 త్రిపుర ఆదివాసీ ప్రాంతాల స్వయం ప్రతిపత్తి మండలి ఎన్నికల్లో తిప్రా మోథా 30కిగాను 18 సీట్లు గెల్చుకొని తన సత్తా చాటింది. త్రిపుర స్థానికుల హక్కుల కోసం గళమెత్తుతున్న ప్రద్యోత్‌ ప్రత్యేక రాష్ట్రం తిప్రల్యాండ్‌ కావాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తిప్రా మోథా ఆదివాసీ సీట్లన్నింటితోపాటు రాష్ట్రంలో 42 సీట్లలో ఒంటరిగా పోటీ చేస్తోంది. రాజవంశీయుడైన ప్రద్యోత్‌ ఎన్నికల బరిలో దిగకుండా స్థానిక నేతలకే ప్రాధాన్యం ఇవ్వటం గమనార్హం. తద్వారా తనపై భాజపా బురదజల్లే అవకాశాన్ని ఇవ్వలేదాయన.

స్థానిక ఆదివాసీల్లో పట్టున్న తిప్రా పార్టీ ప్రభావం ఈసారి ఎన్నికలపై గట్టిగా పడుతుందని అనుకుంటున్నారు. అది ప్రధాన పార్టీల విజయావకాశాలను దెబ్బతీసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అంతర్గత కుమ్ములాటలతోపాటు తన కూటమిలోని ఆదివాసీ పార్టీ ఐపీఎఫ్‌టీ బలహీనమవటం భాజపాకు ఇబ్బందికరంగా మారింది.

సాధారణంగానైతే ఎన్నికల్లో భాజపా కూటమికి, కమ్యూనిస్టు కూటమికి మధ్య పోటీ ఉండేది. కానీ తిప్రా రాకతో ఎన్నిక త్రిముఖంగా మారింది. సొంతగా అధికారంలోకి వచ్చేన్ని సీట్లు తిప్రాకు వస్తాయని చెప్పటం కష్టమే అయినా... ఇతర పార్టీల అవకాశాలను ఈ పార్టీ ప్రభావితం చేసే పరిస్థితిని కొట్టిపారేయలేం. ఎన్నికల తర్వాత వీలైతే తాను కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతానని ప్రద్యోత్‌ ఇప్పటికే సంకేతాలిస్తుండటం గమనార్హం.

భాజపా ఓట్లకు గండి
తిప్రా రాకతో ఆదివాసీ ఓట్లకు గండిపడుతుందన్న భయం భాజపాలో మొదలైంది. అందుకే వద్దనుకున్న ఐపీఎఫ్‌టీతో ఈ ఎన్నికలకు ముందు మళ్లీ పొత్తు కుదుర్చుకుంది. గతంలో కంటే తక్కువ సీట్లను ఐపీఎఫ్‌టీకి ఇచ్చింది. 55 సీట్లలో భాజపా, 5 సీట్లలో ఐపీఎఫ్‌టీ పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్‌తో కలసి కమ్యూనిస్టులు బరిలోకి దిగుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.